India vs Srilanka: కృనాల్కు కరోనా.. షాకింగ్ నిజాలు..
టీమ్ఇండియా యువ ఆటగాడు కృనాల్ పాండ్య కరోనా వ్యవహారంలో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి! అతడు గొంతునొప్పి వస్తోందని చెప్పిన వెంటనే బీసీసీఐ వైద్యుడు ర్యాపిడ్ టెస్టు చేయలేదట...
గొంతునొప్పి వస్తుందన్నా పరీక్షించని వైద్యాధికారి!
దిల్లీ: టీమ్ఇండియా యువ ఆటగాడు కృనాల్ పాండ్య కరోనా వ్యవహారంలో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి! అతడు గొంతునొప్పి వస్తోందని చెప్పిన వెంటనే బీసీసీఐ వైద్యుడు ర్యాపిడ్ టెస్టు చేయలేదట. అంతేకాకుండా జట్టు సమావేశానికీ అనుమతి ఇచ్చాడట. శ్రీలంక పర్యటనతో సంబంధం ఉన్న బీసీసీఐ వర్గాలు ఈ విషయం ధ్రువీకరిస్తున్నాయి.
మొదటి టీ20 తర్వాత కృనాల్ పాండ్యకు కరోనా సోకిందని వార్తలు వచ్చాయి. దాంతో రెండో టీ20ని ఒక రోజు వాయిదా వేశారు. కృనాల్తో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మందిని ఐసోలేషన్కు పంపించడంతో జట్టు గెలుపు అవకాశాలు దెబ్బతిన్నాయి. అయితే గొంతునొప్పి అని చెప్పిన వెంటనే వైద్యాధికారి స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదేమో!
వాస్తవంగా జులై 26న కృనాల్ పాండ్య తనకు గొంతు నొప్పి వస్తోందని ప్రధాన వైద్యాధికారి అభిజిత్ సల్వీకి చెప్పాడు. నిబంధనల ప్రకారం ఆరోజు అతడికి ర్యాపిడ్ టెస్టు చేయలేదు. పైగా జట్టు సమావేశంలో పాల్గొనేందుకు అతడికి అనుమతి ఇచ్చాడు. మరుసటి రోజైన 27న ఆర్టీపీసీఆర్ పరీక్ష చేశాడు. ఫలితాలు మధ్యాహ్నం రావడంతో మ్యాచును వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ, ఎస్ఎల్సీ ప్రకటించాయి. మిగతా ఎనిమిది మందికీ పరీక్షలు చేశారు. జట్టంతా నెగెటివ్ అనే వచ్చింది. ఆలస్యంగా తెలిసిన విషయం ఏంటంటే.. శ్రీలంక నుంచి బయల్దేరే ముందు కృష్ణప్ప గౌతమ్, యుజ్వేంద్ర చాహల్కు పాజిటివ్ వచ్చింది.
‘జులై 26న కృనాల్కు గొంతునొప్పి వచ్చింది. నిబంధనల ప్రకారం అతడు వెంటనే వైద్యాధికారిని కలిశాడు. అతడికి ర్యాపిడ్ టెస్టు చేయించి ఐసోలేషన్కు పంపించాల్సింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. ర్యాపిడ్తో కచ్చితమైన ఫలితం వస్తుందని కాదు! కానీ నిబంధనల్లో మొదట చేయాల్సింది మాత్రం అదే. గొంతు నొప్పి ఉన్నప్పటికీ కృనాల్ జట్టు సమావేశానికి హాజరయ్యాడని నేను చెప్పగలను’ అని బీసీసీఐ అధికారి వెల్లడించారు.
‘మరో ప్రశ్న ఏంటంటే.. ఐపీఎల్లో ప్రతి మూడు రోజులకు ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేస్తుంటే శ్రీలంక సిరీసులో ఐదు రోజులకు చేసేందుకు బీసీసీఐ వైద్యబృందం ఎలా అంగీకరించిందో తెలియడం లేదు. నిజానికి సిరీస్ రద్దవ్వకుండా బీసీసీఐ కార్యదర్శి జే షా జోక్యం చేసుకున్నారు. కృనాల్తో కలిసిన వారిని ఐసోలేషన్కు పంపించారు. ఆయన చర్యల వల్లే ఈ సిరీస్ కొనసాగింది. శ్రీలంక క్రికెట్ బోర్డుకు మేలు జరిగింది. కానీ, వైద్యబృందం చురుగ్గా స్పందించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది’ అని బీసీసీఐ ఇన్సైడర్ తెలిపారు. ఈ విషయాన్ని సల్విని అడగ్గా ‘నేనెలాంటి వ్యాఖ్యలు చేయలేను’ అని బదులిచ్చారు.
పాజిటివ్ కావడంతో కృనాల్, గౌతమ్, యూజీ టీమ్ఇండియాతో కలిసి స్వదేశానికి రాలేదు. ఆగస్టు ఆరంభంలో వారు ఇళ్లకు చేరుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!