CJI: సామాజిక వైవిధ్యం
ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి వేగంగా సిఫార్సులు పంపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పిలుపునిచ్చారు. కోర్టు సముదాయాల్లో ఐటీ మౌలిక వసతులను మరింతగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. సర్వోన్నత న్యాయస్థానం ఆవరణలో శుక్రవారం ప్రారంభమైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 39వ సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఖాళీల భర్తీ, న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల...
న్యాయమూర్తుల నియామక సిఫార్సుల్లో ఈ అంశాన్ని పరిగణించండి
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ పిలుపు
కోర్టుల్లో మౌలిక వసతుల పెంపునకు కృషిచేయాలని సూచన
ఈనాడు - దిల్లీ
మనందరి సమష్టి ప్రయత్నాలతో ఏడాదిలోపే వివిధ హైకోర్టుల్లో 126 ఖాళీల భర్తీ సాధ్యమైంది. మరో 50 నియామకాలు త్వరలో జరిగే అవకాశం ఉంది. ఏడాది కాలంలో సుప్రీంకోర్టుకు తొమ్మిది మంది న్యాయమూర్తులు, హైకోర్టులకు పది మంది కొత్త ప్రధాన న్యాయమూర్తులు వచ్చారు.
- జస్టిస్ ఎన్.వి.రమణ
ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి వేగంగా సిఫార్సులు పంపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పిలుపునిచ్చారు. కోర్టు సముదాయాల్లో ఐటీ మౌలిక వసతులను మరింతగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. సర్వోన్నత న్యాయస్థానం ఆవరణలో శుక్రవారం ప్రారంభమైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 39వ సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఖాళీల భర్తీ, న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల కల్పనే ఈ సమావేశం ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. కరోనా విజృంభణ కాలంలోనూ కోర్టులు నిరంతరాయంగా నడిచేందుకు చేయూతనిచ్చిన న్యాయమూర్తులందరికీ అభినందనలు తెలిపారు. సదస్సులో సీజేఐ ప్రసంగిస్తూ.. ‘‘ఆరేళ్ల విరామం తర్వాత మనం ఇక్కడ కలుసుకున్నాం. గత ఏడాది జూన్లో నేను తొలిసారి మీతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాను. తర్వాత పలు సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఎప్పటికప్పుడు మీరు విభిన్న అంశాలను నా దృష్టికి తీసుకొస్తున్నారు. వాటిని నేను కేంద్రప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నాను. న్యాయ వ్యవస్థపై ప్రభావం చూపుతున్న సమస్యలను గుర్తించి చర్చించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. ఆరేళ్ల క్రితంనాటి సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిని చర్చించడంతోపాటు మరో ఆరు అంశాలను తాజా ఎజెండాలో చేర్చాం. దేశవ్యాప్తంగా కోర్టు సముదాయాల్లో ఐటీ మౌలిక వసతులు-అనుసంధానతను బలోపేతం చేయడం, జిల్లా కోర్టుల అవసరాలకు తగ్గట్టు మానవ వనరులను సిద్ధం చేయడం, భవనాల సామర్థ్యాలను పెంచడం, న్యాయవ్యవస్థకు అత్యాధునిక మౌలిక వసతులు సమకూర్చే వ్యవస్థను నెలకొల్పడం, సంస్థాగత-న్యాయపరమైన సంస్కరణలు చేపట్టడం, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలతోపాటు వారి భత్యాలు/పదవీవిరమణ తర్వాత ప్రయోజనాలను పెంపొందించడం వంటివి అందులో ఉన్నాయి. న్యాయమూర్తుల ఖాళీల గురించే ఇప్పుడు నేను ప్రధానంగా ప్రస్తావించదలచుకున్నాను.
నేను మీతో తొలిసారి సమావేశమైనప్పుడూ దానిపైనే మాట్లాడాను. హైకోర్టు న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి అవసరమైన సిఫార్సులను వేగంగా పంపాలని కోరాను. అందులో సామాజిక వైవిధ్యానికి ప్రాధాన్యమివ్వాలని సూచించాను. దానికి కొన్ని హైకోర్టులు స్పందించిన తీరు చాలా సంతోషకరంగా ఉంది. మనందరి సమష్టి ప్రయత్నాలతో ఏడాదిలోపే హైకోర్టుల్లో 126 ఖాళీల భర్తీ సాధ్యమైంది. వ్యవస్థపై మీకున్న సంపూర్ణ నిబద్ధతతోపాటు మనస్ఫూర్తిగా అందించిన సహకారం వల్లే ఈ గొప్ప లక్ష్య సాధన సాధ్యమైంది. ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఖాళీలున్న హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు సాధ్యమైనంత త్వరగా సిఫార్సులు పంపాలని కోరుతున్నా. వాటిలో సామాజిక వైవిధ్యానికి ప్రాధాన్యమివ్వండి. గత సంవత్సర కాలంలో సుప్రీంకోర్టుకు తొమ్మిది మంది న్యాయమూర్తులు, హైకోర్టులకు పది మంది కొత్త ప్రధాన న్యాయమూర్తులు వచ్చారు. ఇందుకు సహకరించిన కొలిజీయంలోని సహచర న్యాయమూర్తులకు ధన్యవాదాలు. మీ అందరికీ న్యాయమూర్తులుగా పదేళ్లకుపైగానే అనుభవం ఉంది. కాబట్టి ఎజెండాలోని అంశాలపై నిష్పాక్షికంగా విశ్లేషణ జరిపి నిర్మాణాత్మక సూచనలు చేయాలని కోరుతున్నా. నిర్మొహమాటంగా మీరు వ్యక్తంచేసే అభిప్రాయాల ద్వారా మనం కచ్చితంగా ఒక అర్థవంతమైన నిర్ణయానికి రాగలం. ఈ రోజు మనం తీసుకొనే నిర్ణయాలు, చేసే తీర్మానాలు ముఖ్యమంత్రులతో శనివారం జరిగే సదస్సులో చర్చలకు ఆధారమవుతాయి. ఈ అంశాలను మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నిద్దాం.
శక్తిమేరకు పనిచేశాం
గత ఏడాది నేను సీజేఐగా బాధ్యతలు చేపట్టినప్పుడు కొవిడ్ రెండో ఉద్ధృతి ప్రమాదకర స్థాయిలో ఉంది. తర్వాత కొన్ని వారాలు ఉపశమనం లభించినా.. 2021 చివరికల్లా మళ్లీ మూడో ఉద్ధృతిలో చిక్కుకున్నాం. మనమంతా కాలపరీక్షను ఎదుర్కొన్నాం. అయితే మీ అందరి సంకల్పంతో సహచరులు, సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారుల బాగోగులు చూసుకుంటూనే.. స్థిరమైన ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటుచేసుకొని నిరంతరం సేవలు కొనసాగేలా చూడగలిగాం. అందరికీ న్యాయం అందుబాటులో ఉండేలా శక్తిమేరకు పనిచేశాం. బెయిల్ ఉత్తర్వులను వేగంగా, సురక్షితంగా జైలు అధికారులకు అందించే ఫాస్టర్ వ్యవస్థకూ ఈ సంక్లిష్ట సమయంలోనే శ్రీకారం చుట్టాం. కరోనా కాలంలో మనుగడ కోసం పోరాడిన ప్రజలకు దేశవ్యాప్తంగా కోర్టులు గొప్ప ఉపశమనాన్ని కల్గించాయి. ఎవరికి తోచిన రీతిలో వారు చేసిన ఈ ప్రయత్నాలకు అభినందనలు. లక్షల మంది అట్టడుగువర్గాల ప్రజలకు ఈ కష్టకాలంలో జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థ కూడా నిరంతరం సేవలు అందించగలిగింది. దురదృష్టవశాత్తు మహమ్మారి తీవ్రతకు మనం ఎంతోమంది సహచరులు, అధికారులు, సిబ్బంది, న్యాయవాదులను కోల్పోయాం. ఆప్తులను పోగొట్టుకున్న కుటుంబాలన్నింటికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని పేర్కొన్నారు.
న్యాయ వ్యవస్థలో సమస్యలకు బాధ్యులెవరో చెప్తా
న్యాయ వ్యవస్థలో ఏయే సమస్యలున్నాయో.. వాటికి బాధ్యులెవరో శనివారం ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో తాను వివరంగా చెబుతానని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. హైకోర్టు సీజేల 39వ సదస్సుకు హాజరైన వివిధ ఉన్నత న్యాయస్థానాల ప్రధాన న్యాయమూర్తుల గౌరవార్థం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బార్ అసోసియేషన్ డిమాండ్లలో తనకు సాధ్యమైనవాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. కోర్టుల్లో పెండింగ్ కేసులు భారీగా పేరుకుపోవడంపై అటార్నీ జనరల్(ఏజీ) కె.కె.వేణుగోపాల్ తాజా సమావేశంలో ఆవేదన వ్యక్తంచేశారు. ఏజీ ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని, ఆయన వాదనతో ఏకీభవిస్తున్నానని సీజేఐ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ మాట్లాడుతూ.. న్యాయమూర్తుల నియామకాల విషయంలో కొలీజయం కేవలం తమముందు హాజరయ్యే న్యాయవాదులనే కాకుండా, దేశంలో ఎక్కడా అర్హులున్నా గుర్తించేందుకు ప్రాధాన్యమివ్వాలని కోరారు.
నేడు ముఖ్యమంత్రులు-హైకోర్టుప్రధాన న్యాయమూర్తుల సదస్సు
దిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ సమక్షంలో ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సు దిల్లీలో శనివారం జరగనుంది. ఆరేళ్ల విరామం తర్వాత నిర్వహిస్తున్న ఈ సమావేశాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న పలు సవాళ్లపై ఇందులో చర్చిస్తారు. కేసుల పెండింగ్ భారాన్ని తగ్గించుకోవడం, ఖాళీల భర్తీ, ఈ-కోర్టుల మూడోదశ విస్తరణ తదితర అంశాలపై విస్తృతంగా సమాలోచనలు జరుపుతారు. ఈ సదస్సులో తెలంగాణ తరఫున న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొననున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి