వాళ్లు రైతు రాబందులు
కాంగ్రెస్కు తెలంగాణ పేరు కూడా ఉచ్చరించే అర్హత లేదని.. నాటి నుంచి తెలంగాణ దుస్థితికి కారణం ఆ పార్టీయేనని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ఒకప్పుడు సుభిక్షంగా, గొప్పగా ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలలో కలిపారని పేర్కొన్నారు. తెలంగాణ గోసకు కాంగ్రెసే కారణమని ఆరోపించారు. నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ అనంతరం మంత్రి జగదీశ్రెడ్డి అధ్యక్షతన హాలియాలో జరిగిన రైతాంగ ధన్యవాద సభలో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్
తెలంగాణ గోసకు వారే కారణం
అభివృద్ధి చూసి ఓర్వలేకే కాంగ్రెస్, భాజపా విమర్శలు
12 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన
ఎత్తిపోతలను పూర్తి చేయకపోతే ఓట్లు అడగం
బడ్జెట్లో దళిత సాధికారతకు రూ. 1000 కోట్లు
‘హాలియా ధన్యవాద సభ’లో ముఖ్యమంత్రి
ఈనాడు నల్గొండ: కాంగ్రెస్కు తెలంగాణ పేరు కూడా ఉచ్చరించే అర్హత లేదని.. నాటి నుంచి తెలంగాణ దుస్థితికి కారణం ఆ పార్టీయేనని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ఒకప్పుడు సుభిక్షంగా, గొప్పగా ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలలో కలిపారని పేర్కొన్నారు. తెలంగాణ గోసకు కాంగ్రెసే కారణమని ఆరోపించారు. నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ అనంతరం మంత్రి జగదీశ్రెడ్డి అధ్యక్షతన హాలియాలో జరిగిన రైతాంగ ధన్యవాద సభలో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మఠంపల్లి, చింతలపల్లి మండలాల గిరిజనులకు రెండు మూడ్రోజుల్లో పట్టాలిస్తామని ప్రకటించారు. ‘కొంతమంది కాంగ్రెస్ నేతలు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు భాజపా వాళ్లు ప్రవర్తిస్తున్నారు. మీలా మాట్లాడటం మాకు చేతకాక కాదు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్, భాజపా విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ నేతలకు ఇవ్వడం చేతకాలేదు. మేం ఇస్తుంటే విమర్శలు చేస్తున్నరు. వాళ్లు రైతు రాబందులు..’ అని సీఎం వ్యాఖ్యానించారు.
కమీషన్ల కోసమే సాగర్ను కట్టారా?
‘‘పదవులు, పైరవీల కోసం కాంగ్రెస్ నాయకులు ప్రజలను బలి పెట్టారు. నాగార్జునసాగర్ ఇంకో 19 కి.మీ. ఎగువన కట్టాలే. కాని దుర్మార్గుడు కేఎల్రావు తెలంగాణ నీటి వాటాను తగ్గించి వారి ప్రాంతానికి నీళ్లను తీసుకుపోయిండు. ఏలేశ్వరం వద్ద సాగర్ను కడితే ఇప్పుడు ఈ ఎత్తిపోతల పథకాల అవసరమే ఉండకుండే. ఆంధ్రకు అనుకూలంగా ప్రాజెక్టులు కడితే మూగనోము వహించింది ఈ కాంగ్రెస్ నేతలు కాదా? ప్రజలకు వారు సమాధానం చెప్పాలి. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని నిండు సభలో అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ నేత కూడా నిలదీయలేదు. ఇప్పుడు పొలంబాట, పోరుబాట అంటూ సీఎల్పీ నేత బయల్దేరారు. ప్రాజెక్టులను కడితే కమీషన్ల కోసమే కడుతున్నారు అంటున్నారు. అప్పట్లో మీరు నాగార్జునసాగర్ను కమీషన్ల కోసమే కట్టారా? ప్రజాస్వామ్యంలో ప్రజలు మౌనంగా ఉంటే కుదరదు. ఫ్లోరైడ్ సమస్య నల్గొండ జిల్లాలోని ఒక తరాన్ని నాశనం చేసింది. లక్షన్నరమంది జీవితాలు నాశనం అయ్యాయి. మేం ఫ్లోరైడ్ను నూరు శాతం తరిమేశాం. రెండు పంటలకు నీళ్లిస్తున్నాం. అవినీతిరహితంగా పాలిస్తున్నాం.
చంద్రబాబు హయాంలో పొలాలను ఎండబెట్టినా ఎవరూ మాట్లాడలేదు. నాడు కరెంటు లేదు. ఎరువుల్లేవు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే అడిగే దిక్కులేదు. దేశంలో అత్యధిక వడ్లు ఎఫ్సీఐకి ఇస్తున్నది తెలంగాణ రాష్ట్రమే. ప్రస్తుతం కోటీ పది లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. మరో నాలుగైదు నెలల్లో మరో 25 లక్షల ఎకరాల్లో సాగు అందుబాటులోకి వస్తుంది.
పథకాలు పూర్తిచేయకపోతే ఓట్లు అడగం
నల్గొండ అనాదిగా చాలా నష్టపోయిన జిల్లా. ఏ నాయకుడూ, ముఖ్యమంత్రీ పట్టించుకోలేదు. గతంలో హుజూర్నగర్ ఉప ఎన్నిక జరిగినప్పటి నుంచి జగదీశ్రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నిరంతరం ఇక్కడి సమస్యలను నా దృష్టికి తెస్తున్నారు. రూ. 2,500 కోట్లతో ఎత్తిపోతల పథకాలను మంజూరు చేసి నేడు శంకుస్థాపన చేశాం. ఏడాదిన్నరలోపు వీటిని పూర్తి చేసి నీరందిస్తాం. సాగర్ ఎడమ కాల్వ కింద ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా చర్యలు తీసుకుంటాం. ఏడాదిన్నరలోపు ఎత్తిపోతలను పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం. తెరాస వీరుల పార్టీ. వీపు చూపించే పార్టీ కాదు.
గోదావరి నీళ్లతో నల్గొండ కాళ్లు కడుగుతాం
కృష్ణాలో నీటి లభ్యత తక్కువ. దేవుడు కనికరం వల్ల గత రెండేళ్ల నుంచి నది మంచిగా పారుతోంది. ఒకవేళ ఇక్కడ నీరు లేకపోయినా ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టుతో పాలేరు వాగు నుంచి పెద్దదేవులపల్లి చెరువుకు నీటిని తీసుకొచ్చి సాగర్ ఆయకట్టుకు నీళ్లందిస్తాం. దీనికి రూ. 600 కోట్లతో డీపీఆర్ సిద్ధమయింది. త్వరలో అనుమతులు ఇస్తాం. అవసరమైతే గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసి ఎడమ కాల్వ కింద ఒక్క ఎకరాను కూడా ఎండనివ్వం. గోదావరి నీళ్లతో నల్గొండ కాళ్లు కడుగుతాం.
ఉమ్మడి నల్గొండ సస్యశ్యామలం
డిండి ఎత్తిపోతలను వచ్చే రెండేళ్లలో పూర్తి చేసి నల్గొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తాం. బ్రాహ్మణవెల్లంల, ఎస్ఎల్బీసీలకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించి పూర్తి చేస్తాం. బస్వాపూర్ జలాశయాన్ని పూర్తి చేసి వచ్చే ఖరీఫ్లో ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు నీళ్లిస్తాం. గాలి మాటలకు మోసపోవద్దు. మంచి పార్టీని, మంచి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలే. అలా కాదంటే మన చేతులే కాలుతాయి. మోసపోకుండా, ఆగం కాకుండా నాకు అండగా ఉండండి. మీ సంక్షేమ బాధ్యతను నేను తీసుకుంటా’’ అని సీఎం కేసీఆర్ వివరించారు.
12 ఎత్తిపోతలకు శంకుస్థాపనలు
హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ చేరుకున్న ముఖ్యమంత్రికి శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితో పాటు మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, పార్టీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం నెల్లికల్ వద్ద కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాలకు చెందిన 12 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. వాటిలో నెల్లికల్, పెద్దవూర మండలంలోని పుల్యా తండా వద్ద లోలెవల్ కెనాల్ టు హైలెవల్ కెనాల్, బాల్నేపల్లి - చాప్లా అడవిదేవులపల్లి, బొత్తలపాలెం - వాడపల్లి, కేశవాపురం - కొండ్రపోల్, జాన్పహడ్ కెనాల్ లైనింగ్, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లైనింగ్, ఏకేబీఆర్ అంగడిపేట, పీఏ పల్లి మండలంలోని పెద్దగట్టు, అంబ భవాని, కంబాలపల్లి, పొగిళ్ల ఎత్తిపోతలున్నాయి.
నల్గొండ జిల్లాకు వరాలు
నల్గొండ జిల్లాలోని 844 పంచాయతీలకు ఒక్కొక్క దానికి రూ. 20 లక్షల చొప్పున, ప్రతి మండల కేంద్రానికి రూ. 30 లక్షల చొప్పున సీఎం ప్రత్యేక నిధి ద్వారా విడుదల చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. జిల్లాలోని 8 మున్సిపాల్టీలకు నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. నల్గొండ పురపాలికకు రూ. 10 కోట్లు, మిర్యాలగూడకు రూ. 5 కోట్లు, మరో ఆరు పురపాలికలకు రూ. కోటి చొప్పున ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలోని యాదవులు, గొల్ల కుర్మలు, మత్స్యకారుల అభివృద్ధికి నిధులు కేటాయించి వారి సంక్షేమానికి బాటలు వేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని దళితుల జీవన స్థితిగతులు మరింతగా మెరుగుపడాలని.. అందుకు వచ్చే బడ్జెట్లో ముఖ్యమంత్రి దళిత సాధికారతకు రూ. 1000 కోట్లు కేటాయిస్తామన్నారు.
త్వరలో పింఛన్లు, రేషన్కార్డులు
తెరాస చేస్తున్న కార్యక్రమాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని కేసీఆర్ ప్రశ్నించారు. ‘‘కల్యాణలక్ష్మి ఎక్కడైనా అమలవుతుందా? గతంలో రిజిస్ట్రేషన్, రెవెన్యూ ఆఫీసుల్లోకి పోతే లంచాలివ్వాలి. ఇప్పుడు ధరణితో దానికి అడ్డుకట్ట వేశాం. ‘ధరణి’ ద్వారా ఇప్పటికే చాలావరకు భూ సమస్యలను పరిష్కరించాం. అవసరమైతే కొత్త చట్టాన్ని తెచ్చి భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం. త్వరలోనే జిల్లాలవారీగా పర్యటనలు జరిపి పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తా. రాష్ట్రంలోని అర్హులందరికీ త్వరలోనే పింఛన్లు, రేషన్కార్డులను జారీ చేస్తాం. ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మన మధ్య లేకపోవడం బాధాకరం’’ అని అన్నారు.
నేను చెప్పింది అబద్ధమైతే ఓడించండి
కాంగ్రెస్ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకున్న వారు లేరని కేసీఆర్ విమర్శించారు. ‘‘ముక్త్యా బ్రాంచ్ కెనాల్ను 50 ఏండ్లలో ఎందుకు లైనింగ్ చేయలేదు? దిల్లీలో నామినేట్ చేస్తే వచ్చిన ప్రభుత్వం కాదిది. మాట ఇస్తే ఎన్ని కష్టాలు ఎదురైనా నిలబెట్టుకుంటాం. మిషన్ భగీరథ కింద ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగబోమని చెప్పాం. నల్గొండ ప్రజలు వాస్తవాలు గమనించి న్యాయమైన తీర్పునివ్వాలి. తెలంగాణను కరవు పాల్జేసిందెవరూ? రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా చేసిందెవరూ? గులాబీ జెండా ఎందుకు పుట్టాల్సి వచ్చిందో ప్రజలు ఆలోచించాలి. నేను చెప్పింది అబద్ధమైతే సాగర్ ఉప ఎన్నికల్లో తెరాసను ఓడించండి. నిజమని నమ్మితే ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్ దక్కకుండా చేయండి’’ అని కోరారు.
హద్దు మీరితే తొక్కి పడేస్తాం
ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో మాట్లాడుతుండగా ఇతర పార్టీలకు చెందిన కొంతమంది నిరసన తెలిపారు. వారిని బయటకు పంపాలని సీఎం పోలీసులకు సూచించారు. ‘‘వేరే పార్టీల సభకు వచ్చి వీరంగం చేస్తామంటే ఎవరూ హర్షించరు. పిచ్చి పనులు బంద్ చేయాలి. ఆ పార్టీల నాయకత్వాలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. సహనానికి, పిచ్చివాగుడుకు హద్దుంటుంది. హద్దు మీరితే తొక్కి పడేస్తాం. చాలామంది రాకాసులతోనే కొట్లాడాం. వీళ్లొక లెక్కగాదు. సభలు పెట్టుకోవడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు. వారు కూడా సభ పెట్టుకొని ప్రజలకు వివరించాలి’’ అని సీఎం అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!