మత్తునూ చిత్తు చేయొచ్చు
‘మత్తు’ బాధితుల్లో వయో పరిమితి లేనే లేదు.. ఆ రొంపిలో దిగి నిండుజీవితాలు నిండా మునుగుతున్నాయి. కుటుంబాల్లో కలహాలు రేగుతున్నాయి.
బాధితుల చికిత్సకు మార్గాలున్నాయ్
అన్ని జిల్లాల్లో అందుబాటులో డీఎడిక్షన్ కేంద్రాలు
వ్యసనాన్ని ముందే గుర్తించి మేలుకోవాలి అంటున్న నిపుణులు
‘మత్తు’ బాధితుల్లో వయో పరిమితి లేనే లేదు.. ఆ రొంపిలో దిగి నిండుజీవితాలు నిండా మునుగుతున్నాయి. కుటుంబాల్లో కలహాలు రేగుతున్నాయి. మద్యం, గంజాయి, వైట్నర్, గమ్ తదితరాలకు బానిసలైన కారణంగా.. విద్యార్థుల చదువులతో పాటు ఆరోగ్యాలూ దెబ్బతింటున్నాయి. చాప కింది నీరులా విస్తరిస్తోన్న ఈ సమస్యకు పరిష్కారం చూపుతున్నాయి డీఎడిక్షన్ కేంద్రాలు.. మత్తు బాధితులను ఆదుకునేందుకు, ఆసరాగా నిలిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇవి అందుబాటులో ఉన్నాయి.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కొనసాగుతోన్న ఈ కేంద్రాల్లో రోజుకి 5-10 మంది చొప్పున ఓపీ చికిత్స చేస్తున్నారు. చేయాల్సిందల్లా తల్లిదండ్రులు లేదా పెద్దలు మేల్కొనడం.. పిల్లల్లో వ్యసనాన్ని ముందుగానే గుర్తించటం.. బాధితులను వీలైనంత తొందరగా ఆయా కేంద్రాలకు తరలించి, చికిత్స చేయించటం.. అంటూ హితవు పలుకుతున్నారు నిపుణులు.
చికిత్స ఎలా సాగుతుంది..?
మత్తుకు బానిసలైనవారిని చికిత్స కేంద్రాలకు తీసుకురావటం కత్తి మీది సామే.. కుటుంబసభ్యులు నచ్చజెప్పి ఆ పని చేయాలి. అలా వచ్చే బాధితులకు 1-3 నెలల చికిత్సలో తొలుత వైద్యపరీక్షలు చేస్తారు. హిమోగ్లోబిన్ శాతం, కాలేయం, మూత్రపిండాల పనితీరు, మానసిక స్థితి పరిశీలిస్తారు. క్షయ, కామెర్లు సోకాయేమో పరీక్షిస్తారు.. అనంతరం 3-4 రోజులు సోషల్వర్కర్లు, సైకియాట్రిస్టులు, వైద్యులు కౌన్సెలింగ్ ఇస్తారు. ఒక్కసారిగా మత్తు అలవాటు మాన్పించడంతో చేతులు వణకడం, కోపతాపాలు ప్రదర్శించటంతో పాటు బాధితులు వింతగా ప్రవర్తిస్తారు. ఈ సమయంలో వైద్యుల పర్యవేక్షణలో వారికి యాంటీ టాక్సిఫికేషన్ మందుల్ని అందిస్తారు. పదిరోజుల ఈ కోర్సు పూర్తయ్యాక బాధితులు, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇస్తారు. చికిత్స అనంతరం వారానికి రెండు, మూడుసార్లు ఫోన్లో వారితో మాట్లాడుతూ అవసరమైన సూచనలు చేస్తారు.
మత్తు వీడాలంటూ గ్రామాల్లో నిర్వహిస్తున్న అవగాహన సదస్సు
కుటుంబ సభ్యులే కీలకం..
మత్తు బారిన పడినవారిలో మార్పు తెచ్చేలా తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు మసలాలి. గత విషయాలు గుర్తుచేయకుండా, సూటిపోటి మాటలనకుండా కొత్త జీవితం దిశగా వారిని మళ్లించాలి. చెడు స్నేహితుల్ని దూరం పెట్టాలి. ఫోన్లో వారి నంబర్లు తొలగించాలి. పశ్చాత్తాపంతో జనజీవనంలోకి రావాలనుకునే బాధితులను అన్ని విధాలా ఆదరించాలి.
మరిన్ని చికిత్స కేంద్రాలు అవసరం..
చికిత్స, పునరావాసం కోసం కేంద్ర సామాజిక మంత్రిత్వశాఖ నిజామాబాద్ మినహా ఉమ్మడి జిల్లాల్లో తొమ్మిది పునరావాస చికిత్స కేంద్రాలు ఏర్పాటుచేసింది. ఈ కేంద్రాల్లో ఉచిత చికిత్స లభిస్తోంది. ప్రస్తుతం మత్తు బానిసలు పెరుగుతున్నందున వీటి సంఖ్యనూ పెంచాల్సిన అవసరముంది. గాంధీ, ఎర్రగడ్డ మానసిక వైద్యాలయాల్లోనూ ఈ చికిత్స లభిస్తోంది.
గైర్హాజరు, అత్తెసరు మార్కులతో గుట్టురట్టు..
పిల్లలు మత్తుకు అలవాటైన విషయాన్ని తల్లిదండ్రులు ఆదిలోనే గుర్తించలేకపోతున్నారు. తరగతులకు డుమ్మాలు కొట్టడం, మార్కులు తక్కువ రావటం, సబ్జెక్టుల్లో తప్పడంతో విద్యాసంస్థల నుంచి హెచ్చరిక వచ్చాకే ఎక్కువ కేసుల్లో అసలు విషయం వారికి తెలుస్తోంది. ‘‘మా వద్దకు వస్తున్న కేసుల్లో 80 శాతం ఇలాంటివే. తల్లిదండ్రులు మొదట్లోనే సరైన చికిత్స, కౌన్సెలింగ్ ఇప్పిస్తే పిల్లలు కోలుకునే వీలుంటుంది’’ అని న్యూహోప్ అసోసియేషన్ ప్రతినిధి డి.కోమలి కృష్ణారెడ్డి తెలిపారు.
మత్తును వదిలి.. బాధితులకు బాసటగా
అతడో ప్రభుత్వోద్యోగి. మత్తుకు బానిసై అనుచిత ప్రవర్తనతో సస్పెన్షన్ వేటుకు గురయ్యాడు. బంధువులు, కుటుంబసభ్యులు దూరమయ్యారు. మత్తులో ఓరోజు ఆత్మహత్యకు యత్నించినా బతికి బయటపడ్డాడు. పునరావాస కేంద్రంలో చేర్చడంతో సాధారణ స్థితికి వచ్చాడు. ఇప్పుడు కుటుంబంతో హాయిగా ఉన్నాడు. ఎవరైనా మద్యం, మత్తుకు బానిసైతే తానే కౌన్సెలింగ్ ఇస్తున్నాడు.
పేరు కూడా మరచిపోయి...
నగరానికి చెందిన 27 ఏళ్ల యువకుడికి మద్యం, గంజాయి అలవాటైంది. కళాశాలకు డుమ్మా కొట్టేవాడు. గ్యాంగులతో తిరుగుతూ గంజాయి తీసుకునేవాడు. అది శ్రుతిమించి మెదడు మొద్దుబారింది. చివరకు పేరు కూడా గుర్తులేకుండా పోయింది. ఓరోజు పోలీసులకు పట్టుబడగా, తెలిసినవారు విడిపించి పునరావాస కేంద్రంలో చేర్చారు. మూడునెలలుగా చికిత్సతో ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటున్నాడు.
పీడించే స్థితి నుంచి ఇంటికి ఆసరాగా నిలిచి..
21 ఏళ్ల యువకుడు గంజాయికి బానిసయ్యాడు. తండ్రి లేడు.. తల్లే పిల్లల్ని పోషిస్తోంది. కుర్రాడు రోజూ రాత్రి మత్తులో ఇంటికొచ్చేవాడు. తల్లిని కొట్టి ఉన్న సొమ్మంతా గుంజుకెళ్లేవాడు. భరించలేని తల్లి పోలీసుల్ని ఆశ్రయించింది. ధూల్పేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ సదరు యువకుణ్ని పునరావాస చికిత్స కేంద్రానికి పంపించారు. ఆర్నెల్ల తరువాత అతనిలో మార్పొచ్చింది. ఇపుడు ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలిచాడు.
కేంద్ర సామాజిక న్యాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల(ఎన్జీవోల) ఆధ్వర్యంలో డీఎడిక్షన్ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో బాధితులకు ఉచిత చికిత్స, వసతి, భోజన సౌకర్యాలు లభిస్తున్నాయి. ఒక్కో కేంద్రంలో 15 పడకలు అందుబాటులో ఉన్నాయి. బాధితుల సంఖ్య పెరుగుతున్నందున కొత్త జిల్లాల్లో ఈ కేంద్రాల మంజూరుకు రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపాలి. అలా చేయకపోవడంతో వాటి ఏర్పాటు నిలిచిపోయింది.
గ్రూపులతో మాఫియా దందా..
యువతకు మత్తుమందులు చేరవేసేందుకు మాఫియా వాట్సాప్ గ్రూపులు నిర్వహిస్తోంది. ‘‘గంజాయికి బానిసైన వ్యక్తుల ఫోన్లోని కాంటాక్టులను తీసుకుని వారిపై నిఘా పెడుతున్నాం. ఇతర రాష్ట్రాల వారుంటే అక్కడి పోలీస్ స్టేషన్లకు సమాచారమిస్తున్నాం’’ అని ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. ‘‘మత్తు పదార్థాలు సొంతగా ఎవరూ అలవాటు చేసుకోరు. ఒక్కసారి రుచిచూడంటూ స్నేహితులు బలవంతపెట్టడంతో అవి అలవాటవుతాయి. తల్లిదండ్రులు పిల్లలకు సమయానికి కడుపు నిండా ఆహారం పెడితే ఇతర దురలవాట్లు దరిచేరవు’’ అని డోవ్ సంస్థ ప్రతినిధి త్యాగరాజులు పేర్కొన్నారు. ‘‘బాణామతి, దయ్యం పట్టిందంటూ చేసే క్షుద్ర చికిత్సలు, నాటుమందుల కారణంగా ఆరోగ్యం పాడవుతుంది.. వైద్యులు, సైకియాట్రిస్టు, కౌన్సెలర్ల సమక్షంలో చికిత్స తీసుకుంటే బాధితులు వేగంగా కోలుకుంటారు’’ అని చికిత్స కేంద్రం కౌన్సెలర్ ధనలక్ష్మి వివరించారు.
ఎన్జీవోల అధ్వర్యంలోని డీఎడిక్షన్ కేంద్రాలు.. ఫోన్ నంబర్లు
* మత్తునూ చిత్తు చేయొచ్చుడోవ్ సంస్థ(94404-18424): తాండూరు (99890-09062), ఆదిలాబాద్ (98488-53333), ఆమన్గల్ (9640560328)
* న్యూహోప్ అసోసియేషన్ (99667-11196): హైదరాబాద్, నల్గొండ (చిట్యాల)
* విజన్ (99084-68003): మెదక్ (నర్సాపూర్)
* సంకల్ప్ (98485-19555): రంగారెడ్డి (కొత్తూరు)
* హెల్పింగ్హ్యాండ్ సొసైటీ: శ్రీధర్ కాంప్లెక్సు, హౌసింగ్బోర్డు కాలనీ, హనుమకొండ
* షేర్ ఎన్జీవో: బంజారా కాలనీ, మధిర, ఖమ్మం
* ప్రకృతి సొసైటీ: అశోక్నగర్, కరీంనగర్
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
నాలుగో రోజూ 46 డిగ్రీలపైనే..
రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. శుక్రవారం 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. -
రిజిస్ట్రార్ కోర్టు ముందు లిస్ట్ కావాల్సిన కేసు ఇక్కడికెలా వచ్చింది?
ప్రస్తుతం తెలంగాణలో విచారణ జరుగుతున్న ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ భారాస నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జులైకి వాయిదా వేసింది. -
దోస్త్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. -
‘టానిక్’కు మినహాయింపుల్లోనే మతలబు!
రాష్ట్రంలో ఎలైట్ వైన్షాప్ ‘టానిక్’ ఏర్పాటు సమయంలో ఇచ్చిన వెసులుబాట్లలోనే మతలబు ఉన్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ధారణకు వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
ఆరు రోజులుగా నక్కి.. ఎరకు చిక్కి
శంషాబాద్ విమానాశ్రయ రన్వే మైదానంలోకి గత నెల 27న చొరబడి అందరినీ కంగారుకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. -
వామనరావు దంపతుల హత్య కేసు.. సీబీఐకి అప్పగించేందుకు సిద్ధం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని హైవేలో 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాదులు గట్టు వామనరావు దంపతుల హత్యకేసు దర్యాప్తును సీబీఐ లేదా సీఐడీకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
కోర్టులో నేరుగా హాజరుపరచాలని కవిత దరఖాస్తు
ప్రస్తుతం దిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు ముందు విచారణ జరిగే సమయంలో తనను నేరుగా హాజరుపరచాలంటూ భారాస ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు దాఖలుచేశారు. -
సులభతర వాణిజ్య విధానంలో మరిన్ని సంస్కరణలు
సులభతర వాణిజ్య విధానం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-ఈఓడీబీ)లో అత్యుత్తమ సేవలు కొనసాగించాలని, ఇందుకోసం మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఆదేశించారు. -
నిబంధనలు ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై చర్యలు
తెలంగాణలో నిబంధనలను ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై విద్యాశాఖ కొరడా ఝుళిపించింది. ఇంటర్ విద్యామండలి ఆదేశాలను విస్మరించి వేసవి సెలవుల్లో కళాశాలలను నిర్వహించడం, ప్రవేశాలు కల్పించినందుకుగాను ఒక్కో కళాశాలపై రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వం కోరితే.. పదోన్నతులకు టెట్ మినహాయింపునిస్తాం
తెలంగాణలో 2010 కన్నా ముందు నియమితులై 1 నుంచి 5 తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే వెంటనే ఉత్తర్వులిస్తామని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఛైర్మన్ యోగేశ్ సింగ్ తెలిపారు. -
టెట్ పరీక్షల షెడ్యూలు విడుదల
ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024 షెడ్యూలును విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. -
6న ఈసెట్
టీఎస్ ఈసెట్-2024 ప్రవేశ పరీక్ష మే 6వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. -
ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు
ఎండల తీవ్రత దృష్ట్యా జాతీయ ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు. -
ఆర్టీసీ రిజర్వేషన్ ఛార్జీలపై మినహాయింపు
దూరప్రాంత బస్ సర్వీసుల్లో రిజర్వేషన్ ఛార్జీలపై టీఎస్ఆర్టీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. -
40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ.32 వేలు, గరిష్ఠంగా రూ.2,95,460 ఉండాలని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర గెజిటెడ్ అధికారుల (టీజీవోల) సంఘం కోరింది. -
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో ముఖ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు ముగిసిన దశలో కీలక మలుపు తిరిగింది. -
హెచ్సీయూ వీసీ, నేతలపై నమోదైన కేసులో ఆధారాల్లేవు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
భాజపా నేతను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లిలో వైకాపా అరాచకం
-
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన