Varun Singh: తుదిశ్వాస విడిచిన కెప్టెన్ వరుణ్సింగ్
తమిళనాడులో వారం కిందట వాయుసేన హెలికాప్టర్ కూలి గాయాలైన గ్రూప్ కెప్టెన్ వరుణ్సింగ్(39) తుదిశ్వాస విడిచారు. బెంగళూరులోని కమాండో వైద్యాలయంలో బుధవారం ఉదయం ఆయన మృతి చెందినట్లు వాయుసేన అధికారికంగా ప్రకటించింది.
వారం కిందట హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్ర గాయాలు
బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
ఈనాడు డిజిటల్, బెంగళూరు: తమిళనాడులో వారం కిందట వాయుసేన హెలికాప్టర్ కూలి గాయాలైన గ్రూప్ కెప్టెన్ వరుణ్సింగ్(39) తుదిశ్వాస విడిచారు. బెంగళూరులోని కమాండో వైద్యాలయంలో బుధవారం ఉదయం ఆయన మృతి చెందినట్లు వాయుసేన అధికారికంగా ప్రకటించింది. డిసెంబరు 8న త్రిదళపతి జనరల్ బిపిన్రావత్ సహా 14 మంది సైనిక బృందం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని కున్నూర్లో కుప్పకూలింది. ఈ సంఘటనలో తీవ్రగాయాలైన గ్రూప్ కెప్టెన్ వరుణ్సింగ్ను తమిళనాడులోని వెల్లింగ్టన్ ఆసుపత్రిలో చేర్చారు. మెరుగైన చికిత్స కోసం ఈ నెల 9న బెంగళూరులోని ఐఏఎఫ్ కమాండో ఆసుపత్రికి తరలించారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. వరుణ్సింగ్ భౌతికకాయాన్ని గురువారం ఉదయం మధ్యప్రదేశ్లోని భోపాల్కు తరలించనున్నట్లు ఐఏఎఫ్ అధికార వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపాయి. వరుణ్సింగ్ మృతికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్షా, రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. వరుణ్సింగ్కు భార్య, 11 ఏళ్ల కుమారుడు, 8 ఏళ్ల కుమార్తె ఉన్నారు.
రావత్ హిందీలో మాట్లాడటంతో అర్థంకాలేదు
చెన్నై, న్యూస్టుడే: ప్రమాదం జరిగిన రోజు త్రిదళపతి బిపిన్రావత్ హిందీలో మాట్లాడటంతో తమకు అర్థం కాలేదని అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. రక్షణశాఖ హెలికాప్టర్ పేలుడుపై రోజుకో విషయం బయటకు వస్తోంది. బిపిన్రావత్ చివరిమాటల గురించి అంబులెన్స్ సిబ్బంది వెల్లడించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ధైర్యే సాహసే.. వరుణ్
దిల్లీ: యుద్ధవిమానాలను నడపడం కత్తి మీద సాము. ముఖ్యంగా ప్రయోగదశలో ఉన్నప్పుడు నడపడం అంత సులభం కాదు. ఎన్నో సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. ఊహించని పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ప్రాణాలకూ ముప్పే. యుద్ద విమాన టెస్ట్ పైలట్గా వరుణ్సింగ్ అలా ప్రాణాలకు తెగించి ఎన్నో సాహసాలు చేశారు. 2020లో తేజస్ యుద్ధ విమానం నడుపుతున్న సమయంలో ఒక్కసారిగా కాక్పిట్లో పీడనం తగ్గిపోయింది. హైడ్రాలిక్ సమస్యా ఉత్పన్నమైంది. విమానం ఎత్తు అకస్మాత్తుగా తగ్గిపోయింది. అలాంటి క్లిష్టపరిస్థితుల్లో సాధారణంగా పైలట్లు పారాచూట్ సాయంతో ప్రాణాలు రక్షించుకునేందుకు మొగ్గు చూపుతారు. వరుణ్ అలా చేయలేదు. అదుపు తప్పుతున్న విమానాన్ని తన నియంత్రణలో తెచ్చుకునేందుకు ప్రయత్నించారు. చివరకు అందులో సఫలమై.. ఎట్టకేలకు చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. ఈ సాహసానికి ఈ ఏడాది ఆగస్టులో ఆయనకు సైన్యంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘శౌర్యచక్ర’ లభించింది. ‘తన ప్రాణానికి ముప్పు ఉందని తెలిసీ.. అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించి యుద్ధ విమానాన్ని నియంత్రించారు. సురక్షితంగా ల్యాండ్ చేసి వందల కోట్లను ఆదా చేశారు’ అంటూ పురస్కార సమయంలో భారత వాయుసేన వరుణ్సింగ్ను అభినందించింది. వరుణ్ తండ్రి కర్నల్(రిటైర్డ్) కేపీ సింగ్ కూడా సైనికాధికారే. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్(ఏఏడీ)లో విధులు నిర్వహించారు. సోదరుడు తనూజ్ సింగ్.. ప్రస్తుతం నావికాదళంలో లెఫ్టినెంట్ కమాండర్ హోదాలో ఉన్నారు.
చదువులో సామాన్యుడు.. తెగువలో అసామాన్యుడు!
వరుణ్సింగ్ సగటు విద్యార్థి. చిన్నప్పుడు చదువులో గొప్పగా మార్కులు సాధించ లేదు. శౌర్యచక్ర అవార్డు స్వీకరించిన తర్వాత.. చండీమందిర్ (హరియాణా)లో తాను చదువుకున్న ఆర్మీ పబ్లిక్ పాఠశాల విద్యార్థులకు రాసిన ఓ లేఖలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. చదువుల్లో సగటు ప్రతిభ చూపినప్పటికీ.. భవిష్యత్తులో అద్భుతాలు చేయొచ్చని చెబుతూ ఆ లేఖ ద్వారా విద్యార్థులకు ప్రోత్సాహాన్నిచ్చారు. ‘సగటు విద్యార్థిగా ఉన్నా పర్వాలేదు. పాఠశాలలో బాగా చదవడం, ప్రతి పరీక్షలో 90కి పైగా మార్కులు సాధించడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఒకవేళ అలా చేస్తే అద్భుత ఘనత కిందే లెక్క. వారిని అభినందించాల్సిందే. అయితే- మార్కులు బాగా రానంతమాత్రాన మీరు ఎప్పుడూ సగటు మనిషిలా ఉండిపోతారేమోనని నిరుత్సాహపడకండి. పాఠశాలలో మీరు సగటు విద్యార్థి కావొచ్చు. భవిష్యత్తులో జరగబోయేదానికి మాత్రం అది కొలమానం కాదు. మీకు ఏది ఇష్టమో గుర్తించండి. ఏ రంగంలోకి దిగినా అంకితభావంతో పనిచేయండి. నేను సగటు విద్యార్థిని. 12వ తరగతిలో అతికష్టం మీద ఫస్ట్ డివిజన్ సాధించాను. క్రీడల్లోనూ అంతంతమాత్రమే. కానీ నాకు విమానాలన్నా.. విమానయాన రంగమన్నా అమితాసక్తి. అందులో చూపిన తెగువ కారణంగా రాష్ట్రపతి చేతుల మీదుగా శౌర్యచక్ర అవార్డు దక్కింది’ అని ఈ ఏడాది సెప్టెంబరు 18న రాసిన లేఖలో వరుణ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్