IND vs ENG: డాన్ బ్రాడ్మన్ సూత్రమదే.. సర్ఫరాజ్ అలా ఔట్ కావడం సరికాదు: సునీల్ గావస్కర్
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో (IND vs ENG) సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా ఆడేశాడు. కానీ, ఐదో టెస్టులో అనవసర తప్పిదంతో వికెట్ను ఇంగ్లాండ్కు ఇచ్చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో ఐదో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ (56) హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే, రెండోరోజు మూడో సెషన్ ప్రారంభమైన తర్వాత.. తొలి బంతికే వికెట్ను సమర్పించుకున్నాడు. షోయబ్ బషీర్ బౌలింగ్లో అనూహ్యంగా బౌన్స్ అయిన బంతిని ఆడే క్రమంలో స్లిప్లో జో రూట్ చేతికి చిక్కాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఔట్ కావడంపై టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. కుదరుకున్న తర్వాత ఔట్ కావడం ఎలాంటి బ్యాటర్కైనా బాధగానే ఉంటుందని.. ఇలాంటి సమయంలోనే సర్ డాన్ బ్రాడ్మన్ చెప్పిన విషయాలు గుర్తుకొస్తున్నాయని గావస్కర్ వెల్లడించాడు. ఐదో టెస్టు సందర్భంగా కామెంట్రీ బాక్స్లో సునీల్ గావస్కర్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.
‘‘బంతి పిచ్పై పడిన లేచిన తర్వాత.. షాట్ కొట్టేందుకు అనువుగా పైకి లేవలేదు. దానిని ఆడేందుకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. టీ బ్రేక్ తర్వాత తొలి బంతినే ఇలా ఆడాడు. అటువంటి సమయంలో కాస్త బంతిపై దృష్టి పెడితే బాగుండేది. సర్ఫరాజ్ ఔటైనప్పుడు నాకు వెంటనే సర్ డాన్ బ్రాడ్మన్ గుర్తుకొచ్చారు. ఒకసారి ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి బంతిని నేను ఎదుర్కొనే దృక్కోణం ఒకేలా ఉంటుంది. ఒకవేళ నేను 200 స్కోరు మీద ఉన్నా సరే.. ఆ మరుసటి బంతిని ఎదుర్కొనేటప్పుడు నేను ‘0’ మీదే ఉన్నాననుకొని ఇన్నింగ్స్ను కొనసాగిస్తా’ అని అన్నారు. ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ అనసవరమైన షాట్తో వికెట్ను సమర్పించాడు. అదీనూ సెషన్ ప్రారంభమైన తొలి బంతికే ఔట్ కావడం బాధాకరం’’ అని గావస్కర్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..