T20 Cricket: మునివేళ్లపై నిలబెట్టి.. సిక్సర్లతో ముగించారు
టీ20 క్రికెట్ అంటే చూసే ప్రేక్షకులకే కాదు మ్యాచ్లాడే క్రికెటర్లకూ నరాలు తెగే ఉత్కంఠ నెలకొంటుంది. ఒక్కోసారి చివరి బంతివరకూ ఫలితం దాగుడుమూతలాడుతూ రెండు జట్ల ఆటగాళ్లను ఒత్తిడికి గురిచేస్తుంది...
ఆఖరి బంతికి దంచికొట్టిన బ్యాట్స్మెన్ వీరే..!
టీ20 క్రికెట్లో ఒక్కోసారి చివరి బంతివరకూ ఫలితం దాగుడుమూతలాడుతూ రెండు జట్ల ఆటగాళ్లనూ ఒత్తిడికి గురిచేస్తుంది. అలాంటి క్షణాల్లో అసాధారణ పోరాటం చేసిన వాళ్లే విజేతగా నిలుస్తారు. మరీ ముఖ్యంగా ఆఖరి బంతికి సిక్సర్ కొట్టాల్సిన పరిస్థితుల్లో ఆ బ్యాట్స్మెన్ ఎదుర్కొనే ఒత్తడి మాటల్లో వర్ణించలేనిది. గతరాత్రి పంజాబ్తో జరిగిన మ్యాచ్లో రాహుల్ తెవాతియా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఆఖరి రెండు బంతులకు 12 పరుగులు చేయాల్సిన స్థితిలో బంతిని చితకబాది గుజరాత్కు గొప్ప విజయాన్ని అందించాడు. అలా ఈ టీ20 టోర్నీలో ఇప్పటివరకూ చివరి బంతిని స్టాండ్స్లోకి తరలించి విజయాలు సాధించింది ఎవరో ఓ లుక్కేద్దాం..
బ్రావో ముగించాడిలా..
(Photo: Dwayne Bravo Instagram)
ఈ టోర్నీలో తొలిసారి ఆఖరి బంతికి సిక్సర్ సాధించి మ్యాచ్ను గెలిపించింది చెన్నై ఆల్రౌండర్ డ్వేన్బ్రావో. 2012లో కోల్కతాతో జరిగిన ఓ లీగ్ మ్యాచ్లో అతడు ఈఘనత సాధించాడు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా 158/6 స్కోర్ సాధించగా.. చెన్నై 19 ఓవర్లకు 150/4 స్కోర్తో నిలిచింది. ఇక చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సిన స్థితిలో ధోనీ (28), బ్రావో (4) క్రీజులో ఉన్నారు. దీంతో అంతా చెన్నై విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే భాటియా వేసిన తొలి బంతికి బ్రావో సింగిల్ తీయడం, రెండో బంతికి ధోనీ ఔటవ్వడం చకాచకా జరిగిపోయాయి. దీంతో సమీకరణం నాలుగు బంతుల్లో 8 పరుగులుగా మారింది. ఇక జడేజా క్రీజులోకి వచ్చి మూడో బంతికి రెండు పరుగులు, నాలుగో బంతికి ఒక పరుగు సాధించాడు. అనంతరం బ్రావో ఐదో బంతిని వదిలేయడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. చివరి బంతికి 5 పరుగులు అవసరమైన వేళ సిక్సర్ సాధించి చెన్నైకి అద్భుత విజయం అందించాడు. చివరికి బ్రావో (11 నాటౌట్గా; 7 బంతుల్లో 1x6) పరుగులతో నిలిచాడు.
ధోనీ ఒక బౌండరీ, రెండు సిక్సులతో..
(Photo: Dhoni Instagram)
ఇక 2016లో ధోనీ ఉత్కంఠభరితమైన క్షణాల్లో రైజింగ్ పుణె జట్టును ఇలాగే గెలిపించాడు. అయితే, అతడు చివరి మూడు బంతుల్ని ఒక బౌండరీ, రెండు సిక్సర్లకు తరలించాడు. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 172/7 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో పుణె 19 ఓవర్లకు 150/6 స్కోర్తో విజయం కోసం పోరాడుతోంది. అప్పటికి ధోనీ (42), రవిచంద్రన్ అశ్విన్ (1) క్రీజులో ఉన్నారు. ఇక చివరి ఓవర్లో పుణె విజయానికి 23 పరుగులు అవసరమైన స్థితిలో ఉత్కంఠ నెలకొంది. అలాంటి ఒత్తిడిలోనూ ధోనీ రెచ్చిపోయాడు. అక్షర్పటేల్ వేసిన ఆ ఓవర్లో తొలి బంతి డాట్బాల్గా నమోదవ్వగా తర్వాతి బంతి వైడ్గా వెళ్లింది. ఇక మరుసటి బంతిని సిక్సర్గా మలిచిన ధోనీ మూడో బంతిని వదిలేశాడు. దీంతో సమీకరణం ఆఖరి మూడు బంతుల్లో 16 పరుగులుగా మారింది. దీంతో అందరిలోనూ అనుమానాలు రేకెత్తాయి. అయితే, వాటిని పటాపంచలు చేస్తూ మహీ నాలుగో బంతిని బౌండరీకి తరలించాడు. ఇక చివరి రెండు బంతుల్నీ సిక్సర్లుగా దంచికొట్టి పుణెకు అపురూప విజయం ఖాయం చేశాడు. చివరికి ధోనీ (64 నాటౌట్; 32 బంతుల్లో 4x4, 5x6) పరుగులు సాధించాడు.
అంచనాల్లేని భరత్ గెలిపించాడు..
(Photo: KS Bharat Instagram)
గతేడాది బెంగళూరు, దిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లోనూ ఆఖరి బంతికి కోహ్లీ టీమ్ ఇలాగే విజయం సాధించింది. అయితే, ఏమాత్రం అంచనాలు లేని యువ బ్యాట్స్మన్ కేఎస్ భరత్ (78 నాటౌట్; 52 బంతుల్లో 3x4, 4x6) చివరి బంతికి విజయాన్ని ఖాయం చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ 164/5 పరుగుల మోస్తరు స్కోర్ సాధించగా.. ఛేదనలో బెంగళూరు 19 ఓవర్లకు 150/3 స్కోర్తో నిలిచింది. ఆఖరి ఓవర్లో బెంగళూరు విజయానికి 15 పరుగులు అవసరం కాగా భరత్ (70), గ్లెన్మాక్స్వెల్ (45) అప్పటికి క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలోనే అవేశ్ ఖాన్ ఆఖరి ఓవర్ బౌలింగ్ చేయగా.. మాక్సీ తొలి మూడు బంతుల్లో 7 పరుగులే సాధించాడు. ఆపై భరత్ నాలుగో బంతిని వృథా చేయడంతో ఉత్కంఠ మరోస్థాయికి చేరింది. అయితే, ఐదో బంతికి రెండు పరుగులు చేయడంతో ఆఖరి బంతికి 6 పరుగులు అవరమయ్యాయి. అలాంటి స్థితిలో అవేశ్ వైడ్ బాల్ వేయడంతో బెంగళూరుకు ఒక అదనపు పరుగు లభించింది. దీంతో సమీకరణం ఒక బంతికి 5 పరుగులు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆఖరి బంతిని దంచికొట్టిన భరత్ బెంగళూరుకు సిక్సర్తో విజయాన్ని అందించాడు.
ధోనీలాగే తెవాతియా ఆకట్టుకున్నాడు..
(Photo: Rahul Tewatia Instagram)
ఇక తాజాగా గతరాత్రి పంజాబ్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ బ్యాట్స్మన్ రాహుల్ తెవాతియా (13 నాటౌట్; 3 బంతుల్లో 2x6) ఆకట్టుకున్నాడు. 2016లో ధోనీ పంజాబ్పై చివరి రెండు బంతుల్నీ సిక్సర్లుగా మలిచినట్లే ఈ మ్యాచ్లో తెవాతియా మెరుపు బ్యాటింగ్ చేశాడు. దీంతో ఈ సీజన్లో గుజరాత్కు మూడో విజయాన్ని సొంతం చేశాడు. ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 189/9 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో గొప్పగా పోరాడిన గుజరాత్ 19 ఓవర్లకు 171/3 స్కోర్తో నిలిచింది. అయితే, ఆఖరి ఓవర్లో విజయానికి 19 పరుగులు అవసరమైన వేళ గుజరాత్ బ్యాటింగ్ ఆందోళన కలిగించింది. అప్పటికి డేవిడ్ మిల్లర్ (1), హార్దిక్ పాండ్య (27) క్రీజులో ఉండగా. ఒడియన్ స్మిత్ బంతి అందుకున్నాడు. తొలి బంతిని వైడ్గా వేయగా.. మరుసటి బంతికే పాండ్య రనౌటయ్యాడు. దీంతో తెవాతియా క్రీజులోకి వచ్చి రెండో బంతికి సింగిల్ తీశాడు. మూడో బంతిని మిల్లర్ బౌండరీకి తరలించడంతో సమీకరణం మూడు బంతుల్లో 13 పరుగులుగా మారింది. నాలుగో బంతికి మిల్లర్ మరో సింగిల్ తీయడంతో గుజరాత్ ఆశలు వదులుకుంది. ఈ నేపథ్యంలోనే తెవాతియా ఆఖరి రెండు బంతులను స్టాండ్స్లోకి తరలించి ఆ జట్టుకు అద్భుత ముగింపునిచ్చాడు.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?