Cricket News: బుడగ దాటారు.. వేటు పడింది
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టులోని ముగ్గురు ఆటగాళ్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు నిషేధం విధించింది. శనివారం రాత్రి ఇంగ్లాండ్తో ఆడిన మూడో టీ20లో లంక జట్టు ఓటమిపాలైన సంగతి తెలిసిందే...
ఇంటర్నెట్డెస్క్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టులోని ముగ్గురు ఆటగాళ్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు నిషేధం విధించింది. శనివారం రాత్రి ఇంగ్లాండ్తో ఆడిన మూడో టీ20లో లంక జట్టు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మ్యాచ్ అయ్యాక ముగ్గురు ఆటగాళ్లు బయోబబుల్ దాటి స్థానిక వీధుల్లో తిరుగుతూ కనిపించారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా బయటకు తెలియడంతో వారిపై విచారణకు ఆదేశిస్తున్నట్లు లంక బోర్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే వారిని వన్డే సిరీస్ ఆడేందుకు నిషేధిస్తూ వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని ఆదేశించింది. నిషేధం విధించిన వారిలో సీనియర్ ఆటగాడు కుశాల్ మెండిస్, వికెట్ కీపర్ నిరోషన్ డిక్విల్లా, ఓపెనర్ దనుష్క గుణతిలక ఉన్నారు. కాగా, ఈ ముగ్గురు ఆరోజు మ్యాచ్లో ఆడటం గమనార్హం.
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని జట్లు ఇప్పుడు క్రికెట్ ఆడటం చాలా కష్టమైంది. ఆటగాళ్ల భద్రత కోసం ఆయా బోర్డులు కొవిడ్-19 నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తుండటంతో టోర్నీల నిర్వహణ చాలా కష్టంగా మారింది. సిరీస్ ప్రారంభానికి కనీసం మూడు వారాల ముందే ఆటగాళ్లందరినీ బయోబుడగలోకి పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఏ ఆటగాడు బయటకు వెళ్లకుండా కట్టుదిట్టంగా టోర్నీలు నిర్వహిస్తున్నారు. అయినా అప్పుడప్పుడూ పలువురు క్రికెటర్లు నిబంధనలను గాలికొదిలేసి ఇలా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. దాంతో వైరస్ బారిన పడుతున్నారు. అంతకుముందు పలువురు పాక్ క్రికెటర్లు కూడా పాకిస్థాన్ సూపర్ లీగ్ సందర్భంగా ఇలాగే బయోబుడగ దాటి నిబంధనలు అతిక్రమించిన సంగతి తెలిసిందే.
మరోవైపు శ్రీలంక ఈ మూడు టీ20ల సిరీస్లో పూర్తిగా చేతులేత్తేసింది. దాంతో ఇంగ్లాండ్ 3-0 తేడాతో ఘనంగా సిరీస్ కైవసం చేసుకుంది. ఇది లంక జట్టుకు వరుసగా ఐదో టీ20 సిరీస్ ఓటమి కావడం గుర్తించాల్సిన విషయం. మరికొద్ది నెలల్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఆ జట్టు ఇలా విఫలమవుతుండటంపై పలువురు మాజీలు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఇప్పటికే పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని, వెంటనే తగు చర్యలు తీసుకొని జట్టును కాపాడాలని మాజీ కెప్టెన్ సన్త్ జయసూర్య ఆదివారం ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, టీమ్ఇండియా ఈరోజే శ్రీలంక పర్యటనకు బయలుదేరి వెళ్లింది. అక్కడా జట్టుతో వచ్చేనెల 13 నుంచి మూడు టీ20లు, ఆపై మూడు వన్డేలు ఆడనుంది. మరి గబ్బర్ టీమ్తో తలపడేటప్పుడైనా శ్రీలంక పోటీనిస్తుందో లేదో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!