Telangana News: సీఎంకు సందేశం ఇచ్చేందుకే..
తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తున్న తనను ఆపే శక్తి ఎవరికీ లేదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు. ప్రజల పక్షాన బలమైన శక్తిగా ఉంటానని.. తనకు వ్యతిరేకంగా, నిరసనగా మాట్లాడే వారిని పట్టించుకోనన్నారు.
నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు
రాజ్భవన్నే గౌరవించడం లేదు.. సామాన్యుల పరిస్థితేంటి?
సామూహిక అత్యాచారం ఘటనపై ప్రభుత్వం నివేదికే ఇవ్వలేదు
మహిళా దర్బార్లో తమిళిసై
తెలుగులో మాట్లాడిన గవర్నర్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తున్న తనను ఆపే శక్తి ఎవరికీ లేదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు. ప్రజల పక్షాన బలమైన శక్తిగా ఉంటానని.. తనకు వ్యతిరేకంగా, నిరసనగా మాట్లాడే వారిని పట్టించుకోనన్నారు. ప్రభుత్వం తనకు సరైన గౌరవ మర్యాదలు (ప్రొటోకాల్) ఇవ్వడం లేదని, అయినా తన కార్యక్రమాలు ఆపడంలేదని తెలిపారు. శుక్రవారం ఆమె రాజ్భవన్లో మహిళా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తెలుగులో మాట్లాడారు. ‘‘ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ బాధ్యత. రాష్ట్ర సర్కారు ప్రవర్తన మారాలి. రాజ్భవన్నే గౌరవించకుంటే.. సామాన్యుల పరిస్థితేంటి? రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటనపై ఇప్పటికీ ప్రభుత్వం నివేదిక ఇవ్వలేదు...సర్కారుకు బాధ్యత లేదా? రాజ్భవన్ నుంచి సీఎం కేసీఆర్కు సందేశం (మెసేజ్) ఇచ్చేందుకు ఈ దర్బార్ ద్వారా ప్రయత్నిస్తున్నా. ఆయనను కలిసి ఏడాది దాటింది. నన్ను కలవకున్నా నా సందేశం చేరితే చాలు. వీసీలపై గవర్నర్ అధికారాలు తొలగించాలా వద్దా అనేది ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నా. ప్రజా దర్బార్ నిరంతర కార్యక్రమం. మహిళా దర్బార్ వెనుక రాజకీయం లేదు. నా పరిధులు దాటడం లేదు. నా బలమైన స్వరంతో అతివల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తా. భవిష్యత్తులోనూ మహిళా దర్బార్ కొనసాగిస్తా.
రాజకీయ కార్యక్రమం కాదు
బాలికలు, మహిళలపై జరుగుతున్న అన్యాయాలను చూస్తే నా గుండె రగిలిపోతోంది. తెలంగాణ మహిళలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నా. మహిళల బాధలను తీర్చాల్సింది ప్రభుత్వమే అని.. రాజ్భవన్లో ఇలాంటి కార్యక్రమమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ.. రాజ్భవన్ కూడా ప్రభుత్వ కార్యాలయమే. నేను మహిళలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని భావిస్తున్నా. ప్రజలను గవర్నర్ కలుస్తారా అని చాలా మందికి అనుమానాలున్నాయి. కరోనా సమయంలోనూ భద్రత సిబ్బంది వద్దన్నా నేను ధైర్యంగా వెళ్లి రోగులను పరామర్శించా. నా వంతు సాయం చేశా. సమాజంలో మహిళలు ఎక్కువగా వేధింపులకు గురవుతున్నారు. ఇంట్లో, పనిచేసే చోట, పాఠశాలల్లో, కాలేజీల్లో, రోడ్లపైన ఇలా ప్రతిచోటా ఆడపిల్లలకు ఇబ్బందులు తప్పడం లేదు. చాలా మంది ఇంట్లో చెప్పుకోలేక.. వేధింపులు తట్టుకోలేక కుమిలిపోతున్నారు. కొన్నిసార్లు మనోవేదనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇదంతా ఆపడానికి.. నేనున్నానని చెప్పడానికే ఈ మహిళా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేశా. 24 గంటల క్రితమే నిర్ణయం తీసుకున్నా. మంచి స్పందన వచ్చింది.
నిర్భయంగా కలవొచ్చు
ఎవరైనా నన్ను నిర్భయంగా కలిసి వారి సమస్యలు చెప్పొచ్చు. రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కుల మేరకే నడుచుకుంటున్నా. రాజ్భవన్లో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు చేపట్టడం లేదు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని నేను గౌరవిస్తున్నా. నా వద్దకు వచ్చిన ప్రతి ఫిర్యాదును పర్యవేక్షిస్తా. వీటిపై ప్రభుత్వ శాఖలు, అధికారులు వెంటనే స్పందించాలి’’ అని తెలిపారు.
అయిదు వందలకు పైగా వినతులు
మహిళా దర్బార్లో భాగంగా 500కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. వీరిలో కొంతమంది నేరుగా గవర్నర్కు వినతిపత్రాలు ఇచ్చారు. ఫిర్యాదులన్నింటినీ పరిష్కరిస్తామని తమిళిసై హామీ ఇచ్చారు. వ్యక్తిగత సమస్యలు, భూ, ఆస్తి తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. మహిళాదర్బార్ ఏర్పాటుపై పలువురు వనితలు గవర్నర్ను అభినందించారు. మహిళా వీఆర్ఏలు కూడా తమ సమస్యలు పరిష్కరించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..