IND vs ENG: తొలి రోజే భారత ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరిస్తే బాగుండేది: సునీల్ గావస్కర్
మాజీ కెప్టెన్ మృతికి సంతాప సూచికంగా భారత ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ఆలస్యంగా ధరించడంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అసహనం వ్యక్తంచేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్ మృతికి సంతాప సూచికంగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో (IND vs ENG) టీమ్ఇండియా ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించారు. మూడోరోజు మైదానంలోకి దిగేటప్పుడు ఇలా వచ్చారు. అయితే, దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కాస్త అసంతృప్తి వ్యక్తంచేశాడు. మూడో టెస్టు తొలిరోజే మన ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించాడు.
‘‘అసలు చేయకుండా ఉండటం కంటే ఆలస్యంగానైనా చేయడం కాస్త మేలే. కానీ, మొదటిరోజే ఇలా చేసి ఉంటే మరింత గౌరవంగా ఉండేది. టీమ్ఇండియాకు ఆయన కెప్టెన్గా వ్యవహరించారు. ఐదు టెస్టుల సిరీస్లో నాలుగింటికి ఆయనే సారథి. మరొక మ్యాచ్కు పంకజ్రాయ్ నాయకత్వం వహించారు’’ అని గావస్కర్ తెలిపాడు. దత్తాజీరావు గైక్వాడ్ (95) ఫిబ్రవరి 13న వయోభారం వల్ల తుది శ్వాస విడిచారు. అప్పటివరకు జీవించి ఉన్న అతిపెద్ద వయస్కుడైన భారత టెస్టు క్రికెటర్ కూడా ఆయనే కావడం గమనార్హం.
పట్టు బిగిస్తోన్న భారత్
మూడో టెస్టులో భారత్ పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను 319 పరుగులకే ఆలౌట్ చేసిన టీమ్ఇండియా 126 పరుగుల ఆధిక్యం సాధించింది. ఓవర్నైట్ 207/2 స్కోరుతో మూడోరోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో 112 పరుగులు చేసి ఆఖరి 8 వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్ బెన్ డకెట్ (153) భారీ సెంచరీ చేయగా.. స్టోక్స్ (41) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ తన రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించింది. కుటుంబపరమైన ఎమర్జెన్సీ కారణంగా భారత సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ జట్టును వీడాడు. దీంతో రెండో ఇన్నింగ్స్లో పది మందితోనే బ్యాటింగ్ చేయాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.