దేశానికే ఆదర్శం తెలంగాణ బడ్జెట్
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని.. ఇది దేశానికే ఆదర్శమని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే లేని విధంగా భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతుంటే..
ఖాళీలపై భాజపా వ్యాఖ్యలు అవగాహన రాహిత్యం
మోదీ సర్కారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిచ్చిందా?
శాసనమండలిలో మంత్రి హరీశ్రావు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని.. ఇది దేశానికే ఆదర్శమని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే లేని విధంగా భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతుంటే.. కాంగ్రెస్, భాజపాలు ఆగమాగమవుతున్నాయని విమర్శించారు. దేశంలో ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన భాజపా ఏడున్నరేళ్లలో 15 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించిందా? అని ప్రశ్నించారు. శాసనమండలిలో బడ్జెట్పై గురువారం చర్చలో హరీశ్రావు మాట్లాడుతూ.. ‘ఇంకా లక్ష ఉద్యోగాలను భర్తీ చేయట్లేదంటూ.. కొందరు బిశ్వాల్ కమిటీ నివేదిక గురించి మాట్లాడుతున్నారు. అది పీఆర్సీకి సంబంధించిన నివేదిక. 4.92 లక్షల పోస్టులకు 2.99 లక్షల మంది పనిచేస్తున్నారు.. 1.90 లక్షల ఖాళీలని ఆ కమిటీ చెప్పింది. కానీ ప్రభుత్వరంగ సంస్థలు, వర్సిటీల్ని, వక్ఫ్ బోర్డు వంటి వాటినీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ ఉద్యోగుల లెక్కల్లో చూపారు. వివిధ రెసిడెన్షియల్ పాఠశాలలు, నిమ్స్, జయశంకర్ వర్సిటీ వంటి చోట్ల మొత్తం 54,118 మంది ఉద్యోగులు పనిచేస్తుంటే బిశ్వాల్ కమిటీ పొరపాటున సున్నాగా చూపింది. ఈ విషయాలు తెలియని, సగం తెలివితేటలున్న నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆ 54,118 పోస్టులు పోను, మిగిలిన ఖాళీల్లో పదోన్నతులతో నింపేవి 48,654. ఇంకా మిగిలిన 87,880 ఖాళీల్లో.. కమిటీ నివేదిక ఇచ్చాక కొన్ని నియామకాలు జరిగాయి. ఇవి పరిగణనలోకి తీసుకుంటే నింపాల్సిన పోస్టులు 80 వేలు’ అని హరీశ్రావు వివరించారు. భాజపా నేతలకు దమ్ముంటే దిల్లీలో కేంద్రంపై కొట్లాడాలని సూచించారు. ఉద్యోగాల భర్తీతో రూ.7 వేల కోట్ల భారం పడుతుందని, ఈ బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. అప్పులు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ కింది నుంచి అయిదో స్థానంలో ఉంది అని తెలిపారు.
వడ్డీ రాయితీ నిలిపివేశారు.: జీవన్రెడ్డి
రైతుల పంట రుణాలపై ఇచ్చే రాయితీని ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పటి వరకు రూ.34 వేల వరకు రుణాలే మాఫీ అయ్యాయి. మిగిలినవి ఎప్పుడు మాఫీ చేస్తారు? విత్తన సబ్సిడీ, వ్యవసాయ యాంత్రీకరణకు నిధులు మరిచారు. ఉపాధి కూలీలకు వేసవి అలవెన్సు మంజూరు చేయట్లేదు. బాలికా సురక్ష పథకాన్ని ఎందుకు నిలిపివేశారు? ఆడపిల్లలు జమ చేసిన అభయహస్తం నిధులు వెంటనే వారికి ఇచ్చేయాలి.
రాయితీ బకాయిలు ఇవ్వండి: కడియం శ్రీహరి
టీఎస్ ప్రైడ్ కింద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రెండేళ్లుగా రాయితీలు రావట్లేదు. వీరికి బకాయిలు చెల్లించేందుకు రూ.2 వేల కోట్లు అవసరం. గొర్రెల యూనిట్ల కోసం ఇచ్చిన రూ.వెయ్యి కోట్లు సరిపోవు. పెంచాలి. రెండు పడక గదుల గృహాల పథకానికి సిద్దిపేట మోడల్గా నిలిచింది. అక్కడ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తరహాలో అభివృద్ధి చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ ఈ తరహా గృహాలు రావాల్సిన అవసరముంది.
హరీశ్...జుట్టుకు రంగు వేసుకోండి..
మండలిలో బడ్జెట్పై చర్చ సందర్భంగా తెల్ల జుట్టు, రంగు వేసుకోవడంపై సరదా చర్చ జరిగింది. కడియం శ్రీహరి మాట్లాడుతూ ‘ఛైర్మన్కు, నాకు ఇద్దరికీ ఒకే విధంగా తెల్లరంగు జుట్టు ఉంది. వయసు పైబడిన వారికి ఎక్కువ సమయం ఇవ్వాలని సరదాగా కోరారు. మంత్రి హరీశ్రావు, మీరు కూడా జుట్టుకు రంగు వేసుకోండి’ అనడంతో సభలో నవ్వులు విరిశాయి. మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ మృతి పట్ల మండలి సంతాపం తెలిపింది. అనంతరం బడ్జెట్పై చర్చను ఎంఐఎం సభ్యుడు మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఇఫెండి ప్రారంభించారు. ప్రభుత్వం ఉద్యోగాలు ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, వాటిని వేగంగా భర్తీ చేయాలని సూచించారు. చర్చపై సభ్యులు రాజేశ్వర్రెడ్డి, కె.రఘోత్తమ్రెడ్డి, నర్సిరెడ్డి మాట్లాడారు. భాజపా గవర్నర్లు రాష్ట్రాల్లో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్రెడ్డి విమర్శించారు. భాజపాయేత రాష్ట్రాల్లో గవర్నర్లు ప్రసంగాలు చదవడం లేదని, అందులోని విషయాలతో సంబంధం లేదంటున్నారని తెలిపారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రాల గవర్నర్లు సీఎంతో కలిసి పనిచేయాల్సినప్పటికీ ఆ మేరకు వ్యవహరించడం లేదన్నారు. బడ్జెట్లో గవర్నర్ ప్రసంగం పెట్టలేదన్న కారణంతో ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. గతంలో అసెంబ్లీ ప్రొరోగ్ కానందున సీఎం రాజ్యాంగ, న్యాయపరంగా అన్ని అంశాలను పరిశీలించి బడ్జెట్ సమావేశాలకు ఏర్పాట్లు చేశారన్నారు. అనంతరం ఛైర్మన్ జాఫ్రీ సభను సోమవారానికి వాయిదా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
యూటీఎస్ యాప్ పరిధి పెంపు
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు. -
ఏఈ పోస్టుల జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీజీపీ రవిగుప్తాకు పరిహారం చెల్లించండి
పనిచేయని రిక్లైనర్ సీటును కేటాయించి తీవ్ర అసౌకర్యం కలిగించడం, బిజినెస్(జెడ్) క్లాస్ టికెట్లో ఎకానమీ క్లాస్ సేవలందించిన నేపథ్యంలో డీజీపీ దంపతులకు రూ.2,07,500 పరిహారం చెల్లించాలని సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 ఆదేశించింది. -
విద్యుత్ సరఫరాపై చర్చకు సిద్ధం
విద్యుత్ రంగంపై మాజీ సీఎం కేసీఆర్ అవాస్తవ ప్రకటనలు చేస్తూ లోక్సభ ఎన్నికల ముందు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. -
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు.