ICC rankings: నాలుగేళ్ల తర్వాత టాప్-10లో ముగ్గురు భారత ఆటగాళ్లు.. అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్ చేసిన కుల్దీప్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నాలుగేళ్ల తర్వాత ముగ్గురు భారత ఆటగాళ్లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. ఆసియా కప్లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్(kuldeep yadav) .. అనిల్ కుంబ్లే పేరిట ఉన్న ఓ రికార్డును బద్ధలు కొట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నాలుగేళ్ల తర్వాత ముగ్గురు భారత ఆటగాళ్లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో యువ ఆటగాడు శుభ్మన్ గిల్ (Shubman Gill)తోపాటు సీనియర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) టాప్-10లో నిలిచారు. 759 రేటింగ్ పాయింట్లతో గిల్ రెండో స్థానంలో నిలిచి కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంకు అందుకున్నాడు. ఆసియా కప్లో పాకిస్థాన్పై సూపర్ సెంచరీతో ఆకట్టుకున్న విరాట్ కోహ్లీ రెండు స్థానాలు మెరుగై ఎనిమిదో స్థానంలో నిలిచాడు. వరుసగా మూడు అర్ధ సెంచరీలు బాదిన రోహిత్ శర్మ కూడా రెండు స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానం దక్కించుకున్నాడు. 2019లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టాప్-10లో నిలిచారు. పాక్ ఆటగాళ్లు టాప్-10లో ముగ్గురు కొనసాగుతున్నారు. కెప్టెన్ బాబర్ అజామ్ 863 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఇమాన్ ఉల్ హక్ ఒక స్థానం పడిపోయి ఐదో స్థానంలో నిలిచాడు. ఫకార్ జమాన్ మూడు స్థానాలు దిగజారి పదో స్థానానికి పడిపోయాడు.
అనిల్ కుంబ్లే రికార్డు బద్ధలు కొట్టిన కుల్దీప్
ఆసియా కప్లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన సూపర్-4 మ్యాచ్లో టీమ్ఇండియా 41 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమ్ఇండియా లెగ్స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (kuldeep yadav) నాలుగు వికెట్లు పడగొట్టి వన్డేల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అంతేకాదు భారత్ తరఫున వేగంగా 150 వికెట్లు పడగొట్టిన తొలి స్పిన్నర్గా రికార్డు సృష్టించాడు. కుల్దీప్ యాదవ్ 88 మ్యాచ్ల్లో ఈ రికార్డు అందుకున్నాడు. దీంతో అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డు బద్ధలైంది. కుంబ్లే 106 మ్యాచ్ల్లో 150 వికెట్లు పడగొట్టాడు.
వన్డేల్లో వేగంగా 150 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు
ఆసియా కప్ ఫైనల్ : భారత్ vs పాక్ పోరును మళ్లీ చూస్తామా..? సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..?
- మహ్మద్ షమి- 80 మ్యాచ్ల్లో
- కుల్దీప్ యాదవ్- 88 మ్యాచ్ల్లో
- అజిత్ అగార్కర్- 97 మ్యాచ్ల్లో
- జహీర్ ఖాన్- 103 మ్యాచ్ల్లో
- అనిల్ కుంబ్లే- 106 మ్యాచ్ల్లో
- ఇర్ఫాన్ పఠాన్- 106 మ్యాచ్ల్లో
- రవిచంద్రన్ అశ్విన్- 111 మ్యాచ్ల్లో
- ఆశిష్ నెహ్రా- 113 మ్యాచ్ల్లో
- జవగళ్ శ్రీనాథ్- 115 మ్యాచ్ల్లో
- హర్భజన్ సింగ్- 122 మ్యాచ్ల్లో
- మనోజ్ ప్రభాకర్- 123 మ్యాచ్ల్లో
- వెంకటేశ్ ప్రసాద్- 126 మ్యాచ్ల్లో
- కపిల్ దేవ్- 128 మ్యాచ్ల్లో
- రవీంద్ర జడేజా- 129 మ్యాచ్ల్లో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పూరన్ దంచెన్
ఆఖర్లోనూ భంగపాటే. పేలవ ప్రదర్శనతో పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి ఇండియిన్స్ సీజన్ను ఓటమితో ముగించింది. వాంఖడెలో మొదట తడబడుతూ సాగిన లఖ్నవూకు 200పైగా స్కోరు సాధించే అవకాశం కల్పించి.. ఆ తర్వాత ఛేదనలో మెరుపు ఆరంభం లభించినా తేలిపోయి ఓటమి కొనితెచ్చుకుంది. -
వానా వానా వద్దప్పా!
అసలు జరుగుతుందో లేదో తెలియదు.. కానీ కచ్చితంగా మ్యాచ్ పూర్తవ్వాలని కోరుకుంటున్న అభిమానులు ఎందరో..? జరిగేది ఫైనల్ కాదు.. కానీ అంతకంటే ఎక్కువ ఆసక్తి నెలకొంది ఆ సమరంపై..! -
సెమీస్లో సాత్విక్ జోడీ
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. -
అప్పటి నుంచే ఆ ఆలోచన
అఫ్గానిస్థాన్తో ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్ అనంతరం తొలిసారి రిటైర్మెంట్ ఆలోచన వచ్చిందని, తుది నిర్ణయం తీసుకోవడానికి ఓ నెల సమయం పట్టిందని భారత స్టార్ సునీల్ ఛెత్రి చెప్పాడు. -
ఆర్జనలో రొనాల్డో నం.1
ఫోర్బ్స్ అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. -
మను బాకర్ జోరు
ఒలింపిక్ సెలెక్షన్ ట్రయల్స్లో భారత అగ్రశ్రేణి షూటర్ మను బాకర్ జోరు కొనసాగుతోంది. -
పర్వీన్పై నిషేధం.. చేజారిన ఒలింపిక్ బెర్తు
బాక్సింగ్లో భారత్ ఓ ఒలింపిక్ బెర్తు కోల్పోయింది. -
నా రికార్డులు ప్రస్తుతానికి భద్రమే
తన రికార్డులకు ప్రస్తుతానికి వచ్చిన ముప్పేమి లేదని జమైకా దిగ్గజం ఉసేన్ బోల్ట్ అన్నాడు. -
ట్రయల్స్ వద్దు.. పారిస్కు పంపండి
సెలెక్షన్ ట్రయల్స్లో పాల్గొనాలంటూ తమపై ఒత్తిడి తేవొద్దంటూ పారిస్ ఒలింపిక్ కోటా బెర్తులు సంపాదించిన క్రీడాకారిణులు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు విజ్ఞప్తి చేశారు. -
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
ఐపీఎల్ 2024లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ 18 పరుగుల తేడాతో గెలిచింది. -
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
చెన్నైతో మ్యాచ్ బెంగళూరుకు అత్యంత కీలకం. కానీ, వర్షం పడుతుందనే ఆందోళన ఆ జట్టును వెంటాడుతోంది. ఒకవేళ వర్షం తగ్గితే మాత్రం మ్యాచ్ నిర్వహణకు ఎక్కువ సమయం పట్టుకపోవచ్చు.