Shoaib Akhtar: టీ20ల్లో విరాట్ కోహ్లీ రిటైర్ అవ్వాలి.. ఎందుకంటే..?
టీ20 ఫార్మాట్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్ కావాలని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. అయితే, ఇందుకు కారణాలను కూడా వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్తో టీమ్ఇండియాను గెలిపించాడు. ఈ చిరస్మరణీయ విజయాన్నందించిన విరాట్పై ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలందుతున్నాయి. మున్ముందు మరిన్ని మ్యాచ్లు ఆడి గొప్పగా రాణించాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఇదిలాఉంటే, పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మాత్రం ఓ సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చాడు. టీ20ల్లో నుంచి కోహ్లీ రిటైర్ కావాలని పేర్కొన్నాడు. ఎందుకంటే, కోహ్లీ తన పూర్తి శక్తిసామర్థ్యాలను పొట్టి క్రికెట్కు పరిమితం చేయకూడదంటూ పేర్కొన్నాడు. వన్డేల్లో కోహ్లీ ట్రిపుల్ సెంచరీ సాధించగలడని అక్తర్ అభిప్రాయపడ్డాడు.
ఆదివారం పాక్పై 82* పరుగులు కోహ్లీ కెరీర్లోనే అత్యుత్తమం అని షోయబ్ కొనియాడాడు. ‘పాకిస్థాన్తో ఆడిన ఇన్నిగ్స్ విరాట్ కెరీర్లోనే అత్యుత్తమం. సాధించగలననే నమ్మకంతోనే ఆ ప్రదర్శన చేయగలిగాడు. అందుకే తన శక్తిసామర్థ్యాలను టీ20లకు పరిమితం చేయకుండా ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ కావాలని కోరుకుంటున్నా. ఈ నిబద్ధతతో కోహ్లీ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ చేయగలడు’ అంటూ తన యూట్యూబ్ ఛానెల్లో అక్తర్ ఈ అభిప్రాయాన్ని వెల్లడించాడు.
కొంతకాలం పాటు ఫామ్ కోల్పోయిన కోహ్లీపై వచ్చిన విమర్శలపైనా షోయబ్ స్పందించాడు. ‘అతను మూడేళ్లపాటు భారీ ఇన్నింగ్స్ ఏమీ ఆడలేదు. కెప్టెన్సీని వదులుకున్నాడు. అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. అతడి కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగారు. కానీ కోహ్లీ మాత్రం ఎక్కడా సడలకుండా శిక్షణ తీసుకుంటూ.. దీపావళికి ముందురోజు చెలరేగాడు. బాణాసంచా లాంటి ఇన్నింగ్స్ ఆడాడు. తన పునరాగమనానికి ఆ వేదిక, ప్రత్యర్థి సరైనవని భావించినట్లున్నాడు’ అని పాక్ మాజీ పేసర్ పేర్కొన్నాడు. ‘కింగ్ మళ్లీ వచ్చాడు. అతడి ప్రదర్శన ఎంతో ఆనందాన్నిచ్చింది. అతడో గొప్ప క్రికెటర్’ అంటూ కొనియాడాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య