KTR: సింగరేణి జోలికొస్తే భాజపాను తరిమికొడతారు
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణి సంస్థ అద్భుతంగా అభివృద్ధిచెందడం భరించలేక కేంద్రం దానిని ఉద్దేశపూర్వకంగా చంపే కుట్రకు తెరలేపిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ విమర్శించారు. సింగరేణిని
వేలం రద్దుచేసి నేరుగా గనులు కేటాయించండి
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి కేటీఆర్ లేఖ
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణి సంస్థ అద్భుతంగా అభివృద్ధిచెందడం భరించలేక కేంద్రం దానిని ఉద్దేశపూర్వకంగా చంపే కుట్రకు తెరలేపిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ విమర్శించారు. సింగరేణిని బలహీనపరిచి, నష్టపూరిత సంస్థగా మార్చి అంతిమంగా ప్రైవేటుపరం చేసేందుకు పూనుకుందన్నారు. నల్లచట్టాలతో రైతులను నట్టేట ముంచే పన్నాగం పన్నిన కేంద్రం నల్ల బంగారంపై కన్నేసిందన్నారు. వేల మంది కార్మికుల భవిష్యత్తును బహిరంగ మార్కెట్లో వేలం వేస్తోందని ధ్వజమెత్తారు. సింగరేణిలో ఉన్న జేబీఆర్ఓసీ-3, కేకే -6, శ్రవణపల్లి ఓసీ, కోయగూడెం గనులను సింగరేణి సంస్థకు కేటాయించకుండా వాటికోసం వేలంలో పాల్గొనాలని నిర్దేశించడం దారుణమని పేర్కొన్నారు. గుజరాత్లో అడిగిన వెంటనే లిగ్నైట్ గనులను ఎలాంటి వేలం లేకుండా గుజరాత్ ఖనిజాభివృద్ధి సంస్ధకు కేటాయించిన కేంద్రం తెలంగాణలో సింగరేణికి ఇవ్వకపోవడాన్ని వివక్షగా అభివర్ణించారు. తెలంగాణ దేశంలో రాష్ట్రం కాదా? అక్కడో విధానం.. ఇక్కడో విధానం ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణకే కొంగు బంగారం లాంటి సింగరేణిని దెబ్బతీస్తే భాజపా కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయమని పేర్కొన్నారు ఇలాంటివి మానకపోతే సింగరేణి కార్మికులు మరోసారి ఉక్కుపిడికిళ్లు బిగించి, కేంద్రంలోని భాజపాను వెంటపడి తరిమికొడతారన్నారు..ఈ మేరకు కేటీఆర్ సోమవారం కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశారు. ‘‘సింగరేణిలో గత ఏడేళ్లలో 450 లక్షల టన్నుల నుంచి 670 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. బొగ్గు తవ్వకాలు, రవాణా, లాభాలు, కంపెనీ విస్తరణ విషయంలోనూ సింగరేణి గణనీయమైన ప్రగతిని సాధిస్తోంది. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్ధ ఇవ్వని విధంగా లాభాల్లో 29 శాతం వాటాను ఇస్తున్న సంస్థ సింగరేణి మాత్రమే. ఏపీలోని విశాఖ స్టీల్ప్లాంట్కు కావాల్సిన ఐరన్ ఓర్ గనులు ఇవ్వకుండా నష్టాలకు గురిచేసి ప్రైవేటుపరం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇలాంటి పథకాన్నే సింగరేణిపై ప్రయోగించేందుకు కేంద్రం యత్నిస్తోంది.
కేంద్రం వైఖరితో తీవ్రనష్టం
తెలంగాణ ఆవిర్భావం తర్వాత సింగరేణిలో 16 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగ ఉపాధి కల్పనకు కేంద్రంగా ఉన్న ఈ రంగాన్ని ప్రైవేటుపరం చేయడం అంటే, అంబేడ్కర్ ఆశయాలకు తూట్లు పొడిచి, రిజర్వేషన్లకు పాతరేయడమే. సింగరేణిని ప్రైవేటీకరిస్తే వారసత్వ ఉద్యోగాలు రావు. గనులు మూతపడిన కొద్దీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తారు. కార్మికులకు అందుతున్న హక్కులు, లాభాల్లో వాటా వంటివి ఆగిపోతాయి. సింగరేణి ద్వారా రాష్ట్రంలోని రెండు వేల పరిశ్రమలకు బొగ్గు అందుతోంది. ప్రైవేటీకరణ జరిగితే బొగ్గు సరఫరా ఆగిపోయి, రాష్ట్ర పారిశ్రామిక పురోగతి ప్రమాదంలో పడుతుంది. సింగరేణిని కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది.. కేంద్రం వెంటనే వేలం రద్దు చేసి సింగరేణికి బొగ్గు గనులను నేరుగా కేటాయించాలి’’ అని మంత్రి కేటీఆర్ లేఖలో ప్రహ్లాద్జోషిని కోరారు.
ఏ పోరాటానికైనా సిద్ధం
ప్రభుత్వ విప్ సుమన్, ఎమ్మెల్యేలు ఆనంద్, క్రాంతికిరణ్
ఈనాడు, హైదరాబాద్: సింగరేణికి ఏదైనా జరిగితే దానికి కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ అన్నారు. సింగరేణిని నష్టపరిచి తెలంగాణ ప్రగతిని దెబ్బకొట్టే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అడ్డుకుంటుందని తెలిపారు.సోమవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, మెతుకు ఆనంద్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు జీవగర్ర అయిన సంస్థను బతికించుకునేందుకు తెరాస ప్రజాప్రతినిధులం ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గతంలో జైశ్రీరాం అన్న భాజపాతో జై భీమ్ అనిపించిన ఘనత సీఎం కేసీఆర్దేనని తెలిపారు. కొత్త రాజ్యాంగం తెచ్చినా అది అంబేడ్కర్ స్ఫూర్తితోనే ఉంటుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ