Cheteshwar Pujara: పుజారాను తప్పించడం మంచిదే: టీమ్ఇండియా మాజీ కోచ్
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారాపై (PUJARA) వేటు పడిన సంగతి తెలిసిందే. విండీస్ పర్యటనకు ఎంపిక చేయకపోడంతో సెలెక్షన్ కమిటీపై విమర్శలు విపరీతంగా వచ్చాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో (WTC Final 2023) తేలిపోయిన భారత బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారాపై వేటు పడింది. జులై 12 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్కు అతడిని ఎంపిక చేయలేదు. దీంతో కొందరు మాజీలు సెలెక్టర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. మరికొందరు సమర్థించారు. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ కోచ్ లాల్చంద్ రాజ్పుత్ కమిటీ నిర్ణయానికి మద్దతుగా నిలిచాడు. విండీస్తో సిరీస్కు పుజారాకు విశ్రాంతినివ్వడం మంచిదేనని పేర్కొన్నాడు. దీనిని సానుకూల ముందడుగుగా స్వీకరించాలని పుజారాకు సూచించాడు.
‘‘విండీస్ సిరీస్తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ మూడో సీజన్ను భారత్ ప్రారంభిస్తుంది. కాబట్టి ఇప్పుడు సీనియర్ ఆటగాడు పుజారాను తప్పించడం వల్ల వచ్చే డబ్ల్యూటీసీ ఫైనల్లోగా యువ ప్లేయర్ను తయారు చేసుకోవడానికి అవకాశం దక్కినట్లు అవుతుంది. యువకులకు ఇంకా ఛాన్స్లు ఇచ్చి మెరుగ్గా ఆడేలా తయారు చేయాలి. రుతురాజ్, జైస్వాల్ వంటి వృద్ధిలోకి రావాలి. వారిని టెస్టుల్లోకి తీసుకొని అవకాశాలు ఇవ్వడం వల్ల రిజర్వ్ బెంచ్ను పటిష్ఠంగా మారుతుంది. దేశవాళీలో అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్ను ఎంపిక చేస్తే బాగుండేది. అయితే, అతడిని పరిగణలోకి తీసుకోకపోవడానికి కారణమేంటో నాకు తెలియదు. ఎలాంటి కారణమైనా సరే ఓసారి అవకాశం ఇవ్వాల్సింది’’ అని లాల్చంద్ అన్నారు.
సెమీస్కు చేరేది వీరే!
‘‘వన్డే ప్రపంచకప్ సెమీస్కు భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా చేరతాయి. ఇక నాలుగో జట్టుగా దక్షిణాఫ్రికా లేదా పాకిస్థాన్లో ఒకరు వస్తారు. స్వదేశంలో మెగా టోర్నీ ఆడనుండటం భారత్కు అడ్వాంటేజ్. బుమ్రా త్వరగా కోలుకుని వస్తే బౌలింగ్ బలోపేతంగా ఉంటుంది. అతడు ఆరంభ, డెత్ ఓవర్లలో వికెట్లను అందించగల సత్తా ఉన్నబౌలర్’’ అని రాజ్పుత్ తెలిపాడు.
అలా వ్యవహరించాల్సింది కాదు: రామన్
సీనియర్ ఆటగాడు పుజారా పట్ల సెలెక్షన్ కమిటీ వ్యవహరించిన తీరు సరైంది కాదని మాజీ కోచ్ రామన్ వ్యాఖ్యానించారు. ‘‘విండీస్తో సిరీస్కు భారత్ నలుగురు ఓపెనర్లను తీసుకుంది. అందుకే పుజారాను తప్పించింది. భారత క్రికెట్ కోసం చాన్నాళ్లు సేవలు అందించిన పుజారాను ఇలా ట్రీట్ చేయడం సరైంది కాదు. చాలాసార్లు దేశవిదేశాల్లో భారత్కు అద్భుతమైన విజయాలు అందించిన బ్యాటర్ పుజారా’’ అని మాజీ కోచ్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM