ఇంకో రెండు, మూడేళ్లు నెట్టుకొస్తా: ఉమేశ్
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో తుది జట్టులో చోటు సంపాదించుకొని మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయాలని ఉందని టీమ్ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశాడు...
టెస్టు ఛాంపియన్షిప్లో కీలక పాత్ర పోషించాలి..
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ తుది జట్టులో చోటు సంపాదించుకొని మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయాలని ఉందని టీమ్ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా ఓ క్రీడాఛానల్తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. అలాగే టీమ్ఇండియాలో ఇంకో రెండు, మూడేళ్లు నెట్టుకొస్తానని అన్నాడు. ఆపై యువకులు జట్టులోకి వస్తారని చెప్పాడు.
‘నాకిప్పుడు 33 ఏళ్లు. ఇంకో రెండు, మూడేళ్లు మాత్రమే టీమ్ఇండియాలో కొనసాగుతా. ఆ తర్వాత యువకులు నా స్థానాన్ని భర్తీ చేస్తారు. ఇది సరైనదేనని భావిస్తా. ఎందుకంటే జట్టుకు ఉపయోగకరం. నాలుగైదు టెస్టు మ్యాచ్లున్న పర్యటనల్లో ఐదారుగురు పేసర్లు ఉంటే జట్టుకు ఎంతో ఉపయోగకరం. ప్రతీ ఒక్కర్నీ రెండేసి మ్యాచ్లు ఆడించొచ్చు. అలా చేస్తే ఆటగాళ్లకు పనిభారం కూడా తగ్గుతుంది. ఇలా చేయడం దీర్ఘకాలంలో ఉపయుక్తంగా ఉంటుంది’ అని ఉమేశ్ చెప్పుకొచ్చాడు.
‘అలాగే నేను విదేశీ పర్యటనల్లో ఎక్కువగా ఆడలేదు. అలాంటి వికెట్లపై సరైన అనుభవం కూడా లేదు. కానీ, ఇప్పటివరకు తగినంత స్థాయిలో టెస్టు క్రికెట్ ఆడాననే అనుకుంటున్నా. దాంతో నాకు కావాలినంత అనుభవంతో పాటు పిచ్లు ఎలా స్పందిస్తాయనేది పూర్తిగా అర్థమైంది. ఇక భవిష్యత్ గురించి ఆలోచిస్తే నాకైతే పెద్ద గాయాలేవీ లేవు. ఒక ఫాస్ట్ బౌలర్గా ఇది నన్ను సంతోషపెడుతుంది. ఎందుకంటే ఒక పేసర్ గాయాలబారిన పడటం మొదలైతే అది కెరీర్ మొత్తం కొనసాగుతుంది. దాంతో ఆటగాడిగా కొనసాగే కాలం తగ్గిపోతుంది. ఆటగాళ్లకు గాయాలయ్యాక కోలుకోవడానికి తగిన సమయం పడుతుంది. దాంతో పునరావాస కేంద్రాల్లో గడపాల్సి వస్తుంది. నేను మాత్రం ఇలా ఎక్కువ సమయం గడపలేదు. చాలా తక్కువ గాయాలే అయినందున తగినంత క్రికెట్ ఆడాను’ అని వివరించాడు.
ఇక ఆస్ట్రేలియా పర్యటనలో రెండో టెస్టులో గాయపడిన ఉమేశ్ తర్వాత ఇంగ్లాండ్తో చివరి రెండు టెస్టులకు ఎంపికయ్యాడు. అయితే, అక్కడా తుది జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు పరిమిత ఓవర్ల క్రికెట్కు దాదాపు దూరమైన అతడు ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో ఆడాలని ఉందన్నాడు. అందుకోసం బాగా కష్టపడుతున్నట్లు వివరించాడు. ‘ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఉండాలని మేమెంతో కష్టపడ్డాం. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో రెగ్యులర్ ఆటగాడిని కాని నేను దీన్నే ప్రపంచకప్గా భావిస్తా. ఆ మ్యాచ్లో నేను మంచి ప్రదర్శన చేసి జట్టు విజయం సాధిస్తే అదెప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్లో జరుగుతున్న నేపథ్యంలో అక్కడ బంతి సీమ్, స్వింగ్ చాలా ముఖ్యమైన అంశాలు. దాంతో నేను కచ్చితంగా తుది జట్టులో ఉంటానని నమ్ముతున్నా’ అని ఉమేశ్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా