CBN: వైకాపా పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి
‘అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ తెదేపా ప్రాధాన్యమిస్తుంది. రాష్ట్ర రాజధాని నగరంగా అమరావతిని అభివృద్ధి చేయడం ద్వారా రూ.2 లక్షల కోట్ల
ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెదేపాదే గెలుపు
న్యూజిలాండ్లోని పార్టీ అభిమానుల వర్చువల్
మహానాడులో చంద్రబాబు
ఈనాడు, అమరావతి: ‘అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ తెదేపా ప్రాధాన్యమిస్తుంది. రాష్ట్ర రాజధాని నగరంగా అమరావతిని అభివృద్ధి చేయడం ద్వారా రూ.2 లక్షల కోట్ల సంపద సృష్టించే అవకాశం ఉంది. రాష్ట్ర భవిష్యత్తుపై ఆలోచన, ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా మూడు రాజధానుల ప్రకటనతో సీఎం జగన్ దాన్ని దెబ్బతీశారు. రెండేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి, సంక్షేమం మధ్య నమన్వయం దెబ్బతింది. సామాజికంగా, ఆర్థికంగా రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కు వెళ్లింది. 2024లో కాదు.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెదేపా విజయాన్ని అడ్డుకోవటం ఎవరికీ సాధ్యం కాదు’ అని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని న్యూజిలాండ్లోని పార్టీ అభిమానులు ఆదివారం నిర్వహించిన వర్చువల్ మహానాడులో ఆయన ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ను అభివృద్ధి చేశాం.. హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు కారణంగా అనేక పెద్ద ప్రాజెక్టులు వచ్చాయని ఆయన గుర్తు చేశారు.
విధ్వంసంతో పెట్టుబడులు పోయాయి
‘ప్రజావేదికను కూల్చటం ద్వారా వైకాపా విధ్వంస పాలన మొదలైంది. రాష్ట్ర రాజధాని అమరావతి బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయటం, ప్రజా వ్యతిరేక విధానాలు, పారిశ్రామిక వ్యతిరేక నిర్ణయాలతో వ్యవస్థలు దెబ్బతిన్నాయి. పెట్టుబడిదారులు భయపడి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు. రాష్ట్ర జీఎస్డీపీతో పోలిస్తే రాష్ట్రం తీసుకున్న రుణాలు 25 శాతాన్ని దాటాయి. ప్రస్తుతం ఇది 36 శాతం. ఒక్కోసారి 50 శాతాన్ని కూడా తాకుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భవిష్యత్తులో కొత్త రుణాలొచ్చే పరిస్థితి లేదు. ఆర్థికంగా ఏపీ దివాలా తీసింది. జగన్ పాలనలో తలసరి అప్పు పెరిగింది. సంక్షేమ పథకాల పేరిట ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు ఇచ్చి.. వారిపై రూ.50 వేల రుణ భారాన్ని మోపుతున్నారు’ అని విమర్శించారు. ‘రెండో దశ కరోనా నియంత్రణకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గతంలో తెదేపా హయాంలో హైదరాబాద్లో అభివృద్ధి చేసిన జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ సంస్థ కొవిడ్ వ్యాక్సిన్ను తయారు చేసింది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
‘జగన్.. రెండేళ్ల విధ్వంసం’
కరపుస్తకం విడుదల చేసిన తెదేపాఈనాడు, విశాఖపట్నం: వైౖకాపా ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేసిన అక్రమాలు, అవినీతి, కుంభకోణాలతో దేశంలో రాష్ట్ర ప్రతిష్ఠ దిగజారిందంటూ ‘జగన్.. రెండేళ్ల విధ్వంసం’ పేరుతో తెలుగుదేశం కరపుస్తకం విడుదల చేసింది. పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదివారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో ‘రెండేళ్ల వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జిషీటు’ పేరుతో దీన్ని ఆవిష్కరించారు. ఇందులో ప్రభుత్వం చేసిందంటూ 96 నేరాలు-ఘోరాలను తొమ్మిది భాగాల్లో వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు