Mallu Swarajyam: తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు మల్లు స్వరాజ్యం అస్తమయం
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (92) కన్నుమూశారు. న్యుమోనియాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో మార్చి 1 నుంచి ఆమె...
అనారోగ్యంతో కొన్ని రోజులుగా ఆసుపత్రిలో
నేడు ఎంబీ భవన్కు పార్ధివ దేహం
చివరి కోరిక మేరకు వైద్య కళాశాలకు భౌతికకాయం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (92) కన్నుమూశారు. న్యుమోనియాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో మార్చి 1 నుంచి ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాస్త కోలుకోవడంతో సాధారణ గదిలోకి మార్చారు. శుక్రవారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో వైద్యులు మరోసారి ఐసీయూకు తరలించారు. అవయవాలు విఫలం కావడంతో శనివారం రాత్రి 7.37 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. స్వరాజ్యం సూర్యాపేట పాత తాలూకా కరివిరాల కొత్తగూడెంలో 500 ఎకరాల భూస్వామి భీమ్రెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు మూడో సంతానంగా 1930లో జన్మించారు. 1945-46 మధ్య జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును స్వరాజ్యం గడగడలాడించారు. దాదాపు ఎనిమిది దశాబ్దాలపాటు ప్రజా ఉద్యమాల్లో, రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన ఆమె రెండుసార్లు తుంగతుర్తి ఎమ్మెల్యేగా పనిచేశారు. సీపీఎం తరఫున 1978, 83లలో ఎన్నికయ్యారు.
1985 నాటి ఎన్నికల్లో ఆమె ఓటమి చెందారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మహిళాసభ అధ్యక్షురాలిగా పనిచేశారు. తెలంగాణ సాయుధపోరాటంలో దళ కమాండర్గా పనిచేసిన మల్లు వెంకట నర్సింహారెడ్డిని స్వరాజ్యం 1954లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు గౌతమ్రెడ్డి, నాగార్జునరెడ్డి, కుమార్తె కరుణ ఉన్నారు. కొంతకాలంగా స్వరాజ్యం నల్గొండలో చిన్న కుమారుడు నాగార్జునరెడ్డి వద్ద ఉంటున్నారు. స్వరాజ్యం పార్ధివ దేహాన్ని ఆదివారం ఉదయం ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని ఎంబీ భవన్కు తరలించనున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉదయం 10 గంటల వరకు అక్కడే ఉంచుతారు. అనంతరం నల్గొండ సీపీఎం కార్యాలయానికి తరలిస్తారు. ఆమె చివరి కోరిక మేరకు భౌతిక కాయాన్ని నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించనున్నారు.
విప్లవనారిని కోల్పోయాం
మల్లు స్వరాజ్యం మరణంతో స్ఫూర్తిదాయక విప్లవనారిని కోల్పోయాం. తన ఉపన్యాసాలతో ఎందరో మహిళలను ఆమె ఉద్యమంలో భాగస్వాములను చేశారు. ఆమె మృతికి పార్టీ తరఫున తీవ్ర సంతాపం, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నాం.
- సీతారాం ఏచూరి, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి
పలువురి నివాళి
* సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు శనివారం మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లి స్వరాజ్యంను పరామర్శించారు. అంతలోనే సాయంత్రం ఆమె మృతి చెందడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకారాట్, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ సంతాపాలు తెలిపారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు మధు, ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావులు ఆస్పత్రికి వెళ్లి ఆమె భౌతికకాయానికి అంజలి ఘటించారు.
* తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు కేటీ రామారావు, హరీశ్రావు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేర్వేరు ప్రకటనల్లో తమ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆసుపత్రికి వచ్చి స్వరాజ్యం భౌతికకాయం వద్ద నివాళి అర్పించారు.
ఆమె పోరాటం నిరుపమానం
‘తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తెలుగు మహిళాశక్తికి ప్రతిరూపమైన మల్లు స్వరాజ్యం కన్నుమూశారని తెలిసి విచారించాను. పీడిత ప్రజల పక్షాన ఆమె చేసిన పోరాటం నిరుపమానమైనది. రెండు పర్యాయాలు శాసనసభ్యురాలిగా ఆమె అందించిన సేవలు మరువలేనివి.
- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
మహిళాయోధురాలు స్వరాజ్యం
‘స్వరాజ్యం లాంటి మహిళా నేతను కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటు. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. జీవితాంతం పీడిత ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన స్వరాజ్యం జీవితం రేపటితరాలకు స్ఫూర్తిదాయకం.
- సీఎం కేసీఆర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TSRTC: మహిళలకు ఉచిత ప్రయాణంపై నేడు మార్గదర్శకాలు
రాష్ట్రంలో ఈ నెల 9వతేదీ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే పథకాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. -
పగటి పూటే వణికిస్తోంది.. తుపానుతో పడిపోయిన ఉష్ణోగ్రతలు
తుపాను ప్రభావంతో రాష్ట్రంలో మధ్యాహ్న సమయంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. సాధారణం కన్నా తక్కువ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. -
TS Cabinet: కొత్త.. పాత కలయికగా మంత్రివర్గం
కాంగ్రెస్ ప్రభుత్వంలో కొలువుదీరనున్న మంత్రివర్గం కొత్త..పాత కలయికగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సహా 12 మంది ప్రమాణ స్వీకారం చేశారు. -
Free Bus Travel: రేపటి నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా ఈ నెల 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా రెండు గ్యారంటీలను అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. -
కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో కనులపండువగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్రెడ్డితో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. -
పాలకులం కాదు.. సేవకులం
‘మేం పాలకులం కాదు.. సేవకులం. ఈ రోజు నుంచి విద్యార్థి, నిరుద్యోగ, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది’ అని నూతన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. -
శాసనసభాపతిగా గడ్డం ప్రసాద్కుమార్
తెలంగాణ శాసనసభ స్పీకర్గా వికారాబాద్ కాంగ్రెస్ శాసనసభ్యుడు గడ్డం ప్రసాద్కుమార్ (59)ను కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవి ఆశావహుడిగా ఉన్న ఆయన్ను అధిష్ఠానం అనూహ్యంగా సభాపతి పదవికి ఎంపికచేసింది. -
Revanth Reddy: విద్యుత్పైనే తొలి గురి!.. ఆ శాఖ కార్యదర్శిపై సీఎం ఆగ్రహం
మంత్రివర్గ తొలి సమావేశం సందర్భంగా.. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ పనితీరుపై వాడి వేడిగా చర్చ సాగింది. విద్యుత్ రంగంలో ఏం జరిగిందో తెలుపుతూ సమగ్రంగా శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. -
సచివాలయంలో అధికార పీఠంపై..
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్రెడ్డి గురువారం సాయంత్రం సచివాలయంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. -
జనవరి 6న ముసాయిదా ఓటర్ల జాబితా
ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే జనవరి అయిదో తేదీ వరకు దేశవ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల ప్రక్షాళన వ్యవహారాలను అధికారులు చేపట్టాలని ఎన్నికల సంఘం సూచించింది. -
కళాశాలల్లో స్వల్పకాల నైపుణ్యాభివృద్ధి కోర్సులు
డిగ్రీ విద్యార్థుల్లో ప్రస్తుతం అవసరమైన నైపుణ్యాలను పెంచే దిశగా యూజీసీ ముందుకెళ్తోంది. అన్ని కళాశాలలు లేదా విశ్వవిద్యాలయాలు స్వల్పకాల నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రారంభించుకునేందుకు పచ్చజెండా ఊపింది. -
అద్దం లాంటి రోడ్డు.. అలసత్వమే అడ్డు
రూ.కోట్లతో రోడ్డు నిర్మాణం చేపట్టిన అధికారులు మధ్యలో ఉన్న విద్యుత్తు స్తంభాలను తొలగించలేదు. దీంతో అది వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. -
Jeevan Reddy: ఆర్మూర్లో జీవన్రెడ్డి మాల్కు కరెంటు కట్
ఓ షాపింగ్ మాల్ స్థలం అద్దె, విద్యుత్ బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోవడంతో సంబంధిత సంస్థలు చర్యలకు దిగాయి. -
‘అభినవ మొల్ల’ లక్ష్మీనరసమ్మ మృతి
భద్రాచలం పట్టణానికి చెందిన ప్రముఖ రచయిత్రి డా.చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ (85) గురువారం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. -
కలుషిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత
కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బోర్గాం(పి)లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. -
విద్యుత్తు ఉద్యోగ సంఘం నాయకుడిపై సస్పెన్షన్ ఎత్తివేత
తెలంగాణ విద్యుత్తు వర్కర్స్ యూనియన్(బి-2871) రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగరాజు సస్పెన్షన్ను దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ ఎత్తివేసింది. -
‘జలశక్తి’ సమావేశాన్ని వాయిదా వేయండి
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణ విషయంలో శుక్రవారం ఏపీ, తెలంగాణలతో జలశక్తి శాఖ దిల్లీలో నిర్వహించే సమావేశాన్ని వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారి కేంద్రాన్ని కోరారు. -
రాచకొండలో అత్యధికం.. ములుగులో అత్యల్పం
తెలంగాణలో 2022 సంవత్సరంలో జరిగిన నేరాల్లో ఎక్కువగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే చోటు చేసుకున్నాయి. -
డెల్టా ర్యాంకింగ్లో తిర్యాణికి తొలిస్థానం
నీతి ఆయోగ్ గురువారం ప్రకటించిన యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం డెల్టా ర్యాంకుల్లో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి బ్లాక్ తొలిస్థానాన్ని కైవసం చేసుకొంది. -
ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు రాజీనామా
వరంగల్ కేంద్రంగా విద్యుత్తు వినియోగదారులకు సేవలందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ ఎన్పీడీసీˆఎల్) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) అన్నమనేని గోపాలరావు తన పదవికి రాజీనామా చేశారు. -
మురుగు నీటి సమస్యపై నివేదిక ఇవ్వండి
హైదరాబాద్ తిలక్నగర్ పార్సీకాలనీలోని మురుగు నీటి సమస్యపై అధ్యయనంచేసి ఈ నెల 20వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని జీహెచ్హెంసీ, హైదారాబాద్ మెట్రో నీటి సరఫరా, జలమండలిని హైకోర్టు ఆదేశించింది.


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
కోత కోసేకంటే తొక్కించేయడమే నయం.. ఆవేదనలో వరి రైతులు
-
AP News: వరదలో కొట్టుకుపోయిన ఎడ్లబండి, యజమాని
-
ISRO: 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో
-
Khammam: రేవంత్ సీఎం.. ఆర్టీసీ డ్రైవర్ పాదయాత్ర
-
Murder: అతిథులకు ట్రే తగిలిందని వెయిటర్ దారుణ హత్య