IPL 2021: సంజూ శాంసన్ కొట్టుడు.. రాజస్థాన్ రాయల్స్ ఓడుడు!
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఈ ఐపీఎల్ సీజన్లో ఊహించని పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. అతడు బ్యాట్ ఝుళిపించిన ప్రతిసారి ఆ జట్టు ఓటముల పాలవుతోంది...
ధావన్ నుంచి ఆరెంజ్ క్యాప్ అందుకున్న రాజస్థాన్ కెప్టెన్
ఇంటర్నెట్డెస్క్: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఈ ఐపీఎల్ సీజన్లో ఊహించని పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. అతడు బ్యాట్ ఝుళిపించిన ప్రతిసారి ఆ జట్టు ఓటముల పాలవుతోంది. ఇప్పటివరకు ఈ సీజన్లో అతడు మూడు మ్యాచ్ల్లో దంచి కొట్టగా అన్నింట్లోనూ రాజస్థాన్ విఫలమైంది. తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లోనూ అదే పరిస్థితి ఎదురైంది.
సంజూ తొలుత ఏప్రిల్లో టోర్నీ ప్రారంభమైనప్పుడు పంజాబ్పై చెలరేగాడు. అప్పుడా మ్యాచ్లో (119) సెంచరీతో చెలరేగగా పంజాబ్ నిర్దేశించిన 222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ 217 పరుగులు చేసింది. దీంతో త్రుటిలో రాజస్థాన్ తొలి విజయాన్ని కోల్పోయింది. అనంతరం రెండో దశలో దిల్లీతో జరిగిన మ్యాచ్లోనూ 155 పరుగుల ఛేదనలో సంజూ (70 నాటౌట్; 53 బంతుల్లో 8x4, 1x6) విజృంభించాడు. కానీ, రాజస్థాన్ 121/6 స్కోరుకే పరిమితమై ఓటమి చవిచూసింది. ఇక సోమవారం హైదరాబాద్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 164/5 స్కోర్ సాధించింది. కెప్టెన్ (82; 57 బంతుల్లో 7x4, 3x6) మరోసారి చెలరేగాడు. అయినా ఫలితం సున్నా. ఈ నేపథ్యంలో రాబోయే మ్యాచ్ల్లో అయినా రాజస్థాన్ గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
టాప్లోకి దూసుకొచ్చాడు..
మరోవైపు సంజూ శాంసన్ ఐపీఎల్లో మూడు వేల పరుగుల మైలురాయి పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన 19వ బ్యాట్స్మన్గా నిలిచాడు. గతరాత్రి హైదరాబాద్పై ధాటిగా ఆడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్లో మూడు వేల పరుగులు పూర్తి చేయడమే కాకుండా ఈ సీజన్లో అత్యధిక పరుగులతో దూసుకుపోతున్నాడు. దిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ (430)ను అధిగమించి సంజూ (433) ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఇక ఇప్పటివరకు సంజూ ఐపీఎల్లో మొత్తం 3,017 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ 6,185 పరుగులతో అందరి కన్నా ముందున్నాడు. ఆ తర్వాత ధావన్ (5,627), రోహిత్ శర్మ (5,556), సురేశ్ రైనా (5,523), డేవిడ్ వార్నర్ (5,449) పరుగులతో వరుసగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM