గందరగోళంగా జేఈఈ మెయిన్
జేఈఈ మెయిన్ నిర్వహణ గందరగోళంగా మారింది. గురువారం బీఆర్క్ పేపర్-2 పరీక్ష మేడ్చల్లోని ఓ కేంద్రంలో సాంకేతిక సమస్యలతో ఆలస్యంగా మొదలవగా, శుక్రవారం హైదరాబాద్లో
సర్వర్ సమస్యతో నాలుగు కేంద్రాల్లో ఆలస్యంగా ప్రారంభం
‘అబిడ్స్ ఆరోరా’ కేంద్రంలో మధ్యాహ్నం పరీక్ష వాయిదా
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన.. కన్నీటిపర్యంతం
ఈనాడు, హైదరాబాద్, మలక్పేట, సుల్తాన్బజార్, న్యూస్టుడే: జేఈఈ మెయిన్ నిర్వహణ గందరగోళంగా మారింది. గురువారం బీఆర్క్ పేపర్-2 పరీక్ష మేడ్చల్లోని ఓ కేంద్రంలో సాంకేతిక సమస్యలతో ఆలస్యంగా మొదలవగా, శుక్రవారం హైదరాబాద్లో రెండుచోట్ల, కరీంనగర్లో రెండుచోట్ల గంటల తరబడి ఆలస్యమయ్యాయి. సాంకేతిక సమస్యలతో అందులోని ఓ కేంద్రంలో మధ్యాహ్నం పరీక్ష వాయిదా వేశారు.
సర్వర్ సమస్యతో పరీక్ష వాయిదా
జేఈఈ మెయిన్ పేపర్-1కు హైదరాబాద్లో దాదాపు 15 వరకు కేంద్రాలను ఏర్పాటుచేశారు. అబిడ్స్ అరోరా ఇంజినీరింగ్ కళాశాల కేంద్రంలో ఉదయం 9 గంటలకు జరగాల్సిన పరీక్ష సర్వర్ సమస్యతో ఆలస్యంగా 10.30 గంటలకు మొదలైంది. మధ్యాహ్నం పరీక్ష సమయంలోనూ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఎంతకీ పరిష్కారం కాలేదు. దీంతో ఆ పరీక్షను వాయిదా వేయాలని ఎన్టీఏ నిర్ణయించిందంటూ కేంద్రం వద్ద నిర్వాహకులు నోటీసు అంటించారు. తమకు ఆలస్యంగా పరీక్ష మొదలైనా 3 గంటల సమయం ఇవ్వకుండానే కంప్యూటర్ ఆగిపోయిందని ఈ కేంద్రంలో ఉదయం పరీక్ష రాసిన ఈసీఐఎల్కు చెందిన ఓ విద్యార్థి ‘ఈనాడు’కు తెలిపాడు. ఈ నేపథ్యంలో అసహనానికి గురైన విద్యార్థులు లోపల ఆందోళనకు దిగినట్టు సమాచారం.
మూడు గంటల ఆలస్యంగా అనుమతి
మూసారాంబాగ్లోని అరోరా కళాశాలలో ఉదయం పరీక్షను సర్వర్ సమస్యతో కొందరికి మధ్యాహ్నం నిర్వహించారు. ఇది తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు గేటు ముందు నిరసనలకు దిగారు. ‘‘ఉదయం 7.30-8 గంటల మధ్య విద్యార్థులను కేంద్రం లోపలికి వదిలారు. సర్వర్ సమస్యలంటూ ఆరణలోనే 3 గంటలపాటు నిలిపివేశారు. సుమారు 12.35 గంటల సమయంలో అనుమతించారు’ అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. భోజనం కూడా చేయకుండా లోపలికి వెళ్లిన పిల్లలు పరీక్ష ఎలా రాయగలరని వాపోయారు. జరిగిన పరిణామాలతో విద్యార్థులూ కన్నీటిపర్యంతమయ్యారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని రెండు కేంద్రాల్లోనూ పరీక్ష ఆలస్యంగా మొదలైంది. ‘ఆన్లైన్ పరీక్షలు కావడంతో వాటి నిర్వహణను జాతీయ పరీక్షల మండలి(ఎన్టీఏ) అధికారులు గత కొన్నేళ్లుగా టీసీఎస్ సంస్థకు అప్పగిస్తున్నారు. ఆ సంస్థకు ఈసారి పూర్తి నిర్వహణ బాధ్యతలు ఇవ్వలేదని, ఎన్టీఏనే నిర్వహణను పర్యవేక్షిస్తోందని సమాచారం. ఆ సంస్థకు అనుభవం లేకపోవడంతో సాంకేతిక అంశాలను అన్ని కోణాల్లో పరిశీలించలేదని, అందుకే ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయని’ నిపుణులు విశ్లేషించారు.
గణితం ప్రశ్నలకు అధిక సమయం
తొలిరోజు ఉదయం, మధ్యాహ్నం పరీక్షల్లో గణితం ప్రశ్నలను ఎక్కువ సమయం తీసుకునేలా రూపొందించారని నిపుణులు విశ్లేషించారు. భౌతికశాస్త్రం ప్రశ్నలు మధ్యస్తంగా, రసాయనశాస్త్రానికి సులభంగా ఉన్నాయని తెలిపారు. రసాయనశాస్త్రంలో కొన్ని జ్ఞాపకశక్తి ఆధారిత ప్రశ్నలు ఇచ్చారని జేఈఈ నిపుణుడు, శ్రీచైతన్య ఐఐటీ జాతీయ డీన్ ఎం.ఉమాశంకర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత