Virat Kohli: విరాట్ ఒక్క ఇన్స్టా పోస్టుకు ఎంత వసూలు చేస్తాడంటే..?
భారత్లో అత్యంత ఖరీదైన ఇన్స్టా పోస్టులు విరాట్ కోహ్లీవే(Virat Kohli). అతడు సింగిల్ స్పాన్సర్డ్ పోస్టుకు చేసే మొత్తం కొందరు క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టు ఆదాయం కంటే ఎక్కువ.
ఇంటర్నెట్డెస్క్: టీమ్ ఇండియా రన్ మెషీన్ విరాట్ (Virat Kohli) రికార్డుల్లోనే కాదు.. సంపాదనలో కూడా అందరికంటే ముందున్నాడు. సామాజిక మాధ్యమాల్లోని ఫ్యాన్ ఫాలోయింగ్లో కూడా దేశంలో విరాట్ (Virat Kohli) ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్లో అతడు ఒక్క పోస్టుకు వసూలు చేసే మొత్తం కొందరు క్రికెటర్ల వార్షికాదాయం కంటే ఎక్కువ. ఇటీవల విడుదలైన హూపర్ హెచ్క్యూ జాబితా ఈ విషయాన్ని వెల్లడిస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా ఇన్స్టాలో అత్యధిక మొత్తం ఛార్జి చేసే తొలి 20 మంది పేర్లను విడుదల చేసింది. వీరిలో విరాట్ (Virat Kohli) 14 స్థానంలో ఉన్నాడు. కోహ్లీ (Virat Kohli) సింగిల్ స్పాన్సర్డ్ పోస్టుకు రూ.11 కోట్లు తీసుకుంటాడు. అతడికి 25.5 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. ఈ 20మంది జాబితాలో భారత్ నుంచి అతడొక్కడే స్థానం దక్కించుకోవడం విశేషం. ప్రియాంకా చోప్రా ఈ జాబితాలో 29వ స్థానం దక్కించుకొంది. ఆమె ఒక పోస్టుకు రూ. 4.4 కోట్లు వసూలు చేస్తోంది.
ఈ జాబితాపై హూపర్ హెచ్క్యూ సహ వ్యవస్థాపకుడు మైక్ బాండర్ స్పందిస్తూ.. సూపర్ స్టార్లు ఇన్స్టా నుంచి ఆర్జిస్తున్న సంపాదన చూస్తే ఆశ్చర్యమేస్తోందన్నారు. వీరి సంపాదన ఏళ్లు గడిచేకొద్దీ పెరుగుతోందని వెల్లడించారు. ‘‘ఈ ప్లాట్ఫామ్పై వీరి సంపాదన ఏటా పెరుగుతూనే ఉండటం చూసి నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నాను. కొత్త తరం సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు వచ్చినా.. సంప్రదాయ సెలబ్రెటీల ఆకర్షణ, గ్లామర్ ఏమాత్రం తగ్గనట్లే కనిపిస్తోంది. రొనాల్డో, మెస్సీ మైదానంలోనే కాదు.. డిజిటల్ వేదికలపైనా రాజ్యమేలుతున్నారు. సామాన్యూడిపై వారి బలమైన ప్రభావాన్ని ఇది తెలియజేస్తోంది’’ అని అన్నారు.
తిలక్కు కలిసి రావొచ్చు.. ఫిట్నెస్ కీలకం.. నాలుగులో సూర్య!
హూపర్ హెచ్క్యూ జాబితాలో ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో మెస్సీ ఉన్నాడు. 59.6 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న రొనాల్డో ఒక పోస్టుకు రూ.26.7 కోట్లు తీసుకొంటున్నాడు. 47.9 కోట్ల మంది ఫాలోవర్లతో ద్వితీయ స్థానంలో ఉన్న మెస్సీ రూ.21 కోట్లు వసూలు చేస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.