Rahul Dravid: నా బ్యాటింగ్ చూశారు.. సిక్స్లు కొట్టారు : ద్రవిడ్ సరదా స్పందన
టీమ్ ఇండియా సిక్స్లు కొట్టడం వెనక ఉన్న రహస్యాన్ని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) వివరించాడు.
ఇంటర్నెట్ డెస్క్ : ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ (IND vs ENG 2024)లో భారత్ అన్ని విభాగాల్లో రాణించింది. 4-1 తేడాతో ప్రత్యర్థిని మట్టి కరిపించి అపూర్వ విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో ఆటగాళ్లు పలు రికార్డులతో చెలరేగగా.. అత్యధిక సిక్స్లు నమోదైన టెస్టు సిరీస్గానూ ఇది చరిత్రలోకి ఎక్కింది. మొత్తం 102 సిక్స్లు నమోదు కాగా.. ఇంగ్లాండ్కే బజ్బాల్ ఆటను చూపించిన రోహిత్ సేన(Team India) అందులో 72 సిక్స్లు బాదింది.
ఈ సిరీస్లో అదరగొట్టిన యువ సంచలనం యశస్వి జైస్వాల్ 29 సిక్స్లు కొట్టి.. రోహిత్ రికార్డును బ్రేక్ చేశాడు. టీమ్ఇండియా సిక్స్ హిట్టింగ్ పవర్పై హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ఫన్నీగా స్పందించాడు. ‘నేను నా బ్యాటింగ్ వీడియోలను జట్టు సభ్యులకు చూపించాను. అందుకే వారు ఇప్పుడు సిక్స్లు కొడుతున్నారు’’ అని సరదాగా అన్నాడు. ‘చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది. ఇది వేరే లెవల్. టీమ్ఇండియా సృష్టించిన అత్యుత్తమ సిక్స్ హిట్టర్ రోహిత్ శర్మ. సిక్స్ కొట్టే నైపుణ్యం, సామర్థ్యం అసాధారణమైంది. ప్రతిసారీ ఆటగాళ్లు సిక్స్ కొడుతున్నప్పుడు.. అది స్టేడియం దాటి వెళ్తుందేమో అనిపించింది’ అని ద్రవిడ్ అన్నాడు.
నాయకులైతే మారారు... మరి ఫలితం మారుస్తారా?
ఇక ఈ సిరీస్ విజయంతో టీమ్ఇండియా WTC పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇదే ఊపు కొనసాగించి ఫైనల్కు చేరి.. టైటిల్ నెగ్గాలని అభిమానులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
-
యూపీఎస్సీ ఫలితాల్లో టీ మాస్టర్ కుమారుడి సత్తా
-
డబ్బన్నావ్.. డబ్బాకొట్టుకున్నావ్!!
-
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
-
అంతా సొంత డబ్బా.. హామీలపై మాట్లాడరేమబ్బా!