IND vs ENG: మేం 30 పరుగులు తక్కువ చేశామేమో.. కానీ మా బౌలర్లు వాళ్లను కుదురుకోనీయలేదు: రోహిత్ శర్మ
వన్డే ప్రపంచకప్లో భారత్కు (Team India) ఎదురేలేదు. డబుల్ హ్యాట్రిక్ విక్టరీతోలతో దూసుకుపోతోంది. తాజాగా తక్కువ స్కోర్లు నమోదైన మ్యాచ్లోనూ ఇంగ్లాండ్ను మట్టికరిపించింది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచుల్లోనూ భారత్ విజయం సాధించింది. లఖ్నవూ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లోనూ (IND vs ENG) క్లిష్ట సమయంలో అద్భుత పోరాటంతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. తొలుత బ్యాటింగ్లో కీలక సమయాల్లో వికెట్లను చేర్చుకుని తక్కువ స్కోరుకే పరిమితమైనప్పటికీ.. బౌలింగ్ దళం చెలరేగడంతో 100 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఈ విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. ఈ మ్యాచ్లో రోహిత్ 87 పరుగులు చేశాడు. భారీ షాట్ ఆడే క్రమంలో ఔటై సెంచరీని చేజార్చుకున్నాడు. అనవసర షాట్లకు యత్నించి తనతోపాటు మిగతావారిలో ఎక్కువ మంది వికెట్లను సమర్పించారని రోహిత్ తెలిపాడు.
‘‘జట్టులోని ప్రతి ఆటగాడికీ కఠిన పరీక్ష పెట్టిన మ్యాచ్ ఇది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో అనుభవ ప్లేయర్లు అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు మేం ఆడిన తీరు వేరు.. ఈ మ్యాచ్లో చేసిన పోరాటం వేరు. తొలి ఐదు గేముల్లో మేం లక్ష్య ఛేదనకే దిగాం. ఈసారి మాత్రం తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. బౌలింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై ఇంగ్లాండ్ అద్భుత బౌలింగ్ను ఎదుర్కొని మరీ స్కోరు బోర్డుపై ఆ పరుగులను ఉంచగలిగాం. అయితే, బ్యాటింగ్లో అనుకున్నంతమేర రాణించలేదనే చెప్పాలి. నాతో పాటు మరికొందరు అనవసరంగా వికెట్లను సమర్పించారు. మా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఓ 30 పరుగులు తక్కువ చేసినట్లు అనిపించింది.
కానీ, భారత బౌలింగ్ విభాగం అద్భుతం చేసింది. ప్రతిసారీ ఇలాగే జరుగుతుందని చెప్పలేం. అయితే, ఆరంభంలో రెండు లేదా మూడు వికెట్లు తీస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెరగడం ఖాయం. ఇదే మా బౌలర్లు పాటించిన సూత్రం. కీలక సమయాల్లో వికెట్లు తీసి ఇంగ్లాండ్ను కుదురుకోనీయలేదు. పిచ్ పరిస్థితులను కూడా సద్వినియోగం చేసుకుని చెలరేగిపోయారు. స్వింగ్తోపాటు పిచ్ నుంచి కూడా తమకు సహకారం లభించడంతో ఇంగ్లాండ్కు బ్యాటింగ్ చాలా కష్టంగా మారిపోయింది. లైన్ అండ్ లెంగ్త్కి కట్టుబడి బౌలింగ్ చేయడంతో ఎలా ఆడాలనే సందిగ్ధత బ్యాటర్ల మదిలో కదలడం సహజం. మా బౌలర్ల అనుభవం కూడా మాకు కలిసొచ్చింది. అయితే, ఈ మ్యాచ్లో విజయం సాధించినప్పటికీ కీలక అంశంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. బ్యాటర్లు రాణించి స్కోరు బోర్డుపై వీలైనన్ని ఎక్కువ పరుగులు ఉంచాల్సిందే. అప్పుడే బౌలర్లు స్వేచ్ఛగా బంతులను సంధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటి మ్యాజిక్ స్పెల్స్ను వారి నుంచి ఆశించే అవకాశం దక్కుతుంది. లక్ష్యం మరీ తక్కువగా ఉంటే ఆ ఒత్తిడి బౌలింగ్పైనా పడుతుంది’’ అని రోహిత్ శర్మ అన్నాడు.
లఖ్నవూ వేదికగా జరిగిన మ్యాచ్లో (IND vs ENG) తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 229/9 స్కోరుకే పరిమితమైంది. రోహిత్తోపాటు సూర్య (49) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 129 పరుగులకే ఆలౌటైంది. దీంతో 100 పరుగుల తేడాతో ఘన విజయం భారత్ సొంతమైంది. టీమ్ఇండియా బౌలర్లు షమీ 4, బుమ్రా 3, కుల్దీప్ 2, జడేజా ఒక వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం 12 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘యూవీ అందర్నీ భయపెడతాడు’.. ‘రోహిత్ ఇంగ్లీష్లో పూర్’
ఒకరు మాజీ క్రికెటర్.. మరొకరు ప్రస్తుతం టీమ్ఇండియా కెప్టెన్. వీరద్దరూ కలిసి ఓ షోలో చెప్పిన విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి. -
Rishab Pant: ఆట పట్టించిన అభిమాని.. రిషభ్ పంత్ ఏం చేశాడో తెలుసా?
ప్రముఖ యూట్యూబర్, మరగుజ్జు విభు వర్షిణి (Vibhu Varshney) దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు వీరాభిమాని. ప్రాక్టీస్ చేస్తున్న రిషభ్ పంత్ను.. విభు వర్షిణి పలు ప్రశ్నలు అడుగుతూ చిరాకు తెప్పించాడు. దీంతో అతడిని స్టేడియంలో ఉన్న ఓ గేటుపైకి ఎక్కించాడు.
-
KL Rahul: కేఎల్ రాహుల్ మంచి మనసు.. చక్రాల కుర్చీలో ఉన్న అభిమాని దగ్గరికెళ్లి సెల్ఫీ
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా బుధవారం హైదరాబాద్తో మ్యాచ్ ఆడేందుకు లఖ్నవూ జట్టు భాగ్యనగరానికి వచ్చింది. అయితే ఓ దివ్యాంగుడు లఖ్నవూ జట్టుకు అభిమాని. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ అభిమాని దగ్గరికెళ్లి కరచాలనం చేసి.. అతడి సెల్ఫోన్ తీసుకుని స్వయంగా సెల్ఫీ దిగాడు.
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. మిగిలిన రెండింటి కోసం నాలుగు పోటీ
ఐపీఎల్లో మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ స్కోర్లు నమోదవుతూ అభిమానులను అలరిస్తున్నాయి. అయితే, టాప్ -4లో నిలిచి ప్లేఆఫ్స్కు అర్హత సాధించే జట్లేవనేది ఆసక్తికరంగా మారింది. -
ఓడితే ‘నాకౌట్’ కష్టాలు తప్పవు.. ‘ఉప్పల్’లో వరుణుడు ఏం చేసేనో?
హైదరాబాద్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ మ్యాచ్ వచ్చేస్తోంది. లఖ్నవూతో ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగనుంది. -
ఈ నిర్ణయం థర్డ్ అంపైర్కూ కష్టమే.. సంజూ ఔట్తోనే ఓడిపోయాం: సంగక్కర
సంజూ శాంసన్ ఇచ్చిన క్యాచ్ను దిల్లీ ఫీల్డర్ షై హోప్ అద్భుతంగా పట్టాడు. కానీ, బౌండరీ లైన్కు అతడి పాదం తాకిందనే ఆరోపణలు వచ్చాయి. థర్డ్ అంపైర్ మాత్రం ఔట్గా ఇవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. -
అందుకే వేగంగా బంతులేస్తా.. ఫెరీరాను తొలి బంతికే ఔట్ చేయడంపై కుల్దీప్
దిల్లీ మళ్లీ విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. రాజస్థాన్ను ఓడించడంలో ఆ జట్టు బౌలర్ కుల్దీప్ కీలక పాత్ర పోషించాడు. -
సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. ఫీల్డర్ రెండుసార్లు రోప్ను తాకాడన్న సిద్ధూ!
క్యాచ్ల విషయంలో రిప్లేలో స్పష్టంగా కనిపిస్తున్నా.. నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం అంపైర్లు పొరపాటు చేయడం సరైంది కాదనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. -
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
ఔట్పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్తో వాగ్వాదం చేసిన సంజూ శాంసన్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ చర్యలు తీసుకుంది. ఇలా ప్రవర్తించడం సరైంది కాదంటూ భారీ జరిమానా విధించింది. -
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై.. మే 10న తీర్పు
-
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ని నియమించిన ఈసీ
-
‘యూవీ అందర్నీ భయపెడతాడు’.. ‘రోహిత్ ఇంగ్లీష్లో పూర్’
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. మిగిలిన రెండింటి కోసం నాలుగు పోటీ