Mallu Swarajyam: తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు మల్లు స్వరాజ్యం అస్తమయం
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (92) కన్నుమూశారు. న్యుమోనియాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో మార్చి 1 నుంచి ఆమె...
అనారోగ్యంతో కొన్ని రోజులుగా ఆసుపత్రిలో
నేడు ఎంబీ భవన్కు పార్ధివ దేహం
చివరి కోరిక మేరకు వైద్య కళాశాలకు భౌతికకాయం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (92) కన్నుమూశారు. న్యుమోనియాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో మార్చి 1 నుంచి ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాస్త కోలుకోవడంతో సాధారణ గదిలోకి మార్చారు. శుక్రవారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో వైద్యులు మరోసారి ఐసీయూకు తరలించారు. అవయవాలు విఫలం కావడంతో శనివారం రాత్రి 7.37 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. స్వరాజ్యం సూర్యాపేట పాత తాలూకా కరివిరాల కొత్తగూడెంలో 500 ఎకరాల భూస్వామి భీమ్రెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు మూడో సంతానంగా 1930లో జన్మించారు. 1945-46 మధ్య జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును స్వరాజ్యం గడగడలాడించారు. దాదాపు ఎనిమిది దశాబ్దాలపాటు ప్రజా ఉద్యమాల్లో, రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన ఆమె రెండుసార్లు తుంగతుర్తి ఎమ్మెల్యేగా పనిచేశారు. సీపీఎం తరఫున 1978, 83లలో ఎన్నికయ్యారు.
1985 నాటి ఎన్నికల్లో ఆమె ఓటమి చెందారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మహిళాసభ అధ్యక్షురాలిగా పనిచేశారు. తెలంగాణ సాయుధపోరాటంలో దళ కమాండర్గా పనిచేసిన మల్లు వెంకట నర్సింహారెడ్డిని స్వరాజ్యం 1954లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు గౌతమ్రెడ్డి, నాగార్జునరెడ్డి, కుమార్తె కరుణ ఉన్నారు. కొంతకాలంగా స్వరాజ్యం నల్గొండలో చిన్న కుమారుడు నాగార్జునరెడ్డి వద్ద ఉంటున్నారు. స్వరాజ్యం పార్ధివ దేహాన్ని ఆదివారం ఉదయం ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని ఎంబీ భవన్కు తరలించనున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉదయం 10 గంటల వరకు అక్కడే ఉంచుతారు. అనంతరం నల్గొండ సీపీఎం కార్యాలయానికి తరలిస్తారు. ఆమె చివరి కోరిక మేరకు భౌతిక కాయాన్ని నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించనున్నారు.
విప్లవనారిని కోల్పోయాం
మల్లు స్వరాజ్యం మరణంతో స్ఫూర్తిదాయక విప్లవనారిని కోల్పోయాం. తన ఉపన్యాసాలతో ఎందరో మహిళలను ఆమె ఉద్యమంలో భాగస్వాములను చేశారు. ఆమె మృతికి పార్టీ తరఫున తీవ్ర సంతాపం, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నాం.
- సీతారాం ఏచూరి, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి
పలువురి నివాళి
* సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు శనివారం మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లి స్వరాజ్యంను పరామర్శించారు. అంతలోనే సాయంత్రం ఆమె మృతి చెందడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకారాట్, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ సంతాపాలు తెలిపారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు మధు, ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావులు ఆస్పత్రికి వెళ్లి ఆమె భౌతికకాయానికి అంజలి ఘటించారు.
* తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు కేటీ రామారావు, హరీశ్రావు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేర్వేరు ప్రకటనల్లో తమ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆసుపత్రికి వచ్చి స్వరాజ్యం భౌతికకాయం వద్ద నివాళి అర్పించారు.
ఆమె పోరాటం నిరుపమానం
‘తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తెలుగు మహిళాశక్తికి ప్రతిరూపమైన మల్లు స్వరాజ్యం కన్నుమూశారని తెలిసి విచారించాను. పీడిత ప్రజల పక్షాన ఆమె చేసిన పోరాటం నిరుపమానమైనది. రెండు పర్యాయాలు శాసనసభ్యురాలిగా ఆమె అందించిన సేవలు మరువలేనివి.
- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
మహిళాయోధురాలు స్వరాజ్యం
‘స్వరాజ్యం లాంటి మహిళా నేతను కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటు. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. జీవితాంతం పీడిత ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన స్వరాజ్యం జీవితం రేపటితరాలకు స్ఫూర్తిదాయకం.
- సీఎం కేసీఆర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం