WI vs IND: అ‘స్పిన్’ మాయాజాలంతో విండీస్ విలవిల.. భారత్కు ఇన్నింగ్స్ విజయం
డొమినికా వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి ఇన్నింగ్స్, 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
డొమినికా: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (2023-25) సైకిల్లో భారత్ (Team India)కు అదిరే ఆరంభం లభించింది. డొమినికా వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టడంతో మ్యాచ్ మూడ్రోజుల్లోనే ముగిసింది. 312/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. 421/5 వద్ద డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో 271 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన కరీబియన్ జట్టు.. అశ్విన్ (7/71) స్పిన్ మాయాజాలంతో 130 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ఇన్నింగ్స్, 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో విండీస్ 150 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అరంగేట్రంలోనే శతకంతో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. రెండో టెస్టు జులై 20న మొదలుకానుంది.
విండీస్ పతనం సాగిందిలా..
తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడగొట్టి విండీస్ను దెబ్బకొట్టిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్లోనూ తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. దీంతో కరీబియన్ జట్టు బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. త్యాగ్నారాయణ్ చందర్పాల్ (7)ను జడేజా ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపడంతో విండీస్ పతనం మొదలైంది. కొద్దిసేపటికే క్రెయిగ్ బ్రాత్వైట్ (7) అశ్విన్ బౌలింగ్లో స్లిప్లో రహానెకు చిక్కాడు. టీ విరామ సమయానికి 27/2తో నిలిచిన వెస్టిండీస్ చివరి సెషన్లో ఎనిమిది వికెట్లు కోల్పోయింది. చివరి సెషన్ ఆరంభం కాగానే బ్లాక్వుడ్ (5)ను అశ్విన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కాసేపటికే రీఫర్ (11)ను జడేజా పెవిలియన్కు పంపాడు. సిరాజ్ బౌలింగ్లో ద సిల్వా (13) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
చివరి ఐదు అశ్విన్కే
విండీస్ రెండో ఇన్నింగ్స్లో చివరి ఐదు వికెట్లు అశ్విన్ ఖాతాలోనే చేరాయి. నిలకడగా ఆడుతూ విండీస్ను ఆదుకునే ప్రయత్నం చేసిన అథనేజ్ (28) స్లిప్లో యశస్వి జైస్వాల్కు చిక్కాడు. అల్జారీ జోసెఫ్ (13) శుభ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చాడు. భారీకాయుడు రఖీమ్ కార్న్వాల్ (4), కీమర్ రోచ్ (0)లు ఒకే ఓవర్లో ఔటయ్యారు. ఈ క్రమంలో మూడో రోజు నిర్ణీత ఓవర్లు ముగిశాయి. అయితే, ఆలౌట్కు విండీస్ ఒక వికెట్ దూరంలోనే ఉండటంతో మ్యాచ్ను అరగంట సేపు పొడగించారు. ఆఖర్లో మూడు ఫోర్లు బాదిన వారికన్ (18) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో విండీస్ ఆలౌటైంది.
మొదటి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా ప్లేయర్లలో యశస్వి జైస్వాల్ (171; 387 బంతుల్లో 16×4, 1×6) తొలి మ్యాచ్లోనే సత్తాచాటాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (103; 221 బంతుల్లో 10×4, 2×6) శతకం సాధించగా.. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (76; 182 బంతుల్లో 5×4) అర్ధ శతకం బాదాడు. జడేజా (37 నాటౌట్; 82 బంతుల్లో 3×4, 1×6) కూడా రాణించాడు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, అల్జారీ జోసెఫ్, రఖీమ్ కార్న్వాల్, వారికన్, అథనేజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందరి కళ్లూ అటువైపే.. నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు వారిదేనంటున్న లారా
నాలుగు మ్యాచ్లు ఉన్నా సరే.. ఒకే ఒక్క పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే చివరి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసే అవకాశం ఉంది. -
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
ఐపీఎల్లో సత్తా చాటుతున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి.. ఏపీఎల్లోనూ భారీ ధరను దక్కించుకోవడం విశేషం. -
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
ఆదివారం రాజస్థాన్తో కోల్కతా తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లూ ప్లేఆఫ్స్నకు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంజూ ఆటతీరుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
వరల్డ్ కప్ జట్టులో కొందరు యువ క్రికెటర్లకు అవకాశం రాలేదు. అనుకోకుండా సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ జట్టులోకి వచ్చాడు. అతడి ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. -
ఛెత్రి ఇక చాలని..
ఈ తరానికి భారత ఫుట్బాల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపు పర్యాయపదంగా మారిన సూపర్స్టార్ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది. -
రిటైరైతే కనపడను..
క్రికెట్లో ఉన్నంత కాలం శక్తినంతా ధార పోస్తానని, ఒక్కసారి రిటైరైతే కొంతకాలం ఎవరికీ కనపడనని కింగ్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో జోరుమీదున్న కోహ్లి ఇప్పటివరకు బెంగళూరు తరఫున 13 మ్యాచ్ల్లో 661 పరుగులు చేశాడు. -
వరుణుడు ఆడుకున్నాడు
ఐపీఎల్-17వ సీజన్లో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. పరుగుల పోటీ లేకుండానే సన్రైజర్స్ హైదరాబాద్ను తర్వాతి దశకు చేర్చేశాడు. -
శ్రీజ.. సింగిల్స్లోనూ
తెలుగుతేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్లోనూ పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలవనుంది. -
క్వార్టర్ఫైనల్లో మీరాబా
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మీరాబా లువాంగ్ మైసనాం జోరు కొనసాగుతోంది. -
ఫైనల్లో నిఖత్
ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఎల్డోర్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 52 కిలోల సెమీఫైనల్లో ఆమె 5-0తో కజకిస్థాన్ అమ్మాయి తొమిరిస్ మిర్జాకుల్ను చిత్తు చేసింది. -
భారత ఫుట్బాల్ గుండెచప్పుడు
సునీల్ ఛెత్రి.. భారత ఫుట్బాల్ గుండె చప్పుడు! దాదాపు రెండు దశబ్దాల పాటు అత్యుత్తమ ఆటతో జట్టు భారాన్ని మోసిన వీరుడు. మెరుపు విన్యాసాలతో అభిమానులను మైదానాలకు ఆకర్షించిన సమ్మోహన శక్తి. -
అంజుమ్, స్వప్నిల్ విజయం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో అంజుమ్ మౌద్గిల్, స్వప్నిల్ కుశాలె తమ తొలి విజయాలు సాధించారు. మహిళలు, పురుషుల 50మీ 3 పొజిషన్స్లో వాళ్లు విజేతగా నిలిచారు. -
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
ఐపీఎల్ 17 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఇంకా ప్లేఆఫ్స్కు చేరలేదు. ఆ జట్టు మరో విజయం సాధించి ఇతర జట్ల ఫలితాల అనుకూలిస్తే రెండో స్థానానికి చేరడానికి ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?
-
టెండర్లలో 1.5 శాతం ఆయనకు ఇవ్వాల్సిందే: ఈడీ
-
షర్మిల పిటిషన్.. కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే
-
మోదీపై కేజ్రీవాల్ వ్యాఖ్యలు అర్థం లేనివి: రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM
-
అందరి కళ్లూ అటువైపే.. నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు వారిదేనంటున్న లారా