దేశానికే ఆదర్శం తెలంగాణ బడ్జెట్
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని.. ఇది దేశానికే ఆదర్శమని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే లేని విధంగా భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతుంటే..
ఖాళీలపై భాజపా వ్యాఖ్యలు అవగాహన రాహిత్యం
మోదీ సర్కారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిచ్చిందా?
శాసనమండలిలో మంత్రి హరీశ్రావు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని.. ఇది దేశానికే ఆదర్శమని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే లేని విధంగా భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతుంటే.. కాంగ్రెస్, భాజపాలు ఆగమాగమవుతున్నాయని విమర్శించారు. దేశంలో ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన భాజపా ఏడున్నరేళ్లలో 15 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించిందా? అని ప్రశ్నించారు. శాసనమండలిలో బడ్జెట్పై గురువారం చర్చలో హరీశ్రావు మాట్లాడుతూ.. ‘ఇంకా లక్ష ఉద్యోగాలను భర్తీ చేయట్లేదంటూ.. కొందరు బిశ్వాల్ కమిటీ నివేదిక గురించి మాట్లాడుతున్నారు. అది పీఆర్సీకి సంబంధించిన నివేదిక. 4.92 లక్షల పోస్టులకు 2.99 లక్షల మంది పనిచేస్తున్నారు.. 1.90 లక్షల ఖాళీలని ఆ కమిటీ చెప్పింది. కానీ ప్రభుత్వరంగ సంస్థలు, వర్సిటీల్ని, వక్ఫ్ బోర్డు వంటి వాటినీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ ఉద్యోగుల లెక్కల్లో చూపారు. వివిధ రెసిడెన్షియల్ పాఠశాలలు, నిమ్స్, జయశంకర్ వర్సిటీ వంటి చోట్ల మొత్తం 54,118 మంది ఉద్యోగులు పనిచేస్తుంటే బిశ్వాల్ కమిటీ పొరపాటున సున్నాగా చూపింది. ఈ విషయాలు తెలియని, సగం తెలివితేటలున్న నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆ 54,118 పోస్టులు పోను, మిగిలిన ఖాళీల్లో పదోన్నతులతో నింపేవి 48,654. ఇంకా మిగిలిన 87,880 ఖాళీల్లో.. కమిటీ నివేదిక ఇచ్చాక కొన్ని నియామకాలు జరిగాయి. ఇవి పరిగణనలోకి తీసుకుంటే నింపాల్సిన పోస్టులు 80 వేలు’ అని హరీశ్రావు వివరించారు. భాజపా నేతలకు దమ్ముంటే దిల్లీలో కేంద్రంపై కొట్లాడాలని సూచించారు. ఉద్యోగాల భర్తీతో రూ.7 వేల కోట్ల భారం పడుతుందని, ఈ బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. అప్పులు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ కింది నుంచి అయిదో స్థానంలో ఉంది అని తెలిపారు.
వడ్డీ రాయితీ నిలిపివేశారు.: జీవన్రెడ్డి
రైతుల పంట రుణాలపై ఇచ్చే రాయితీని ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పటి వరకు రూ.34 వేల వరకు రుణాలే మాఫీ అయ్యాయి. మిగిలినవి ఎప్పుడు మాఫీ చేస్తారు? విత్తన సబ్సిడీ, వ్యవసాయ యాంత్రీకరణకు నిధులు మరిచారు. ఉపాధి కూలీలకు వేసవి అలవెన్సు మంజూరు చేయట్లేదు. బాలికా సురక్ష పథకాన్ని ఎందుకు నిలిపివేశారు? ఆడపిల్లలు జమ చేసిన అభయహస్తం నిధులు వెంటనే వారికి ఇచ్చేయాలి.
రాయితీ బకాయిలు ఇవ్వండి: కడియం శ్రీహరి
టీఎస్ ప్రైడ్ కింద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రెండేళ్లుగా రాయితీలు రావట్లేదు. వీరికి బకాయిలు చెల్లించేందుకు రూ.2 వేల కోట్లు అవసరం. గొర్రెల యూనిట్ల కోసం ఇచ్చిన రూ.వెయ్యి కోట్లు సరిపోవు. పెంచాలి. రెండు పడక గదుల గృహాల పథకానికి సిద్దిపేట మోడల్గా నిలిచింది. అక్కడ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తరహాలో అభివృద్ధి చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ ఈ తరహా గృహాలు రావాల్సిన అవసరముంది.
హరీశ్...జుట్టుకు రంగు వేసుకోండి..
మండలిలో బడ్జెట్పై చర్చ సందర్భంగా తెల్ల జుట్టు, రంగు వేసుకోవడంపై సరదా చర్చ జరిగింది. కడియం శ్రీహరి మాట్లాడుతూ ‘ఛైర్మన్కు, నాకు ఇద్దరికీ ఒకే విధంగా తెల్లరంగు జుట్టు ఉంది. వయసు పైబడిన వారికి ఎక్కువ సమయం ఇవ్వాలని సరదాగా కోరారు. మంత్రి హరీశ్రావు, మీరు కూడా జుట్టుకు రంగు వేసుకోండి’ అనడంతో సభలో నవ్వులు విరిశాయి. మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ మృతి పట్ల మండలి సంతాపం తెలిపింది. అనంతరం బడ్జెట్పై చర్చను ఎంఐఎం సభ్యుడు మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఇఫెండి ప్రారంభించారు. ప్రభుత్వం ఉద్యోగాలు ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, వాటిని వేగంగా భర్తీ చేయాలని సూచించారు. చర్చపై సభ్యులు రాజేశ్వర్రెడ్డి, కె.రఘోత్తమ్రెడ్డి, నర్సిరెడ్డి మాట్లాడారు. భాజపా గవర్నర్లు రాష్ట్రాల్లో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్రెడ్డి విమర్శించారు. భాజపాయేత రాష్ట్రాల్లో గవర్నర్లు ప్రసంగాలు చదవడం లేదని, అందులోని విషయాలతో సంబంధం లేదంటున్నారని తెలిపారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రాల గవర్నర్లు సీఎంతో కలిసి పనిచేయాల్సినప్పటికీ ఆ మేరకు వ్యవహరించడం లేదన్నారు. బడ్జెట్లో గవర్నర్ ప్రసంగం పెట్టలేదన్న కారణంతో ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. గతంలో అసెంబ్లీ ప్రొరోగ్ కానందున సీఎం రాజ్యాంగ, న్యాయపరంగా అన్ని అంశాలను పరిశీలించి బడ్జెట్ సమావేశాలకు ఏర్పాట్లు చేశారన్నారు. అనంతరం ఛైర్మన్ జాఫ్రీ సభను సోమవారానికి వాయిదా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. -
50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. -
పోల్ 2023.. కేఎంఆర్..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రత్యేక వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది. -
రోహిత్ కేసు పునర్విచారణ ప్రారంభం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. -
వడదెబ్బకు 19 మంది మృత్యువాత
రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతిచెందారు. -
మధుమేహంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
భారత్లో మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. -
బతికుండగానే పూడ్చిపెట్టారు..
ముక్కుపచ్చలారని పసిగుడ్డు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు.. ప్రాణాలతో గుంతలో వేసి మట్టితో పూడ్చేశారు. -
నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఎఫ్ఆర్సీఎస్ గౌరవం
కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది. -
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు మాతృవియోగం
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాం నాయక్ మాతృ వియోగం పొందారు. -
‘ఆపరేషన్ కగార్’తో అమాయకుల ప్రాణాలు బలి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టి.. అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలు తీస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. -
అంధులకు వీఐపీ దర్శనం
యాదాద్రి ప్రధాన ఆలయంలో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అంధులు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా.. అక్కడే విధుల్లో ఉన్న ఆలయ ఈవో భాస్కర్రావు కంటపడ్డారు. -
శిక్షలో పక్షపాతం తగదు
విద్యారుణాలకు సంబంధించి నకిలీ రుణ మంజూరు పత్రాల జారీ వ్యవహారంలో బాధ్యులైన అధికారులకు శిక్ష విధించడంలో పక్షపాతం చూపడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. -
ఎకరాకు 12 క్వింటాళ్ల జొన్నలు ప్రభుత్వమే కొంటుంది
రాష్ట్ర ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలను సడలించి రైతులకు మరింత వెసులుబాటు కల్పించింది. ఎకరాకు 8.85 క్వింటాళ్లను మాత్రమే మద్దతు ధరకు కొనాలన్న గరిష్ఠ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. -
టీఎస్సెట్ నోటిఫికేషన్ విడుదల
అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ నియామకాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ‘తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2024’ నోటిఫికేషన్ విడుదలైంది. -
7న మేడిగడ్డకు జ్యుడిషియల్ విచారణ కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 7న విశ్రాంత జడ్జి పినాకి చంద్రఘోష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. -
అవినీతి చెక్పోస్టులకు అడ్డుకట్ట!
రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. -
నేడు నీట్-యూజీ ప్రవేశపరీక్ష
నీట్-యూజీ (ఎంబీబీఎస్) ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. -
ఇదీ సంగతి!