TS News: రోదసిలోకైనా వెళ్లొచ్చు.. ఈ ఊర్లకు వెళ్లలేం
రోదసిలోకి మనుషులు సురక్షితంగా వెళ్లివస్తున్న ఈ రోజుల్లోనూ.. రాష్ట్రంలో దాదాపు 289 గ్రామాల ప్రజలు వర్షాల సమయంలో ఊరు దాటి బయటకు వెళ్లలేని దుస్థితి.
289 గ్రామాల పరిధిలో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలతో ఇబ్బందులు
ముందడుగు పడని వంతెనల నిర్మాణాలు
కాజ్వేలు, బ్రిడ్జిలకు మరమ్మతులూ కరవు
ఈనాడు, హైదరాబాద్: రోదసిలోకి మనుషులు సురక్షితంగా వెళ్లివస్తున్న ఈ రోజుల్లోనూ.. రాష్ట్రంలో దాదాపు 289 గ్రామాల ప్రజలు వర్షాల సమయంలో ఊరు దాటి బయటకు వెళ్లలేని దుస్థితి. బయటివారు గ్రామంలోకి రాలేని పరిస్థితి. పొంగిపొర్లే వాగులు, వంకలను ధైర్యం చేసి దాటుతున్నవారు ప్రమాదాల బారిన పడడం, కొన్నిసార్లు ప్రాణాలు పోగొట్టుకోవడం ఇక్కడ సాధారణమైపోయింది. కాన్పు కోసం ఆసుపత్రికి వెళ్లాల్సిన గర్భిణులు, తక్షణ వైద్యం అవసరమైన వారు సైతం.. దేవుడిపైనే భారంవేసి కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. నిత్యావసర వస్తువుల సరఫరాపైనా ప్రభావం పడుతోంది. ఐటీడీఏలు, పంచాయతీరాజ్, రహదారులు-భవనాల శాఖలు.. ఆయా ప్రాంతాల్లో వంతెనల నిర్మాణం, మరమ్మతులు, రోడ్లను బాగు చేసేందుకు ఏటా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నా ఫలితం ఉండటం లేదు. కొన్నింటికి నిధులు వచ్చినా పనులు సాగడం లేదు. దీంతో వానాకాలంలో ఆయా గ్రామాల ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.
* ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రతి వర్షాకాలంలో 137 గ్రామాలు జలదిగ్బంధానికి గురవుతున్నాయి.
* మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 32 గ్రామాల పరిధిలో వాగులు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. గతేడాది గోపాల్పేట మండలంలో ఇద్దరు కొట్టుకుపోయారు.
* వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తే 55 గ్రామాలకు ఏటా రాకపోకలు నిలిచిపోతున్నాయి. జంపన్నవాగుకు వరద వస్తే వందల గ్రామాలపై ప్రభావం పడుతోంది. ఈ వాగులో సోమవారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
* ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఏజెన్సీ పరిధిలో 65 గ్రామాలు జలదిగ్బంధానికి గురవుతున్నాయి. వైద్యానికి, నిత్యావసరాలకు గిరిజనులు అవస్థలు పడుతున్నారు.
బాహ్య ప్రపంచంతో సంబంధాలు బంద్
భద్రాద్రి జిల్లా గుండాల మండలంలో కిన్నెరసాని వాగు ఉప్పొంగితే పలు గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. ముఖ్యంగా సజ్జలబోడు, నడింగూడెం, మోదుగుల గూడెం ప్రజలు వాగు మధ్యలో ఒకచోట రెండు పెద్ద బండరాళ్ల మధ్య కట్టెలు వేసి దానిపై ప్రమాదకరంగా దాటుతున్నారు. ఈ రెండు బండల మధ్య 20 అడుగుల లోతులో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంటుంది. తప్పని పరిస్థితుల్లో అవసరాలకు, వ్యవసాయ పనులకు గ్రామస్థులు ఏళ్లుగా ఈ సాహసం చేస్తున్నారు. 2018-19లో ఈ వాగుపై రూ.3 కోట్లతో వంతెన మంజూరైనా నిర్మాణం అసంపూర్తిగానే ఉంది.
వరంగల్ జిల్లా నర్సంపేట గ్రామీణ మండలం గురిజాల కాజ్వే వద్ద చెరువు మత్తడి ప్రవాహంలో స్థానికుల ఇబ్బందులు ఇవీ. గత ఆదివారం ఇక్కడ ఓ యువకుడు కొట్టుకుపోయి మృతి చెందాడు. ఏటా ఎంతో మంది ఇక్కడ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక్కడ కొత్త వంతెన, రోడ్డు నిర్మాణానికి రూ.6.15 కోట్లు మంజూరు చేసినా పనులు జరగడంలేదు. సమీప 8 గ్రామాల ప్రజల రాకపోకలకు ఈ దారే ఆధారం.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండల కేంద్రం నుంచి 25 కిమీ దూరంలో ఉంటుంది గోంది గ్రామం. కాగజ్నగర్ నుంచి సగం దూరమే తారు రోడ్డు సదుపాయం ఉంది. మిగతా మార్గం మట్టి రోడ్డే. వర్షాలు కురిస్తే వాహనాలు తిరగలేవు. ఈ గ్రామానికి చెందిన గర్భిణి సక్రుబాయికి పదిరోజుల క్రితం పురిటి నొప్పులు రావడంతో గ్రామం నుంచి తారు రోడ్డు వరకూ ఎడ్లబండిపై తరలిస్తుండగా మధ్యలో బండిపైనే ఆమె ప్రసవించింది. తర్వాత తారు రోడ్డు వరకూ చేరాక 108లో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ జిల్లాలో పది మండలాల్లో వాగులపై వంతెనలు లేకపోవడం, కచ్చా రోడ్లు కావడంతో ఏటా వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి.
భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం దొడ్ల-మల్యాల గ్రామాల మధ్య జంపన్నవాగుపై ఉన్న ఈ వంతెన గతేడాది ఆగస్టులో కుంగింది. ఇప్పటికీ మరమ్మతులు చేయలేదు. దీంతో నాలుగు గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో చిన్నబోయినపల్లి-షాపల్లి గ్రామాల మధ్య ఉన్న వంతెన కూడా కొట్టుకుపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
యూటీఎస్ యాప్ పరిధి పెంపు
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు. -
ఏఈ పోస్టుల జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీజీపీ రవిగుప్తాకు పరిహారం చెల్లించండి
పనిచేయని రిక్లైనర్ సీటును కేటాయించి తీవ్ర అసౌకర్యం కలిగించడం, బిజినెస్(జెడ్) క్లాస్ టికెట్లో ఎకానమీ క్లాస్ సేవలందించిన నేపథ్యంలో డీజీపీ దంపతులకు రూ.2,07,500 పరిహారం చెల్లించాలని సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 ఆదేశించింది. -
విద్యుత్ సరఫరాపై చర్చకు సిద్ధం
విద్యుత్ రంగంపై మాజీ సీఎం కేసీఆర్ అవాస్తవ ప్రకటనలు చేస్తూ లోక్సభ ఎన్నికల ముందు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. -
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు.