తెలంగాణకు లులూ
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తొలిరోజు పలు ప్రసిద్ధ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన లులూ
రూ. 500 కోట్లతో ఆహారశుద్ధి పరిశ్రమ స్థాపనకు అంగీకారం
రూ. వంద కోట్లతో కిమో ఫార్మా విస్తరణ
స్విట్జర్లాండ్ బ్యాంకింగ్, బీమా సంస్థ స్విస్రే పెట్టుబడి
హైదరాబాద్లో ఈ-కామర్స్ సంస్థ మీషో కార్యాలయం
దావోస్లో తొలిరోజు నాలుగు సంస్థలతో ఒప్పందాలు
ఈనాడు, హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తొలిరోజు పలు ప్రసిద్ధ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన లులూ గ్రూపు రూ.500 కోట్లతో ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. స్పెయిన్కు చెందిన కీమోఫార్మా రూ.100 కోట్లతో తమ రెండో భారీ పరిశ్రమ ఏర్పాటును ప్రకటించింది. స్విట్జర్లాండ్ బ్యాంకింగ్, బీమా సంస్థ స్వీస్రే హైదరాబాద్లో తమ కార్యాలయ ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ-కామర్స్ సంస్థ మీషో కూడా రాష్ట్ర రాజధానిలో కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. వాటిని మంత్రి కేటీఆర్ స్వాగతించారు.
హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి వాణిజ్య సముదాయం: లులూ సంస్థ
మంత్రి కేటీఆర్ను లులూ సంస్థ అధిపతి యూసుఫ్అలీ కలిసి ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటు నిర్ణయాన్ని తెలిపి, ప్రణాళిక అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అనుమతి పత్రాలను ఆయనకు అందజేశారు. మొదటి యూనిట్ పనులు చేపట్టిన వెంటనే రెండో యూనిట్కు శంకుస్థాపన చేస్తామని ఈ సందర్భంగా యూసుఫ్అలీ తెలిపారు. తెలంగాణ నుంచి యూరప్ దేశాలకు శుద్ధిచేసిన ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేస్తామన్నారు. హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయిలో అద్భుత వాణిజ్య సముదాయం నిర్మిస్తామన్నారు.
* స్పానిష్ బహుళజాతి సంస్థ కీమోఫార్మా పరిశోధన అభివృద్ధి డైరెక్టర్ జీన్ డానియల్ బోనీ కేటీఆర్ను కలిసి రూ.100 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో రెండో ఉత్పత్తి యూనిట్ను ఏర్పాటు చేస్తామన్నారు. తమ సంస్థ 2018 నుంచి జీనోమ్ వ్యాలీలో రూ.170 కోట్ల పెట్టుబడితో.. 270 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు కొనసాగిస్తోందన్నారు.
* 160 సంవత్సరాల చరిత్రగల స్విట్జర్లాండ్ బ్యాంకింగ్, ఆర్థిక నిర్వహణ, బీమా సంస్థ స్విస్ రే హైదరాబాద్లో తమ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని చెప్పింది. 250 మందికి ఉపాధి కల్పిస్తామని, దశలవారిగా విస్తరిస్తామని ప్రకటించింది. సంస్థ ఎండీ వెరోనికా స్కాట్టి, ప్రభుత్వ సంస్థల విభాగం డైరెక్టర్ ఇవో మెంజింగ్నర్ దావోస్లో మంత్రి కేటీఆర్తో సమావేశమై తమ నిర్ణయాన్ని తెలిపారు.హైదరాబాద్ కార్యాలయం ద్వారా తమ సంస్థ డాటా మరియు డిజిటల్ విభాగాలను బలోపేతం చేయడం, బీమా ఉత్పత్తులను రూపొందించడం, విపత్తుల నివారణ వంటి అంశాలపై పనిచేస్తుందన్నారు. నూతన ఆవిష్కరణల కోసం టీహబ్ భాగస్వామ్యం తీసుకుంటామన్నారు.
మీషోతో కార్యకలాపాలు
భారత్లో వేగంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్ సంస్థ మీషో వ్యవస్థాపకుడు విదిత్ ఆత్రే మంత్రి కేటీఆర్ ఆహ్వానం మేరకు హైదరాబాద్లో తమ కార్యాలయ ఏర్పాటుకు అంగీకరించి ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా తెలంగాణలోని ద్వితీయశ్రేణి నగరాల్లో రిటైల్ వ్యాపారులకు సేవలందిస్తామని తెలిపారు. అంతకుముందు కేటీఆర్ను విదిత్ ఆత్రేతో పాటు మరో యువ సంచలనం నితిన్ కామత్ (ఆన్లైన్ స్టాక్ మార్కెటింగ్ బ్రోకరింగ్ సంస్థ)లు కలిశారు. వారి అనుభవాలు తెలుసుకున్నారు. హైదరాబాద్కు వచ్చి యువతకు స్ఫూర్తినివ్వాలని కోరారు. ఈ సమావేశాల్లో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, జీవశాస్త్రాల సంచాలకుడు శక్తి నాగప్పన్, సీఆర్వో అమర్నాథ్రెడ్డిలు పాల్గొన్నారు.
తెలంగాణ పెవిలియన్ ప్రారంభం
దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో జపాన్కు చెందిన ష్యుజిత్సు సంస్థ సీఈవో తకహితో తొకిట, బ్రిటిష్ మైక్రోబయాలజిస్టు పీటర్ పియోట్ తదితరులు పాల్గొన్నారు. పవర్ పాయింటు ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ విధానాలను కేటీఆర్ వారికి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.