SA vs IND: రింకు సిక్స్ కొడితే బాక్స్ బద్దలైంది.. వైరల్ అవుతున్న వీడియో
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా యువ బ్యాటర్ రింకు సింగ్ (Rinku Singh) (68) అర్ధ శతకంతో అలరించాడు. ఈ ఇన్నింగ్స్లో అతడు ఆడిన ఓ భారీ షాట్కు మీడియా బాక్స్ అద్దం పగిలింది.
ఇంటర్నెట్ డెస్క్: మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా (Team India) డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో రింకు సింగ్ (Rinku Singh) (68; 39 బంతుల్లో 9 ఫోర్లు,, 2 సిక్స్లు), సూర్యకుమార్ యాదవ్ (56; 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు) మెరవడంతో మొదట భారత్ 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. వర్షం వల్ల టీమ్ఇండియా ఇన్నింగ్స్ 19.3 ఓవర్ల వద్దే ముగిసింది. అనంతరం డక్వర్త్ లూయిస్ విధానంలో సవరించిన లక్ష్యాన్ని (15 ఓవర్లలో 152) దక్షిణాఫ్రికా 13.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే, ఈ మ్యాచ్లో మొదట్లో నెమ్మదిగా ఆడిన రింకు తర్వాత జోరందుకున్నాడు. 30 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్న రింకు తర్వాత మరింత రెచ్చిపోయాడు. మార్క్రమ్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో వరుసగా రెండు కళ్లు చెదిరే సిక్స్లతో అలరించాడు. అయిదో బంతిని ముందుకొచ్చి వైడ్ లాంగ్లో స్టాండ్స్లో కొట్టిన రింకు.. తర్వాత బంతిని బౌలర్ తలమీదుగా బాదడంతో మీడియా బాక్స్ అద్దం పగిలింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తాను ఆడిన షాట్తో అద్దం పగిలినందుకు మ్యాచ్ అనంతరం బీసీసీఐ నిర్వహించిన చిన్న ఇంటర్వ్యూలో రింకు సింగ్ క్షమాపణలు చెప్పాడు. ‘‘నేను ఆడిన షాట్కు మీడియా బాక్స్ రూమ్ అద్దం పగిలిందని నాకు తెలియదు. డ్రెస్సింగ్ రూమ్కు వచ్చిన తర్వాత ఈ విషయం తెలిసింది. అలా జరిగినందుకు క్షమించండి’’ అని రింకు సింగ్ పేర్కొన్నాడు. అతడు కొంచెం కూడా గర్వం లేకుండా హుందాగా సారీ చెప్పడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సూర్యభాయ్తో మాట్లాడా
సూర్యకుమార్, రింకు సింగ్ క్రీజులో నిలదొక్కుకోవడంతో భారత్ భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూర్యకుమార్తో మాట్లాడిన విషయాలను రింకు పంచుకున్నాడు. ‘‘నేను బ్యాటింగ్కి వెళ్లేసరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. సూర్యభాయ్ నాకు పలు సూచనలు ఇచ్చాడు. ఒత్తిడికి లోనుకాకుండా నీ సహజ శైలిలో ఆడమని చెప్పాడు. క్రీజులో కుదురుకోవడానికి కాస్త సమయ తీసుకున్నా. నిజానికి ఆరంభంలో పిచ్ కాస్త కఠినంగా అనిపించింది. క్రీజులో సెట్ అయిన తర్వాత భారీ షాట్లు ఆడాను’’ అని రింకు సింగ్ వివరించాడు. ఇక, ఈ టీ20 సిరీస్ విషయానికొస్తే.. మొదటి మ్యాచ్ రద్దు కాగా.. సౌతాఫ్రికా రెండో మ్యాచ్లో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. మూడో టీ20 గురువారం జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
తక్కువ స్ట్రైక్ రేట్ విషయంలో విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలను కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. -
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.