ధాన్యం కొనుగోలుపై హామీ ఇచ్చేదాకా వదలం
ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని తెరాస ఎంపీలు స్పష్టంచేశారు. పార్లమెంటు సమావేశాల నాలుగో రోజూ ఉభయ సభల్లో తెరాస సభ్యులు ఆందోళన కొనసాగించారు. రాజ్యసభలో పార్లమెంటరీ
పార్లమెంట్ ఉభయ సభల్లో తెరాస సభ్యుల నిరసన
వెల్లో బైఠాయింపు.. వాకౌట్
పార్లమెంటు ఎదుట నినాదాలు చేస్తున్న తెరాస ఎంపీలు కె.ఆర్.సురేష్రెడ్డి, సంతోష్కుమార్, శ్రీనివాస్రెడ్డి,
పి.రాములు, ప్రభాకర్రెడ్డి, దయాకర్, మాలోత్ కవిత, కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, రంజిత్రెడ్డి,
లింగయ్య యాదవ్, వెంకటేష్ నేత, బి.బి.పాటిల్, బండ ప్రకాశ్
ఈనాడు, దిల్లీ: ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని తెరాస ఎంపీలు స్పష్టంచేశారు. పార్లమెంటు సమావేశాల నాలుగో రోజూ ఉభయ సభల్లో తెరాస సభ్యులు ఆందోళన కొనసాగించారు. రాజ్యసభలో పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. సభాధ్యక్ష స్థానంలో ఉన్న వైస్ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్సింగ్ అభ్యంతరం తెలిపారు. వెల్లోకి దూసుకురావడం సరికాదని ఆక్షేపించారు. ‘‘వెల్లోకి రావడం బాధాకరమేనని, ధాన్యం కొనుగోలు సమస్యతో పగిలిన హృదయంతోనే తామొచ్చామని’’ కేశవరావు బదులిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలనే డిమాండ్కు సరైన స్పందన రాకపోవడంతో ఆగ్రహించిన ఎంపీలు చివరికి రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. మరోవైపు లోక్సభలో లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంపీలు నిరసనలు తెలిపారు. ఫ్లకార్డులు పట్టుకుని వెల్లో బైఠాయించారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని, కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని, రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ లోక్సభపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి జోక్యం చేసుకున్నారు. సభలోనే ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్..తెరాస సభ్యుల చెప్పేది ఎందుకు వినడం లేదంటూ ప్రశ్నించారు. చౌధురి మాటలకు ఇతర విపక్షాలు మద్దతు తెలపడంతో సభాపతి ఓం బిర్లా నామా నాగేశ్వరరావుకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. నామా మాట్లాడుతూ.. వరి అత్యధికంగా పండించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
తెరాస సభ్యులు × బండి సంజయ్ వాగ్వాదం
ధాన్యం కొనుగోళ్లపై నామా మాట్లాడుతున్న సమయంలో సభాపతి మైక్ ఆపారు. దీనిపై తెరాస సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేస్తుండగా, భాజపా ఎంపీ బండి సంజయ్ జోక్యం చేసుకుని వారిపై విమర్శలు చేశారు. ‘‘వానాకాలం పంటను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు కొనడం లేదు? యాసంగి పంట కొనమని మీకు ఎవరు చెప్పారు?’’ అంటూ ప్రశ్నించారు. క్యాంటీన్లో ఫొటోలు దిగి పార్లమెంట్లో నిరసన అంటూ తెరాస సభ్యులు ప్రచారం చేసుకుంటున్నారని నినాదాలు చేశారు. బండి సంజయ్కు మిగిలిన భాజపా సభ్యులు తోడవడంతో ఆగ్రహించిన తెరాస ఎంపీలు బండి సంజయ్పై ప్రతి విమర్శలు చేశారు. ఈ క్రమంలో పరస్పరం పరుష పదజాలం ఉపయోగించారు. నిబంధనలకు విరుద్ధంగా సంజయ్ వ్యవహరిస్తున్నా, సభాపతి అదుపుచేయడం లేదంటూ ఆక్షేపించిన తెరాస ఎంపీలు ప్లకార్డులు చించి, విసిరేసి సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం తెలంగాణ భవన్లో తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, పార్టీ ఎంపీలు సభా పరిణామాలు, తదితర అంశాలపై విలేకరులతో మాట్లాడారు.
రైతుల కోసం సహిస్తున్నాం
- కె.కేశవరావు, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత
లోక్సభలో మా ఎంపీలను బండి సంజయ్ తదితరులు దూషిస్తున్నా రైతుల కోసం సహిస్తున్నాం. పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించేందుకు కనీసం మూడేళ్లు పడుతుంది. అప్పటివరకు బాయిల్డ్ రైస్ కొనాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం.
అనేక ఇబ్బందులు పెడుతున్నారు
- నామా నాగేశ్వరరావు, తెరాస లోక్సభ పక్షనేత
రాష్ట్రంలో రైస్ మిల్లులకు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికే అనుమతి ఇస్తున్నారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్లలో బహుముఖంగా ఇబ్బందిపెడుతోంది. కల్లాల్లో పంట కొంటామని చెబుతున్న సంజయ్ పార్లమెంటులో ఎందుకు మాట్లాడడం లేదో సమాధానం చెప్పాలి.
రైతులతో చెలగాటమాడుతున్నారు
- వెంకటేష్, పెద్దపల్లి ఎంపీ
బండి సంజయ్ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. భాజపా ఎంపీలు పార్లమెంట్ను అగౌరవపర్చేలా మాట్లాడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
యూటీఎస్ యాప్ పరిధి పెంపు
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు. -
ఏఈ పోస్టుల జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీజీపీ రవిగుప్తాకు పరిహారం చెల్లించండి
పనిచేయని రిక్లైనర్ సీటును కేటాయించి తీవ్ర అసౌకర్యం కలిగించడం, బిజినెస్(జెడ్) క్లాస్ టికెట్లో ఎకానమీ క్లాస్ సేవలందించిన నేపథ్యంలో డీజీపీ దంపతులకు రూ.2,07,500 పరిహారం చెల్లించాలని సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 ఆదేశించింది. -
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి.