వారికి ఎదురు చూపులు.. వీరికి అదనపు బాధ్యతలు
రాష్ట్ర క్యాడర్కు చెందిన సీవీ ఆనంద్ కేంద్ర సర్వీసులకు వెళ్లారు. దాదాపు మూడున్నరేళ్లపాటు కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్ఎఫ్)లో పనిచేశారు. డిప్యుటేషన్ పూర్తికావడంతో గత సెప్టెంబరులో తిరిగి రాష్ట్రానికి వచ్చారు. అదనపు డీజీ స్థాయి హోదా ఉన్న ఆయన ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్నారు. ఇలా చాలామందే ఉన్నారు.
పోలీసుశాఖలో విచిత్ర పరిస్థితి
ఈనాడు - హైదరాబాద్
రాష్ట్ర క్యాడర్కు చెందిన సీవీ ఆనంద్ కేంద్ర సర్వీసులకు వెళ్లారు. దాదాపు మూడున్నరేళ్లపాటు కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్ఎఫ్)లో పనిచేశారు. డిప్యుటేషన్ పూర్తికావడంతో గత సెప్టెంబరులో తిరిగి రాష్ట్రానికి వచ్చారు. అదనపు డీజీ స్థాయి హోదా ఉన్న ఆయన ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్నారు. ఇలా చాలామందే ఉన్నారు.
రాష్ట్ర పోలీసు అకాడమీ సంచాలకులుగా పనిచేస్తున్న వి.వి.శ్రీనివాసరావు పోలీసు నియామక మండలి, క్రీడలు, శిక్షణతోపాటు తెలంగాణ పోలీస్ అకాడమీ సంచాలకుడిగా నాలుగు విభాగాల బాధ్యతలు చూస్తున్నారు. ఆయనే కాదు..మరికొందరూ ఇలా అదనపు బాధ్యతల భారాన్ని మోస్తూ వస్తున్నారు.
రాష్ట్ర పోలీసుశాఖలో విచిత్రమైన పరిస్థితికి ఈ ఉదంతాలే నిదర్శనం. ఒకపక్క ఒక్కో అధికారి మూడు నాలుగు బాధ్యతలు నిర్వర్తిస్తుండగా..మరోపక్క అనేక మంది ఉన్నతాధికారులు పోస్టింగుల కోసం ఎదురుచూస్తూ వెయిటింగ్లో కొనసాగుతున్నారు. ఏళ్ల తరబడి ఐపీఎస్ అధికారుల బదిలీలు లేకపోవడంతో పదోన్నతులు పొందినవారు పాత పోస్టుల్లోనే కొనసాగుతుండటం, పదవీ విరమణతో ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయడకపోవడమే దీనికి కారణమనే చర్చ శాఖలో ఉంది. ఉదాహరణకు కరీంనగర్ కమిషనర్గా పనిచేసిన కమలాసన్రెడ్డిని గత జులైలో బదిలీ చేశారు. డీఐజీ హోదాలో ప్రస్తుతం ఆయన వెయిటింగ్లో ఉన్నారు. రాష్ట్ర క్యాడర్కు చెందిన విక్రమ్సింగ్మాన్ ఐదేళ్లపాటు కేంద్ర సర్వీసులకు వెళ్లి సీఐఎస్ఎఫ్లో పనిచేసి రెండు వారాల క్రితం రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ఐజీ స్థాయి అధికారి అయిన ఆయనా వెయిటింగ్లో ఉన్నారు. సూర్యాపేట ఎస్పీ భాస్కరన్ను గత అక్టోబరు నెలలో బదిలీ చేశారు. ఆయనా వెయిటింగ్ జాబితాలో చేరారు. కేంద్ర నిఘా విభాగంలో పనిచేసి తిరిగి రాష్ట్రానికి వచ్చిన ఐజీ విజయ్కుమార్కు దాదాపు మూడు నెలల వెయిటింగ్ తర్వాత శుక్రవారం హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్గా తాత్కాలిక ఎటాచ్మెంట్ ఇచ్చారు.
ఇన్ని బాధ్యతల పర్యవేక్షణ సాధ్యమా
ఒకపక్క కొందరు వెయిటింగ్లో ఉంటే, ఇంకోపక్క కొంతమంది మూడు నాలుగు బాధ్యతలు నిర్వర్తిస్తున్న పరిస్థితి దీర్ఘకాలంగా కొనసాగుతోంది. ఉదాహరణకు అగ్నిమాపకశాఖ డీజీగా పనిచేస్తున్న సంజయ్కుమార్కు.. జైన్ ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగానూ అదనపు బాధ్యతలు అప్పగించారు. డీజీగా ఉన్న గోవింద్ సింగ్ సీఐడీలో కొనసాగుతూనే కీలకమైన అవినీతి నిరోధకశాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు బాధ్యతలు చూస్తున్నారు. హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా పోలీసు కంప్యూటర్ సర్వీస్, శాంతి భద్రతల అదనపు డీజీ జితేందర్ జైళ్లశాఖ డీజీ బాధ్యతలూ చూస్తున్నారు. మరోవైపు ఏళ్లతరబడి బదిలీలు లేకపోవడంతో పదోన్నతులు పొందిన వారు పాత పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. హైదరాబాద్ కమిషనరేట్లో పనిచేస్తున్న ఎ.ఆర్.శ్రీనివాసరావు, విశ్వప్రసాద్, రమేష్రెడ్డిలు డీఐజీ హోదా పొందిన తర్వాత కూడా ఎస్పీ స్థాయి పోస్టుల్లోనే పనిచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి