PM Modi: అధికారం పోయినా... అహంకారం పోలేదు
కాంగ్రెస్ను, ఆ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. అధికారం పోయినా, వారికి అహంకారం మాత్రం పోలేదని తీవ్రంగా మండిపడ్డారు. ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ వచ్చినా అలవాట్లను మాత్రం మార్చుకోలేదని...
తెలంగాణ ఇచ్చినట్టు చెప్పినా అక్కడి ప్రజలు మిమ్మల్ని స్వీకరించలేదు
కాంగ్రెస్ లక్ష్యంగా లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు
కరోనా తొలిదశలో దేశం లాక్డౌన్లోకి వెళ్లింది. ఎక్కడివారు అక్కడే ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వైద్య నిపుణులు చెప్పారు. కాంగ్రెస్ నేతలు మాత్రం ముంబయి రైల్వేస్టేషన్ ముందు నిలబడి వలస కార్మికులకు ఉచిత టికెట్లు ఇచ్చారు. స్వస్థలాలకు వెళ్లిపోండని రెచ్చగొట్టారు. కొవిడ్ వ్యాప్తికి కారణమయ్యారు.
- ప్రధాని మోదీ
ఈనాడు, దిల్లీ: కాంగ్రెస్ను, ఆ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. అధికారం పోయినా, వారికి అహంకారం మాత్రం పోలేదని తీవ్రంగా మండిపడ్డారు. ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ వచ్చినా అలవాట్లను మాత్రం మార్చుకోలేదని దుయ్యబట్టారు. తెలంగాణ ఇచ్చామని చెప్పుకొన్నా, అక్కడి ప్రజలు వారిని అంగీకరించలేదని ఎద్దేవా చేశారు. ఇక ఎప్పటికీ అధికారంలోకి రాబోమని ఆ పార్టీ నాయకులు నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్టున్నారని... అందుకే దేశంలో నకారాత్మక వాతావరణాన్ని విస్తరింపజేసి, వేర్పాటువాదులను బలపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ... ప్రధాని మోదీ సోమవారం లోక్సభలో మాట్లాడారు. గత ఏడేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, కరోనాను ఎదుర్కొన్న విధానం, ఉపాధి కల్పన, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం ఎదుగుతున్న తీరును ఆయన వివరిస్తూనే... కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకొని శరపరంపరగా విమర్శలు గుప్పించారు.
‘‘గత కొన్నేళ్లలో దేశంలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ప్రజల మధ్య ఉన్నవాళ్లకు ఈ విషయం కచ్చితంగా తెలుస్తుంది. కానీ, మీ (కాంగ్రెస్) ఆలోచనలు 2014 వద్దే ఆగిపోయాయి. మిమ్మల్ని మీరు ఒక రకమైన మానసిక స్థితిలో బంధించుకున్నారు. సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చినవారు (రాహుల్ గాంధీ)... 50 ఏళ్లపాటు తాము అధికారంలో ఉన్న విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. ఒకసారి చరిత్రను గమనించండి. నాగాలాండ్లో వారికి అధికారం పోయి 24 ఏళ్లు అయింది. ఒడిశాలో 27 సంవత్సరాలుగా మీకు ప్రవేశం లేకుండా పోయింది. త్రిపుర ప్రజలు 1988లో.. యూపీ, బిహార్, గుజరాత్ ఓటర్లు 1985లో చివరిసారిగా మీకు ఓటు వేశారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు దాదాపు 50 ఏళ్ల కిందట మిమ్మల్ని ఎన్నుకొన్నారు. తమిళనాడు ఓటర్లు 1962లో కాంగ్రెస్కు చివరిసారిగా ఓటు వేశారు. ఝార్ఖండ్ ఏర్పడి 20 ఏళ్లయినా, ఇప్పటివరకూ అక్కడ కాంగ్రెస్కు పూర్తిస్థాయి మెజార్టీ రాలేదు. ఇక్కడ ప్రశ్న ఎన్నికల ఫలితాల గురించి కాదు... వారి నీతి నియమాల గురించే. ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న తర్వాత కూడా ప్రజలు పదేపదే ఎందుకు తిరస్కరిస్తున్నారు? ఇన్ని ఓటముల తర్వాతా మీ అహంకారం పోలేదు. మీ చుట్టూ ఉన్న వాతావరణం మీ అహంకారాన్ని పోనివ్వడం లేదు. ఇన్ని రాష్ట్రాలు మిమ్మల్ని తిరస్కరించినా... మేల్కోరా? మీ నేతల ప్రకటనలు, చేష్టలు చూస్తుంటే మరో వందేళ్ల వరకూ అధికారంలోకి రాబోమనే నిర్ణయానికి వచ్చినట్టున్నారు. అందుకే నేను సిద్ధమయ్యాను.
బురదచల్లాలని భావిస్తున్నారు...
అధికారంలోకి రావాలన్న కోరిక కాంగ్రెస్ పార్టీలో ఖతమైపోయింది. కలిసి వచ్చేవారు ఎవరూలేక... కనీసం బురదచల్లే పనైనా చేద్దామని కొందరు నిరాశావాదులు భావిస్తున్నారు. వేర్పాటువాదుల మూలాలను బలోపేతం చేస్తున్నారు. ఇలా చేసేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు. దేశం ఎప్పుడూ శ్రేష్ఠంగా ఉంది. ఇకముందూ ఉంటుంది. ఆంగ్లేయుల ‘విభజించు-పాలించు’ సిద్ధాంతాన్ని కాంగ్రెస్ అనుసరిస్తోంది. తమిళులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. ఇప్పుడు దేశాన్ని ఛిన్నాభిన్నం చేసే ముఠా (టుక్డే టుక్డే గ్యాంగ్)కు నాయకత్వం వహిస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా మమ్మల్ని అడ్డుకోలేనివారు... సభలో ఇబ్బందులు సృష్టించడం ద్వారా మమ్మల్ని అడ్డుకోవాలని అనుకుంటున్నారు. ఇందులోనూ వారు విఫలం కావడం తథ్యం.
మహమ్మారిని రాజకీయాల్లోకి లాగారు...
కరోనా కాలంలో కాంగ్రెస్ హద్దులన్నీ దాటింది. మహారాష్ట్రపై భారం తగ్గించుకోవడానికని... ఉత్తర్ప్రదేశ్, బిహార్లకు వెళ్లి అక్కడ కరోనా వ్యాపింపజేయండని వలస కార్మికులను ప్రోత్సహించి మహాపాపానికి పాల్పడింది. కాంగ్రెస్ విధానాల వల్ల యావద్దేశం ఇబ్బంది పడింది. ఈ దేశం మీది కాదా? ప్రజలు మీవారు కాదా? వారి సుఖదుఃఖాలు మీవి కావా? ఆ పార్టీ గుడ్డి విపక్షం (బ్లైండ్ అపోజిషన్)గా మారిపోయింది. ఇలాంటి ప్రతిపక్షం ప్రజాస్వామ్యానికి అవమానకరం. కాంగ్రెస్ నాయకులు మోదీ పేరు ఉచ్ఛరించకుండా ఉండలేరు. మోదీయే వారికి ప్రాణశక్తి. మన పారిశ్రామికవేత్తలను వారు కరోనా వైరస్ వేరియంట్లుగా అభివర్ణించారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? లోపల కూర్చున్నవారికి చెప్పండి... దీనివల్ల నష్టం జరిగేది కాంగ్రెస్ పార్టీకే’’ అని మోదీ చురకలు వేశారు.
నెహ్రూ మాటలనూ పెడచెవిన పెట్టారు
నెహ్రూ పేరును మోదీ ప్రస్తావించరని చెబుతుంటారు. ఈరోజు ఆయన పేరు తీసుకుని... వారి దాహాన్ని తీర్చేయాలనుకుంటున్నాను. బాధ్యతల విషయంలో దేశ ప్రథమ ప్రధాని మాట్లాడుతూ- స్వాతంత్య్రంతో పాటు బాధ్యత ఉంటుందని, దాన్ని గుర్తించకపోతే స్వాతంత్య్రాన్ని అర్థం చేసుకోలేరని, దాన్ని కాపాడనూ లేరని చెప్పారు. మీరు ఆయన మాటలను కూడా మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు