Bangalore: బెంగళూరు ప్లేఆఫ్స్ బెర్తు తేడా కొడుతోంది.. ఎందుకో తెలుసా?
భారత టీ20 లీగ్లో బెంగళూరు ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే పరిస్థితులు ప్రతికూలంగా మారేటట్లు కనిపిస్తున్నాయి. గతరాత్రి పంజాబ్తో జరిగిన మ్యాచ్లో...
అయినా ఓ సులువైన మార్గం ఉంది..
భారత టీ20 లీగ్లో బెంగళూరు ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే పరిస్థితులు ప్రతికూలంగా మారేటట్లు కనిపిస్తున్నాయి. గతరాత్రి పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు ఓడిపోవడమే అందుకు ప్రధాన కారణం. ఫా డుప్లెసిస్ టీమ్ ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్నా.. లీగ్ స్టేజ్ పూర్తయ్యేసరికి ఏ స్థానంలో నిలుస్తుందో కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర జట్ల సమీకరణాలు పరిగణనలోకి తీసుకుంటే బెంగళూరు అవకాశాలకు గండిపడే ప్రమాదం పొంచి ఉంది.
బెంగళూరు ఇప్పుడెలా ఉంది..
డుప్లెసిస్ నాయకత్వంలో ఈ సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టిన బెంగళూరు మధ్యలో పలు వైఫల్యాలు చవిచూసింది. తర్వాత కొన్ని విజయాలు సాధించి మళ్లీ టాప్-4లోకి దూసుకొచ్చింది. దీంతో ప్లేఆఫ్స్ రేసులో చోటు దక్కించుకునేలా కనిపించింది. కానీ, గతరాత్రి పంజాబ్ చేతిలో ఓటమిపాలవ్వడంతో పరిస్థితులు మారాయి. ప్రస్తుతానికి టాప్-4లో ఉన్నా.. ప్లేఆఫ్స్ రేసులో నిలిచే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 13 మ్యాచ్ల్లో 7 విజయాలు, 6 ఓటములతో నిలవడంతో 14 పాయింట్లతో కొనసాగుతోంది. అయితే, ఇక్కడ నెట్రన్రేట్(-0.323)లో చాలా వెనుకపడిపోయింది. అది ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన చెన్నై (-0.181) కన్నా మరీ తక్కువగా ఉండటం గమనార్హం. దీంతో లీగ్ దశ ముగిసేసరికి.. పరిస్థితులు కఠినంగా మారి నాలుగో స్థానం కోసం ఇతర జట్లతో పోటీపడాల్సి వస్తే రన్రేట్ విషయంలో బెంగళూరు కచ్చితంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అది తప్పించుకోవాలంటే మిగిలి ఉన్న ఒకే ఒక్క మ్యాచ్లో సంచలన విజయం సాధించాలి.
ఇతర జట్లు ఎలా ఉన్నాయి..
గుజరాత్: హార్దిక్ పాండ్య నేతృత్వంలోని గుజరాత్ ప్రస్తుతం 9 విజయాలతో 18 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో దూసుకుపోతోంది. ఆ జట్టు ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉండటంతో.. రెండూ గెలిచినా 22 పాయింట్లు తన ఖాతాలో వేసుకుంటుంది. దీంతో అగ్రస్థానంతోనే ప్లేఆఫ్స్లో చోటు దక్కించుకుంటుంది. ఒకవేళ ఒకటి ఓడి.. ఒకటి గెలిచినా 20 పాయింట్లతో నిలుస్తుంది. లేదా దురదృష్టంకొద్దీ రెండూ ఓడినా ఇప్పటికే 18 పాయింట్లు సాధించడంతో బెర్తు కచ్చితంగా ఉంటుంది.
లఖ్నవూ: కేఎల్ రాహుల్ సారథ్యంలోని లఖ్నవూ ప్రస్తుతం 8 విజయాలతో 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ జట్టు కూడా ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉండటంతో.. రెండూ గెలిస్తే 20 పాయింట్లు సాధించనుంది. ఒకవేళ ఒక్కటి గెలిచినా 18 పాయింట్లతో నిలుస్తుంది. ఇంకా చెప్పాలంటే.. పరిస్థితులు ఎదురుతన్ని రెండూ ఓడినా 16 పాయింట్లతో ఉంటుంది. అలాంటప్పుడు లీగ్ స్టేజ్ పూర్తయ్యేసరికి కచ్చితంగా మూడు లేదా నాలుగో స్థానమైనా ఎక్కడికీ పోదు.
రాజస్థాన్: సంజూ శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ ఈ సీజన్లో ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 12 మ్యాచ్ల్లో 7 విజయాలు, 5 ఓటములతో 14 పాయింట్లు సాధించి బెంగళూరుతో సమానంగా ఉంది. అయితే, రన్రేట్ మెరుగ్గా ఉండటంతో మూడులో నిలిచింది. ఈ జట్టు ఇంకా రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉండటంతో తనకన్నా తక్కువ పాయింట్లు, రన్రేట్లో వెనుకపడిపోయిన దిగువ స్థానాల్లో నిలిచిన జట్లకన్నా రాజస్థాన్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మిగిలిన రెండు మ్యాచ్ల్లో విజయం సాధిస్తే 18 పాయింట్లతో నిలుస్తుంది. ఒకవేళ ఒకటి ఓడినా 16 పాయింట్లు కచ్చితంగా ఉంటాయి. ఎలాగూ రన్రేట్ పరంగా బాగుండటంతో మంచి పరిస్థితులే కనిపిస్తున్నాయి.
దిల్లీ: రిషభ్పంత్ ఈసారి దిల్లీని అంత మెరుగ్గా నడిపించలేకపోవడంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసులో నిలవడానికి కష్టపడుతోంది. ఒక గెలుపు, ఒక ఓటమి లెక్కన కొనసాగుతూ ఇప్పటివరకు 12 మ్యాచ్ల్లో 6 విజయాలు, 6 ఓటములతో నిలిచింది. దీంతో 12 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో కొనసాగుతోంది. అయితే, రన్రేట్లో దిల్లీ (0.210).. బెంగళూరు (-0.323) కన్నా మెరుగ్గా.. రాజస్థాన్ (0.228) కాస్త తక్కువగా ఉండటంతో మిగిలిన రెండు మ్యాచ్లు కష్టపడి గెలిస్తే సరిపోతుంది. ఒకవేళ ఒకటి గెలిచి, ఒకటి ఓడితే పరిస్థితి ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది.
పంజాబ్: మయాంక్ అగర్వాల్ నేతృత్వంలోని పంజాబ్ గతరాత్రి బెంగళూరుపై విజయం సాధించడంతో ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. దీంతో ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన 12 మ్యాచ్ల్లో దిల్లీ లాగే 6 గెలిచి, 6 ఓటములపాలై 12 పాయింట్లతోనే ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇది కూడా ఫర్వాలేదనిపించే రన్రేట్ (0.023) కలిగి ఉండటంతో మిగిలిన రెండు మ్యాచ్లు గెలిస్తే 3 లేదా 4 స్థానాల్లో చోటు దక్కించుకునే అవకాశం లేకపోలేదు. అది కూడా ఇతర జట్లతో సమానంగా నిలవకుండా ఉంటేనే. ఒకవేళ నిలిచినా రన్రేట్ మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది.
హైదరాబాద్: కేన్ విలియమ్సన్ టీమ్ హైదరాబాద్ ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడి 5 విజయాలు, 6 ఓటములతో 10 పాయింట్లు సాధించి ఏడో స్థానంలో నిలిచింది. అయితే, ఆడాల్సినవి ఇంకా మూడు మ్యాచ్లు ఉండటంతో అన్నీ గెలిస్తే ప్లేఆఫ్స్లో చోటు దక్కే అవకాశం ఉంది. కానీ, హైదరాబాద్ ఇటీవల వరుసగా నాలుగు మ్యాచ్లు ఓటమిపాలవ్వడంతో ఇకపై వరుసగా మూడు గెలవడం అత్యంత కష్టమనే చెప్పాలి. విలియమ్సన్ టీమ్ ఏదైనా అద్భుతం చేసి విశేషంగా రాణిస్తే కనీసం నాలుగో స్థానంలోనైనా చోటు దక్కే వీలుంది.
కోల్కతా: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని కోల్కతా ఈసారి అంత ప్రభావవంతంగా లేదు. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ల్లో 5 విజయాలు, 7 ఓటములతో 10 పాయింట్లు సాధించి 8 స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఆ జట్టుకు ఇంకా టెక్నికల్గా పోటీలో అవకాశం ఉంది. అయితే, కోల్కతా మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించినా 14 పాయింట్లతోనే నిలుస్తుంది. మరోవైపు ఇప్పటికే రాజస్థాన్, బెంగళూరు జట్లు14 పాయింట్లతో కొనసాగుతుండటంతో ఈ జట్టు అవకాశాలు దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అలా కాకపోయినా రన్రేట్ పరంగా దిల్లీ, పంజాబ్, హైదరాబాద్లతో పోటీపడి మరీ నెగ్గాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే బెంగళూరుకు.. దిల్లీ, పంజాబ్ జట్ల నుంచే ప్రధానంగా పోటీ ఉంది. హైదరాబాద్, కోల్కతాలతోనూ పోటీ ఉన్న ప్రస్తుతం ఆ జట్ల పరిస్థితులు చూస్తుంటే టాప్-4లో చోటు దక్కించుకోవడం అంత తేలిక కాదు. మరోవైపు బెంగళూరు తేలిగ్గా ప్లేఆఫ్స్ చేరాలన్నా ఇంకో సులువైన మార్గం ఉంది. అదేంటంటే.. ఇప్పుడు టాప్-3లో ఉన్న గుజరాత్, లఖ్నవూ, రాజస్థాన్ తలా ఒక్కో మ్యాచ్ గెలిచినా.. అవి వరుసగా 20, 18, 16 పాయింట్లు సాధిస్తాయి. దీంతో మూడు స్థానాలు భర్తీ అయిపోతాయి. అలాగే బెంగళూరు కన్నా తక్కువ స్థానాల్లో ఉన్న దిల్లీ, పంజాబ్, హైదరాబాద్, కోల్కతా ఒక్కో మ్యాచ్ ఓడిపోయినా బెంగళూరుకే కలిసివస్తుంది. అప్పుడు ఆ జట్టు మిగిలిన ఏకైక మ్యాచ్లో విజయం సాధించాలి. ఒకవేళ భారీ విజయం సాధిస్తే ఇంకా మంచిది.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..