ఖాళీలు మిగలకుండా.. పక్కా ప్రణాళిక
రాష్ట్రంలో ఈసారి ఉద్యోగ నియామకాలను పక్కాగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పోస్టులు మిగలకుండా అన్నింటినీ భర్తీ చేయాలని చూస్తోంది. అభ్యర్థులు గడువులోగా విధుల్లో చేరకపోతే వారిని వదిలేసి ప్రాధాన్య క్రమంలో
ఎవరైనా ఒకటికి మించి పోస్టులకు ఎంపికైనా.. ఏదో ఒకటే ఖరారు
గడువులోపు చేరకుంటే తదుపరి అర్హులైనవారికి అవకాశం
ప్రభుత్వ యోచన..
వివిధ ప్రతిపాదనలపై అధికారుల కసరత్తు
ఈనాడు, హైదరాబాద్ : రాష్ట్రంలో ఈసారి ఉద్యోగ నియామకాలను పక్కాగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పోస్టులు మిగలకుండా అన్నింటినీ భర్తీ చేయాలని చూస్తోంది. అభ్యర్థులు గడువులోగా విధుల్లో చేరకపోతే వారిని వదిలేసి ప్రాధాన్య క్రమంలో మిగిలిన అర్హులకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది. దీని విధివిధానాలపై కసరత్తు చేస్తోంది. గతంలో వివిధ నియామకాల్లో ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరకపోతే చాలా పోస్టులు ఖాళీగా మిగిలిపోయేవి. వాటిని మిగులు పోస్టులుగా తేల్చి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే భర్తీ చేసేవారు. ఒకసారైతే వివిధ పోటీ పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో దాదాపు 500 మందికి పైగా ఒకటికి మించి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారు విధుల్లో చేరని కారణంగా వివిధ శాఖల్లో 500 పోస్టులు భర్తీ కాలేదు. అర్హులు ఎందరో ఉన్నా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చాకే భర్తీ చేయాలని ప్రభుత్వం అప్పట్లో నిర్ణయించింది. దీంతో ఆ 500 పోస్టుల్లో ఎవరికీ అవకాశం దక్కలేదు. ఉద్యోగాన్వేషణలో అభ్యర్థులు ఒకటికి మించి పోస్టులకు ప్రయత్నించడం మామూలే. కొందరు రెండు, మూడు పోస్టులకు ఎంపికవుతుంటారు. చివరకు నచ్చిన పోస్టును ఎంచుకొని, మిగిలిన వాటిని వదిలేస్తారు. దీంతో అవన్నీ ఖాళీగా ఉండిపోతున్నాయి. ఆశావహులైన నిరుద్యోగులు తర్వాతి నోటిఫికేషన్ వరకు ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిని నివారించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అవసరమైన ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులకు సూచించింది. అధికారులు పరిష్కార మార్గాలను పరిశీలిస్తున్నారు.
అధికారులు మరింత కసరత్తు చేసి నోటిఫికేషన్లలోని పోస్టులు ఏ మాత్రం మిగలకుండా చూడడం కోసం మరికొన్ని ప్రతిపాదనలు కూడా రూపొందించనున్నారని తెలుస్తోంది. వాటిలో మెరుగైన విధానాన్ని ఖరారు చేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది.
తొలి ప్రతిపాదన: ఏ పోస్టులకు వెళ్తున్నారో ఆరా
ప్రస్తుతం రాతపరీక్షల సమయంలో అభ్యర్థులు ఇప్పటికే ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారా అనే సమాచారం తీసుకుంటారు.అభ్యర్థుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేసి ఎవరు ఏయే పరీక్షలు రాస్తున్నారో తెలుసుకుంటారు. తర్వాత ఒకటి మించి ఉద్యోగాలకు ఎంపికైన వారిని గుర్తించి వారు ఏ పోస్టులో చేరాలనుకుంటున్నారో, దేనిని వదిలేస్తారో ఆరా తీస్తారు. వారు వదిలిపెట్టిన పోస్టులకు జాబితాలో ఉన్న తర్వాతి అర్హులకు అవకాశం ఇస్తారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా సమాధానం ఇవ్వకుండా గడువులోగా నియామక ఉత్తర్వులు తీసుకోకుంటే వారికి ఏదో ఒకచోట పోస్టింగ్ ఖరారు చేసి మిగిలిన వాటి నుంచి మినహాయిస్తారు.
రెండో ప్రతిపాదన: కేరళ, తమిళనాడు విధానం
కేరళ, తమిళనాడుల్లో పోస్టులు మిగిలిపోకుండా.. అర్హుల జాబితాలోని తర్వాతి వారికి అవకాశమిచ్చి నోటిఫికేషన్లలోని పోస్టులన్నీ భర్తీ చేస్తున్నారు. రాతపరీక్షల అనంతరం ఎంపికైన అభ్యర్థులకు వెంటనే ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. దీనికి హాజరయ్యే అభ్యర్థులకు మాత్రమే పోస్టింగ్ ఖరారు చేస్తారు. అదే ఉద్యోగం అతను/ఆమెకు ఖరారవుతుంది. మిగిలిన వాటికి అర్హత (ఎలిమినేషన్) కోల్పోతారు. ఎవరైనా రాని పక్షంలో వరస క్రమంలో అర్హులైనవారికి అవకాశమిస్తున్నారు. మన రాష్ట్రంలో ప్రస్తుతం ఎంసెట్ కౌన్సెలింగ్, కేంద్రంలో నీట్ కౌన్సెలింగ్ ఇదే తరహాలో సాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
యూటీఎస్ యాప్ పరిధి పెంపు
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు. -
ఏఈ పోస్టుల జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీజీపీ రవిగుప్తాకు పరిహారం చెల్లించండి
పనిచేయని రిక్లైనర్ సీటును కేటాయించి తీవ్ర అసౌకర్యం కలిగించడం, బిజినెస్(జెడ్) క్లాస్ టికెట్లో ఎకానమీ క్లాస్ సేవలందించిన నేపథ్యంలో డీజీపీ దంపతులకు రూ.2,07,500 పరిహారం చెల్లించాలని సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 ఆదేశించింది. -
విద్యుత్ సరఫరాపై చర్చకు సిద్ధం
విద్యుత్ రంగంపై మాజీ సీఎం కేసీఆర్ అవాస్తవ ప్రకటనలు చేస్తూ లోక్సభ ఎన్నికల ముందు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. -
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు.