సమతామూర్తి సాకారమైంది ఇలా..
శ్రీరామనగరంలోని సమతాస్ఫూర్తి కేంద్రంలో ప్రతిష్ఠించిన రామానుజాచార్య బృహన్మూర్తి ఆవిష్కరణ నేపథ్యంలో దీని నిర్మాణం వెనుక జరిగిన కృషిని ప్రధాన స్థపతి ‘ఈనాడు’కు ప్రత్యేకంగా వివరించారు. చినజీయర్స్వామి...
విగ్రహ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు
చిన్నజీయర్స్వామి దీక్ష, పట్టుదలకు నిదర్శనం
ఈనాడు, హైదరాబాద్: శ్రీరామనగరంలోని సమతాస్ఫూర్తి కేంద్రంలో ప్రతిష్ఠించిన రామానుజాచార్య బృహన్మూర్తి ఆవిష్కరణ నేపథ్యంలో దీని నిర్మాణం వెనుక జరిగిన కృషిని ప్రధాన స్థపతి ‘ఈనాడు’కు ప్రత్యేకంగా వివరించారు. చినజీయర్స్వామి అకుంఠిత దీక్ష, పట్టుదల, శ్రమ.. విగ్రహం నిర్మాణంలో అడుగడుగునా కనిపిస్తాయి.
ఆరంభం ఇలా..
2013లో మొదలైన ఆలోచనల అనంతరం 2014 మేలో విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తొలుత రామానుజాచార్యుల శ్రీమూర్తి 14 రకాల నమూనాలను చినజీయర్స్వామి తయారు చేయించారు. అందులో మూడింటిని ఎంపిక చేసి, వాటిలో బాగా వచ్చిన రూపురేఖలను మిళితం చేసి, మరో నమూనా తయారు చేశారు. దానికి బెంగళూరులో 3డీ స్కానింగ్ చేయించారు. దాంతో ఆబ్జెక్టు ఫైల్ తయారు చేయించారు. దాన్ని తీసుకువచ్చి ప్రత్యేకంగా వర్క్స్టేషన్ తీసుకుని మాయ, మడ్బ్రష్ సాఫ్ట్వేర్లు వినియోగించి మరింత సుందరంగా మలిచారు. యజ్ఞోపవీతం, శిఖ, గోళ్లు, వేళ్లు, వస్త్రం వంటి సూక్ష్మ అంశాలు కూడా జాగ్రత్తగా తీర్చిదిద్దారు. ప్రధాన స్థపతి ఆధ్వర్యంలో దాదాపు 22 రోజులపాటు నిత్యం 18 నుంచి 19 గంటలపాటు శ్రమించారు. చినజీయర్స్వామి రోజూ రెండు, మూడు గంటలు కేటాయించి సంప్రదాయ, శాస్త్ర, కొలతలకు సంబంధించిన సూచనలిస్తూ, సాఫ్ట్వేర్ ఫైల్ తయారు చేయించారు.
చైనాలో 1600 భాగాలుగా తయారీ
సాఫ్ట్వేర్ ఫైల్ను చైనాలోని ఏరోసెన్ కార్పొరేషన్కు పంపి, క్యాస్టింగ్, అసెంబ్లింగ్ పనులు అప్పగించారు. ప్రత్యేక యంత్రం సాయంతో రోబోటిక్ పరిజ్ఞానం వినియోగించి థర్మోకోల్తో 1:10 మోడల్ (సుమారు 16 నుంచి 17 అడుగుల ఎత్తు)లో నమూనా విగ్రహం తయారు చేయించారు. చినజీయర్స్వామి చైనా వెళ్లి దాన్ని పరిశీలించి సవరణలు చెప్పారు. తర్వాత మరిన్ని సవరణలతో మరో సాఫ్ట్వేర్ ఫైల్ను చైనా పంపించారు. మరోసారి థర్మోకోల్ను 1:1 మోడల్గా కత్తిరించి 20 అడుగుల విగ్రహం తయారు చేశారు. ప్రధాన స్థపతి బృందం వెళ్లి సవరణలు చేసి క్యాస్టింగ్కు అనుమతించారు. అలా 1600 ముక్కలుగా తయారు చేసి.. తీసుకువచ్చి.. అప్పటికే ముచ్చింతల్లో తయారైన స్టీల్ నిర్మాణంపై లేయర్ల వారీగా అతికించారు. ఏరోసెన్ కార్పొరేషన్కు చెందిన 70 మంది నిపుణుల బృందం వచ్చి విగ్రహానికి రూపునిచ్చింది. మొత్తం ఈ ప్రక్రియకు 15 నెలలు పట్టింది.
అయిదు లోహాలు ఇవీ...
విగ్రహం పూర్తిగా పంచలోహాలతో తయారైంది. ఇందులో 83 శాతం రాగి వినియోగించగా.. వెండి, బంగారం, జింక్, టైటానియం లోహాలను వినియోగించి తయారు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరు రోజులుగా నక్కి.. ఎరకు చిక్కి
శంషాబాద్ విమానాశ్రయ రన్వే మైదానంలోకి గత నెల 27న చొరబడి అందరినీ కంగారుకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. -
వామనరావు దంపతుల హత్య కేసు.. సీబీఐకి అప్పగించేందుకు సిద్ధం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని హైవేలో 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాదులు గట్టు వామనరావు దంపతుల హత్యకేసు దర్యాప్తును సీబీఐ లేదా సీఐడీకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
కోర్టులో నేరుగా హాజరుపరచాలని కవిత దరఖాస్తు
ప్రస్తుతం దిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు ముందు విచారణ జరిగే సమయంలో తనను నేరుగా హాజరుపరచాలంటూ భారాస ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు దాఖలుచేశారు. -
సులభతర వాణిజ్య విధానంలో మరిన్ని సంస్కరణలు
సులభతర వాణిజ్య విధానం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-ఈఓడీబీ)లో అత్యుత్తమ సేవలు కొనసాగించాలని, ఇందుకోసం మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఆదేశించారు. -
నిబంధనలు ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై చర్యలు
తెలంగాణలో నిబంధనలను ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై విద్యాశాఖ కొరడా ఝుళిపించింది. ఇంటర్ విద్యామండలి ఆదేశాలను విస్మరించి వేసవి సెలవుల్లో కళాశాలలను నిర్వహించడం, ప్రవేశాలు కల్పించినందుకుగాను ఒక్కో కళాశాలపై రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వం కోరితే.. పదోన్నతులకు టెట్ మినహాయింపునిస్తాం
తెలంగాణలో 2010 కన్నా ముందు నియమితులై 1 నుంచి 5 తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే వెంటనే ఉత్తర్వులిస్తామని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఛైర్మన్ యోగేశ్ సింగ్ తెలిపారు. -
టెట్ పరీక్షల షెడ్యూలు విడుదల
ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024 షెడ్యూలును విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. -
6న ఈసెట్
టీఎస్ ఈసెట్-2024 ప్రవేశ పరీక్ష మే 6వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. -
ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు
ఎండల తీవ్రత దృష్ట్యా జాతీయ ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు. -
ఆర్టీసీ రిజర్వేషన్ ఛార్జీలపై మినహాయింపు
దూరప్రాంత బస్ సర్వీసుల్లో రిజర్వేషన్ ఛార్జీలపై టీఎస్ఆర్టీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. -
40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ.32 వేలు, గరిష్ఠంగా రూ.2,95,460 ఉండాలని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర గెజిటెడ్ అధికారుల (టీజీవోల) సంఘం కోరింది. -
రోహిత్ వేముల ఆత్మహత్య కేసు పునర్విచారణ
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో ముఖ్య పరిమాణం చోటుచేసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు ముగిసిన దశలో కీలక మలుపు తిరిగింది. -
హెచ్సీయూ వీసీ, నేతలపై నమోదైన కేసులో ఆధారాల్లేవు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. -
రాష్ట్రంలో బోర్లు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చండి
రాష్ట్రంలో ఏయే కేటగిరీల కింద ఎన్ని బోర్లు ఉన్నాయో లెక్కలు తేల్చాలని భూగర్భ జలవనరుల మదింపుపై ఏర్పాటైన రాష్ట్ర స్థాయి కమిటీ వివిధ ప్రభుత్వ శాఖలకు సూచించింది. -
తాగునీళ్లు ఇచ్చేందుకు కర్ణాటక సానుకూలత!
తెలంగాణకు కర్ణాటక ప్రాజెక్టుల నుంచి కొంత నీటిని ఇచ్చేందుకు ఆ రాష్ట్రం సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. -
అజీర్తి సమస్యకు మామిడి పండే ఔషధం!
పోషకాలకు, రుచికి పెట్టింది పేరైన మామిడి పండు.. అజీర్తి నివారణకు సహజ ఔషధంగా పనిచేస్తుందని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) ఆచార్యులు తమ పరిశోధనలో గుర్తించారు. -
అదనపు ఆదాయానికి ఆర్టీసీ అధికారుల ఒత్తిడి
బస్సులతో అదనపు ఆదాయం తేవాలంటూ ఆర్టీసీ యాజమాన్యం కార్మికులపై ఒత్తిడి పెంచుతోందని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఎస్డబ్ల్యూయూ) మండిపడింది. -
సెంచరీ దాటిన బీన్స్ ధర
బీన్స్ ధర సెంచరీ దాటింది. శుక్రవారం హైదరాబాద్లోని రైతుబజార్లలో కిలో బీన్స్ ధర రూ.105గా నిర్ణయించారు. -
రూ.12 కోట్ల ఎగవేత.. రైస్ మిల్లు సీజ్
కస్టమ్ మిల్లింగ్ రైస్ను అప్పగించకుండా నాలుగేళ్లుగా జాప్యం చేస్తున్న రైస్ మిల్లును అధికారులు సీజ్ చేశారు. -
భారాస ఫిర్యాదుపై చట్టప్రకారం చర్యలు తీసుకోండి
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తమ నేతలపై పలువురు చేస్తున్న అసత్య ఆరోపణల నియంత్రణకు గూగుల్, యూట్యూబ్ చర్యలు తీసుకోవడం లేదంటూ భారాస చేసిన ఫిర్యాదును చట్టప్రకారం పరిష్కరించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
రాష్ట్రంలో బాలింతల మరణాలను నివారించాలి
అత్యాధునిక వైద్య వసతులను ఉపయోగించుకుని రాష్ట్రంలో బాలింతల మరణాలను పూర్తిగా నివారించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇంటి స్థలం ఇప్పటికీ ఇవ్వలేదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఆవేదన
-
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు