సెంచరీ దాటిన బీన్స్‌ ధర

బీన్స్‌ ధర సెంచరీ దాటింది. శుక్రవారం హైదరాబాద్‌లోని రైతుబజార్లలో కిలో బీన్స్‌ ధర రూ.105గా నిర్ణయించారు.

Published : 04 May 2024 05:18 IST

రైతుబజార్‌లలో కిలో రూ.105

మెహిదీపట్నం, న్యూస్‌టుడే: బీన్స్‌ ధర సెంచరీ దాటింది. శుక్రవారం హైదరాబాద్‌లోని రైతుబజార్లలో కిలో బీన్స్‌ ధర రూ.105గా నిర్ణయించారు. బహిరంగ మార్కెట్‌లో మాత్రం మొదటి రకం బీన్స్‌ ధర రూ.160 నుంచి రూ.180 వరకు ఉంది. మెహిదీపట్నం రైతుబజార్‌లో 23 క్వింటాళ్ల బీన్స్‌ వచ్చిందని ఎస్టేట్‌ అధికారి విజయ్‌కుమార్‌ తెలిపారు. ఏప్రిల్‌, మే ప్రారంభం నుంచి భానుడి ప్రభావంతో మార్కెట్‌కు బీన్స్‌ రావడం లేదని పేర్కొన్నారు. నగర మార్కెట్లకు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతోందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని