ఒలింపిక్స్లో మరో 4 క్రీడలకు అవకాశం!
ఈసారి టోక్యో ఒలింపిక్స్లో 4 క్రీడలకు అదనంగా చోటు దక్కింది. అవి కరాటే, స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్, క్లైంబింగ్
ఇంటర్నెట్ డెస్క్: ఈసారి టోక్యో ఒలింపిక్స్లో నాలుగు క్రీడలకు అదనంగా చోటు దక్కింది. అవి కరాటే, స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్, క్లైంబింగ్.
కరాటే: ఆగస్టు 5-7 మధ్యన పోటీలు ఉంటాయి. జపాన్ కరాటేకు చాలా ప్రసిద్ధి. 20 వ శతాబ్దం ప్రారంభంలో జపాన్ అంతటా కరాటే వేగంగా వ్యాపించింది. ప్రస్తుతం ప్రపంచమంతా కరాటేకు ఆదరణ లభిస్తోంది. దీన్ని 1970 నుంచి ఒలింపిక్స్లో చేర్చాలనే డిమాండ్ ఉంది. కానీ ఎట్టకేలకు జపాన్లో జరుగుతుండటం వల్లనేమో ఈ క్రీడ ఈసారి ఒలింపిక్స్లో భాగమైంది. స్త్రీపురుషులకు నాలుగు ప్రత్యేక ఈవెంట్స్ ఉంటాయి. 3 విభిన్న వెయిట్ కేటగరీల్లో పోటీలు ఉంటాయి
స్కేట్ బోర్డింగ్: జులై 25న పురుషుల విభాగంలో పోటీ ప్రారంభమవుతుంది. ఎత్తుకు ఎగిరే ట్రిక్స్, స్టంట్స్ ఉంటాయి. 12 ఏళ్ల నుంచి 47 ఏళ్ల వరకు ఇందులో పాల్గొంటారు. అమెరికా నుంచి నైజా హుస్టన్(పురుషుల) పాల్గొంటారు. బ్రిటన్ నుంచి మహిళల విభాగంలో 13 ఏళ్ల స్కై బ్రౌన్ బరిలో ఉంటారు. ఇది స్ట్రీట్, పార్క్ స్కేటింగ్స్ ఉంటాయి. స్టెయిర్స్, రెయిలింగ్స్, బెంచీలు తదితర వస్తువులను ఉపయోగించుకుంటూ స్కేటర్లు పలు విన్యాసాలు చేస్తారు.
సర్ఫింగ్: అలలతో సయ్యాటలాడే ఈ మూడు రోజుల పోటీలను వాతావరణ అనుకూలతను బట్టి ఎనిమిది రోజుల్లోపు నిర్వహిస్తారు. ఆదివారం ప్రారంభమవుతుంది. టోక్యోకు 60 మైళ్ల దూరంలో గల సముద్రతీరంలోని పట్టణంలో దీన్ని నిర్వహిస్తారు. ఇంటర్నేషనల్ సర్ఫింగ్ అసోసియేషన్ 1995 నుంచి ఒలింపిక్ కమిటీని అడుగుతుండటంతో ఎట్టకేలకు ఈసారి చోటు దక్కింది.
క్లైంబింగ్: ఆగస్టు 3 - 6 మధ్యన ఈ పోటీలు ఉంటాయి. ఇటీవలి సంవత్సరాల్లో దీనికి బాగా ఆదరణ పెరగడంతో ఒలింపిక్స్లో చోటు సంపాయించుకుంది. 95 డిగ్రీల కోణంలో నిలబడిన15 మీటర్ల గోడను ఎక్కాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
తక్కువ స్ట్రైక్ రేట్ విషయంలో విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలను కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. -
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం