‘నకిలీ’ సిమ్కార్డులతో నేరాలకు ఊతం
‘‘సిమ్కార్డులు కావాలా తీసుకోండి.. వంద, వెయ్యి.. ఎన్నైనా సరే ఇస్తాం’’ అంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ తప్పుడు గుర్తింపు పత్రాలతో పొందిన సిమ్కార్డులను వేలసంఖ్యలో విక్రయిస్తున్నారు. ఇవి
తప్పుడు కేవైసీలతో పొంది గంపగుత్తగా అమ్మకాలు
విక్రయాలపై సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు, ప్రచారం
ఈనాడు, హైదరాబాద్: ‘‘సిమ్కార్డులు కావాలా తీసుకోండి.. వంద, వెయ్యి.. ఎన్నైనా సరే ఇస్తాం’’ అంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ తప్పుడు గుర్తింపు పత్రాలతో పొందిన సిమ్కార్డులను వేలసంఖ్యలో విక్రయిస్తున్నారు. ఇవి దుర్వినియోగం అవుతున్నాయన్న సమాచారంతో కేంద్ర నిఘావర్గాలు గతేడాది జనవరి నుంచి నిఘా పెట్టాయి. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, దిల్లీ రాష్ట్రాల్లో వేల సంఖ్యలో ఇలాంటి సిమ్కార్డులను వినియోగిస్తున్నారని తెలుసుకున్నాయి. ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించగా.. ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు ఆయా రాష్ట్రాల్లో అక్రమంగా సిమ్కార్డులు విక్రయిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. కొన్ని సెల్ఫోన్ నెట్వర్క్ కంపెనీలు లక్ష్యాలను చేరేందుకు కమీషన్ ఎక్కువగా ఇస్తామంటూ గంపగుత్తగా ఏజెంట్లకు ఇస్తున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి.
రూట్కాలింగ్ కేంద్రం.. మూడు వేల సిమ్కార్డులు..
హైదరాబాద్, దిల్లీ, చెన్నై, తిరువనంతపురం, బెంగళూరుల నుంచి విదేశాలకు ఎక్కువగా కాల్స్ వెళ్తున్నాయంటూ కేంద్ర నిఘావర్గాలకు సమాచారం అందింది.. బెంగళూరుకు సమీపంలోని ఓ సైనిక కార్యాలయం నుంచి దుబాయ్కి ఫోన్కాల్స్ వెళ్లడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తీగ లాగితే రూట్కాలింగ్ కేంద్రాల నిర్వాహకులు, సైబర్ నేరస్థులు వేల సంఖ్యలో సిమ్కార్డులను మారుపేర్లలో ఉపయోగిస్తున్నారని తేలింది. వారి పరిశోధన కొనసాగుతుండగానే సికింద్రాబాద్లో రూట్కాలింగ్ కేంద్రం నిర్వహిస్తున్న ఎర్నాకుళం వాసి మహ్మద్ రసూల్ను హైదరాబాద్ పోలీసులు ఆర్నెల్ల క్రితం అరెస్ట్ చేశారు. దుబాయ్, మస్కట్లతో పాటు ఇతర దేశాలకు ఫోన్కాల్స్ చేస్తున్నాడని గుర్తించారు. రూట్కాలింగ్ నిర్వహణకు అవసరమైన సిమ్కార్డులను ఎక్కడినుంచి తీసుకుంటున్నావని పోలీసులు ప్రశ్నించగా... టెలిగ్రామ్ మెసెంజర్ ద్వారా వివరాలు తెలుసుకుని కొరియర్లో మూడువేల సిమ్కార్డులు పంపిచారని చెప్పాడు. ఈ సమాచారాన్ని పోలీసులు కేంద్ర నిఘావర్గాలకు ఇవ్వగా... ఆ సిమ్కార్డుల ఆధారంగా దిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతా నగరాల్లో సిమ్లు వినియోగిస్తున్న వారి వివరాలు తెలిశాయి. 15 వేల సిమ్కార్డులు వారు సమీకరించుకున్నారని గుర్తించాయి.
ఒక ఆధార్.. పదిహేను కలర్ జిరాక్స్లు..
సిమ్కార్డు ద్వారా వచ్చే కమీషన్కు ఆశపడి అక్రమంగా సిమ్కార్డులను విక్రయిస్తున్న ఏజెంట్లు ఒక ఆధార్కార్డుతో పదీపదిహేను కలర్ జిరాక్స్లు తీసుకుంటున్నారు. అనంతరం ఆయా కార్డుల్లో పేర్లు, ఫొటోలు, చిరునామాలను ఇష్టారాజ్యంగా మార్చి సిమ్కార్డులను యాక్టివేట్ చేస్తున్నారు. వీటిని సైబర్ నేరస్థులు, రూట్కాలింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్న వారికి గంపగుత్తగా అమ్మేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో అస్సాం, నాగాలాండ్, మణిపూర్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని మారుమూల జిల్లా కేంద్రాలు, నేషనల్ కాపిటల్ రీజియన్లోని మండల కేంద్రాల్లో సిమ్కార్డులు విక్రయిస్తున్న ఏజెంట్లు ఇలా చేస్తున్నారని తేలింది. కొద్దిరోజుల క్రితం ఆంధ్రపదేశ్కు చెందిన సిమ్కార్డులు కూడా హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎవరెవరు వినియోగిస్తున్నారన్న అంశాలపై పరిశోధిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!