దృఢ సంకల్పంతో సంస్కరణలు తెచ్చాం
దృఢమైన రాజకీయ సంకల్పంతో అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగా దేశం ఇప్పుడు ఎన్నో రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అస్థిర ప్రభుత్వాల కారణంగా గత మూడు దశాబ్దాల్లో సంస్కరణలను పట్టుదలగా అమలు చేయలేకపోయారని
2014 తర్వాత దేశంలో అనూహ్య మార్పులు
ఎన్నో రంగాల్లో భారత్ ఇప్పుడు అగ్రగామి
విద్యార్థులు వ్యక్తిగత లక్ష్యాలకు దేశ ప్రయోజనాలను జోడించాలి
ఐఎస్బీ స్నాతకోత్సవ సభలో ప్రధాని మోదీ
ఈనాడు, హైదరాబాద్: దృఢమైన రాజకీయ సంకల్పంతో అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగా దేశం ఇప్పుడు ఎన్నో రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అస్థిర ప్రభుత్వాల కారణంగా గత మూడు దశాబ్దాల్లో సంస్కరణలను పట్టుదలగా అమలు చేయలేకపోయారని ఆయన తెలిపారు. 2014 తర్వాత ఈ పరిస్థితి మారిందని, అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకువచ్చినట్లు వివరించారు. గురువారం హైదరాబాద్లో ఐఎస్బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) ద్విదశాబ్ది వేడుకలు, 2022 పీజీపీ బ్యాచ్ విద్యార్థుల స్నాతకోత్సవ సభలో ప్రధాని ప్రసంగించారు. భారత్, జీ 20 దేశాల్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశమని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు కుప్పకూలినా, భారత్ మాత్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగిపోతోందని తెలిపారు.
ఇవీ మన ఘనతలు
‘గత ఏడాదిలో రికార్డుస్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను ఆకర్షించాం, స్మార్ట్ఫోన్ డేటా వినియోగంలో ప్రపంచంలోనే మొదటి స్థానం మనది. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యలో, గ్లోబల్ రిటైల్ ఇండెక్స్లో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నాం. మూడో అతిపెద్ద అంకుర వ్యవస్థ మనదే’ అని ప్రధాన మంత్రి తెలిపారు. ‘భారత్ అంటే వ్యాపారం’ అని ప్రపంచ దేశాలన్నీ గుర్తిస్తున్నాయని వివరించారు. ‘సంస్కరణ- సాధన- మార్పు’ అనే మంత్రంతో సమర్థ పరిపాలన అందిస్తున్నట్లు తెలిపారు. ‘ఫిన్టెక్ విభాగంలో ఎటువంటి మార్పులొచ్చాయో చూస్తున్నాం. ఒకప్పుడు బ్యాంకింగ్ అనేది సామాన్యులకు అందని ద్రాక్ష. కానీ ఇప్పుడు సామాన్యుల చెంతకే బ్యాంకింగ్ లావాదేవీలు దిగివచ్చాయ’ని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం డిజిటల్ లావాదేవీలు మనదేశంలో జరుగుతున్నాయని తెలిపారు. కరోనా టీకా కోసం విదేశాల వైపు చూసే పరిస్థితి నుంచి, దేశ ప్రజలందరికీ సొంత టీకా ఇవ్వటమే కాకుండా వందకు పైగా దేశాలకు ఎగుమతి చేసిన ఘనత మన సొంతమని వివరించారు. దేశంలో వైద్య కళాశాలల సంఖ్యను 380 నుంచి 600కు పైగా పెంచినట్లు తెలిపారు.
రాబోయే 25 ఏళ్లు కీలకం
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకొంటూ, వచ్చే పాతికేళ్లలో ఏం చేయాలనే అంశంపై దృష్టి సారించినట్లు ప్రధానమంత్రి వెల్లడించారు. ఇందులో యువత భాగస్వామ్యం ముఖ్యమని, ఐఎస్బీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ నుంచి వచ్చిన మేనేజ్మెంట్ విద్యార్థుల భాగస్వామ్యం ఉండాలని సూచించారు. ఐఎస్బీ దేశానికి గర్వకారణమని, ఇరవై ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రారంభించిన ఈ సంస్థ వేలమంది మెరికల్లాంటి విద్యార్థులను దేశానికి అందించిందని అన్నారు. ఆసియాలోని అగ్రగామి విద్యాసంస్థల్లో ఒకటిగా స్థానం సంపాదించిన ఐఎస్బీ నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు, తమ వ్యక్తిగత లక్ష్యాలను దేశ ప్రయోజనాలతో జోడించాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక