T20 League : వర్షంతో ఎలిమినేటర్ మ్యాచ్ ఆలస్యం.. ఇప్పుడేం చేస్తారంటే?
టీ20 టోర్నీలో అసలైన అంకం ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ప్లేఆఫ్స్లో భాగంగా రెండు క్వాలిఫయర్ మ్యాచ్లు, ఎలిమినేటర్ మ్యాచ్...
ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్లో ఎలిమినేటర్ మ్యాచ్కు వర్షం బెడద ఉంది. చిరు జల్లుల కారణంగా ఆలస్యంగా ప్రారంభిస్తారని సమాచారం. ప్లేఆఫ్స్ మ్యాచులకు వాతావరణపరంగా ఏమైనా అడ్డంకులు వస్తే పరిస్థితి ఏంటి అని బీసీసీఐ ఇప్పటికే ఆలోచన చేసింది. దాని ప్రకారం ఏం జరగొచ్చంటే...
- షెడ్యూల్ ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాలి. ఇరు జట్లూ 20 ఓవర్లపాటు ఆడతాయి. వర్షం లేదా ఇతర వాతావరణ సమస్యల కారణంగా మ్యాచ్ ఆలస్యమైనా పూర్తి ఓవర్ల కోటాతోనే నిర్వహించే అవకాశం ఉంది. అయితే, మ్యాచ్ కనీసం రాత్రి 9.40 గంటలకైనా ప్రారంభమైతేనే ఆ ఛాన్స్ ఉంటుంది. అంటే ప్లేఆఫ్స్లో మ్యాచ్కు అదనంగా 120 నిమిషాలను కేటాయించింది.
- ఆలస్యమయ్యి రాత్రి 9.40 గంటలకు మ్యాచ్ ప్రారంభమైతే ఓవర్లలో ఎలాంటి కోత లేకుండా నిర్వహిస్తుంది. సాధారణంగా ఇచ్చే 10 నిమిషాల ఇంటర్వల్, టైమ్-ఔట్లు ఎలానూ ఉంటాయి. అదేవిధంగా ఫైనల్ మ్యాచ్ మామూలు షెడ్యూల్ ప్రకారం రాత్రి 8 గంటలకు కాబట్టి.. వర్షం వల్ల ఆలస్యమైనా 10.10 గంటలకు కచ్చితంగా ప్రారంభమైతే పూర్తి ఓవర్లతోనే మ్యాచ్ జరుగుతుంది.
- మే 29న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే అందుబాటులో ఉంది. మ్యాచ్ వాయిదా పడితే మే 30న మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఆ రోజు కూడానూ 120 నిమిషాల అదనపు సమయం ఉంటుంది.
- వర్షం కారణంగా రాత్రి 9.40 గంటల్లోగా మ్యాచ్ ప్రారంభం కాకపోతే.. ఓవర్ల సంఖ్యను తగ్గించవచ్చు. అయితే ప్రతి జట్టు కనీసం 5 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అదీనూ రాత్రి 11.56 గంటలకు ప్లే ఆఫ్ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంటుంది.
- ఇలా అయితే ఇంటర్వల్ 10 నిమిషాలు మాత్రమే ఇస్తారు. టైమ్ఔట్లు ఉండవు. రాత్రి 12.50 గంటలకు మ్యాచ్ పూర్తి కావాలి. అలాగే ఫైనల్ మ్యాచ్ 12.26 గంటలకు ప్రారంభమై 1.20 గంటలకు ఫినిష్ అయిపోవాలి.
- ప్లేఆఫ్స్లో అప్పటికీ 5 ఓవర్ల మ్యాచ్ కూడా ప్రారంభించడానికి వీలుకాకపోతే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. సూపర్ ఓవర్ కూడానూ రాత్రి 12.50 గంటల్లోపే ప్రారంభం కావాలి. సూపర్ ఓవర్ కూడా కుదరని పక్షంలో వేరే ఆలోచన చేసింది.
- సూపర్ ఓవర్ సాధ్యపడననప్పుడు లీగ్ మ్యాచ్ల పాయింట్ల ఆధారంగా విజేతను ప్రకటిస్తారు. ఉదాహరణకు ఎలిమినేటర్లో లఖ్నవూ - బెంగళూరు తలపడతాయి. పైన పేర్కొన్న ప్రకారం లఖ్నవూ విజేతగా నిలుస్తుంది. ఎందుకంటే లీగ్ దశలో లఖ్నవూ ఎక్కువ విజయాలు సాధించి పాయింట్లను దక్కించుకుంది.
- ఫైనల్ మ్యాచ్కు ఎలాగూ రిజర్వ్ డే ఉంది. షెడ్యూల్ ప్రకారం మే 29న తుది పోరుకు సంబంధించిన టాస్ పడినా మ్యాచ్ ప్రారంభం కాకపోతే.. రిజర్వ్డేలో మళ్లీ టాస్ నుంచి స్టార్ట్ చేస్తారు. ముందురోజు మ్యాచ్ మొదలయ్యాక ఆగిపోతే... రిజర్వ్ డే నాడు ఆగిన చోట నుంచే మ్యాచ్ ప్రారంభిస్తారు.
- రిజర్వ్డేలోనూ సూపర్ ఓవర్ కూడా సాధ్యం కాకపోతే... పాయింట్ల పట్టిక ఆధారంగానే విజేతను నిర్ణయిస్తారు. ఫైనల్కి వెళ్లిన ఆ రెండు జట్లలో... లీగ్ దశలో ఏ టీమ్ ఎక్కువ పాయింట్లు సాధించిందో దానినే టైటిల్ విజేతగా ప్రకటిస్తారు.
- ప్లేఆఫ్స్లో భాగంగా రెండు క్వాలిఫయర్ మ్యాచ్లు, ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతాయి. గుజరాత్-రాజస్థాన్ జట్ల మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్లో పాండ్య సేన గెలిచింది. మే 25న లఖ్నవూ-బెంగళూరు ఎలిమినేటర్లో తలపడతాయి. 27న రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఉంటుంది. మే 29న ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ