ఇంటింటా జ్వరం.. జలుబు
రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ప్రజలు జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరికి ఏదో ఒక సమస్య ఉంది. ఒమిక్రాన్ బయటపడిన అనంతరం నెలరోజులుగా ప్రతి ఇంట్లో ఇవి సర్వసాధారణమయ్యాయి.
ప్రతి నలుగురిలో ఒకరికి ఏదో ఒక సమస్య
జ్వర సర్వేలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ప్రజలు జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరికి ఏదో ఒక సమస్య ఉంది. ఒమిక్రాన్ బయటపడిన అనంతరం నెలరోజులుగా ప్రతి ఇంట్లో ఇవి సర్వసాధారణమయ్యాయి. రెండ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జ్వర సర్వేలో వెలుగుచూస్తున్న వాస్తవాలివి. 29.26 లక్షల ఇళ్లను సర్వే చేయగా ఇందులో జ్వరం తదితర లక్షణాలున్న వారు 1,28,079మంది. వీరిలో 1,27,372 మందికి కిట్లు ఇచ్చారు. చాలా మందిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకోకుండా స్థానిక వైద్యుల సహకారంతో మందులు వాడుతున్నారు. జ్వరం వచ్చిన మూడు, నాలుగు రోజుల్లో కొవిడ్ లక్షణాల తీవ్రత తగ్గుతుండడంతో ప్రజలు తేలికగా తీసుకుంటున్నారు.
లక్షణాలున్నా... లేవు లేవంటూ..
స్థానికంగా పంచాయతీ కార్యదర్శి, ఆశా వర్కర్, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్ బృందంగా ఏర్పడి రెండు రోజులుగా రోజుకి 100 గృహాలను జ్వర సర్వే చేస్తున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉంటే.. అక్కడే పరీక్షించి కిట్లు పంపిణీ చేస్తున్నారు. ‘‘కొందరు ఈ లక్షణాలున్నా భయంతో లేవని చెబుతున్నారు. తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ ప్రతి ఇంట్లో ఒకరికి ఏదో ఒక లక్షణం కనిపిస్తోంది. తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తున్నాం’’ అని సర్వేలో భాగమైన పలువురు అధికారులు తెలిపారు. సగటున ప్రతి వంద మందిలో 25-30 మంది ఏదో ఒక లక్షణంతో బాధపడుతున్నట్లు వివరించారు. కొవిడ్ లక్షణాలు కనిపించినా కొన్ని చోట్ల నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. పాజిటివ్ వస్తుందేమోనని ముందుకు రావడం లేదు. ఇటీవల లోకల్ సర్కిల్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో పాజిటివ్ వ్యక్తితో తిరిగిన ప్రజల్లో దాదాపు 41 శాతం మంది పరీక్షలకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడైంది.
జీహెచ్ఎంసీలోనూ..
జీహెచ్ఎంసీలో ఇప్పటి వరకు 55 వేల గృహాలను పరిశీలించారు. 2,200 మందికి లక్షణాలున్నట్లు గుర్తించారు. మరోపక్క బస్తీల్లోని ప్రైవేటు క్లినిక్లకు వచ్చే కేసులన్నీ జ్వరం, జలుబు, దగ్గుతోనే అని తెలుస్తోంది. ఒక్కో క్లినిక్కు రోజుకి కనీసం 200 మంది వస్తున్నారు. ఇంట్లో ఒకరికి చికిత్స తీసుకుంటే.. అవే మందుల్ని మిగతా వ్యక్తులు వాడుతున్నారు. హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండల కేంద్రంలో 250 మందిని జ్వర సర్వేలో పరీక్షించగా 40 మందికి జలుబు, జ్వరం ఉన్నట్లు వెల్లడైంది. వీరిలో నలుగురు పరీక్షలు చేయించుకోగా వారికి పాజిటివ్ వచ్చింది.
మరో 4,393 మందికి పాజిటివ్
రాష్ట్రంలో శనివారం కొత్తగా 4,393 కరోనా కేసులు నమోదయ్యాయి. చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రెండోసారి కొవిడ్ బారిన పడ్డారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్కు కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం 1,16,224 మందికి పరీక్షలు జరిగాయి. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 1,643, మేడ్చల్లో 421, రంగారెడ్డిలో 286, హనుమకొండలో 184, ఖమ్మంలో 128 కేసులు వచ్చాయి.
జిల్లాల వారీగా పరిస్థితిదీ...
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం ఒక్కరోజు 969 బృందాలు 65,777 గృహాలను పరిశీలించాయి. 3,914 మందికి కిట్లు ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా 695 గ్రామాల్లో సర్వే పూర్తయింది. 1.94 లక్షల గృహాల్లోని 3.65 లక్షల మందిని పరీక్షించారు. 7,030 మందికి కిట్లు అందించారు.
* ఖమ్మం జిల్లాలో రెండు రోజులుగా 1.35 లక్షల గృహాలను పరిశీలించగా లక్షణాలున్న 4,604 మందికి కిట్ల పంపిణీ జరిగింది. ఆదిలాబాద్లో 60 వేల గృహాలను పరిశీలించగా 1,458 మందిలో లక్షణాలు బయటపడ్డాయి.
* వరంగల్ జిల్లాలో 29,540 గృహాలను పరిశీలించగా.. 1,699 మందికి, హనుమకొండలో 22,375 గృహాలను సందర్శిస్తే 3,356 మందికి కొవిడ్ లక్షణాలు కనిపించాయి.
ఏపీలో 12,926 మందికి కొవిడ్
ఈనాడు, అమరావతి: ఏపీలో శుక్రవారం ఉదయం 9గంటల నుంచి శనివారం ఉదయం 9గంటల వరకు 29.53 శాతం కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 43,763 నమూనాలను పరీక్షించగా.. 12,926 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది.
మాజీ ప్రధాని దేవేగౌడకు కరోనా
ఈనాడు డిజిటల్, బెంగళూరు: మాజీ ప్రధాని దేవేగౌడ కరోనా బారినపడ్డారు. పాజిటివ్ రావడంతో బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కొవిడ్ రావటం ఇది రెండవసారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!