ఔరా... అనేల
తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ భూముల క్రయవిక్రయాలకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్ సహా చుట్టుపక్కల జిల్లాల్లో పెద్ద సంఖ్యలో అమ్మకాలు జరుగుతున్నాయి. ఆరేళ్ల క్రితంతో పోలిస్తే
రాష్ట్రంలో వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో జోరు
2021-22లో ఆరు లక్షలకుపైగా లావాదేవీలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ భూముల క్రయవిక్రయాలకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్ సహా చుట్టుపక్కల జిల్లాల్లో పెద్ద సంఖ్యలో అమ్మకాలు జరుగుతున్నాయి. ఆరేళ్ల క్రితంతో పోలిస్తే అమ్మకాల్లో రెండున్నర రెట్ల వృద్ధి నమోదవగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో ఆరు లక్షలకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. భూమి నమ్మకమైన పెట్టుబడిగా మారడం, రాబడులు ఆశాజనకంగా ఉండటమే దీనికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
స్థిరాస్తి రంగంలో జోరు కొనసాగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల కనీస ధర ఎకరం రూ.10 లక్షల దాకా ఉండగా, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో రూ. కోట్లలోనే పలుకుతున్నాయి. హైదరాబాద్తో ముడిపడిన రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఎకరా రూ.20 కోట్ల నుంచి రూ.50 కోట్లదాకా పలుకుతోంది. అయినా కొనేందుకు కొనుగోలుదారులు ముందుకొస్తుండటం, మంచి ధర లభిస్తుండటంతో అమ్మేందుకూ రైతులు సిద్ధమవుతున్నారు. కరోనా ప్రభావం నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు మందగించినప్పటికీ, ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా సుమారు మూడు రెట్లు పెరగడం గమనార్హం.
ఫాం లాండ్స్ సంస్కృతితో
ఇటీవల కాలంలో ఖాళీ స్థలాలతోపాటు, ఫాంలాండ్స్ (వ్యవసాయ భూములు), ఫాంహౌస్ల సంస్కృతి పెరిగింది. ధనవంతులు, ఉన్నతోద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు వంటి వారు ఆర్థిక స్తోమతను బట్టి నగర శివార్లలో ఎకరా, అర ఎకరా చొప్పున కొనుగోలుచేసి ఫాంహౌస్లు నిర్మించుకుంటున్నారు. భూముల అమ్మకాల్లో జోరుకు ఇది కూడా కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ‘‘ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లోని రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మహబూబ్నగర్, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో ఈ తరహా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్కు 70 కిలోమీటర్ల దూరంలోని సదాశివపేట, 130 కిలోమీటర్లు దూరంలో కర్ణాటక సరిహద్దుల్లోని నారాయణ్ఖేడ్ వంటి ప్రాంతాల్లో ఫాంలాండ్స్ పేరిట వ్యవసాయ భూముల్ని పావు ఎకరం, అర ఎకరం చొప్పున విక్రయిస్తున్నారని’ ఉదహరిస్తున్నారు.
రాబడికి భరోసా..
మారిన పరిస్థితుల దృష్ట్యా మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి పెట్టుబడిగా భూములను ఎంచుకోవడం కూడా అమ్మకాలు పెరగడానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘‘బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో దాచుకోవడం, బంగారం కొనుగోలు, వడ్డీ వ్యాపారాల కంటే భూములపై రాబడి అధికంగా ఉంటోంది. దీంతో వేలమంది దీన్ని నమ్మకమైన పెట్టుబడిగా భావిస్తూ ఇళ్ల స్థలాలు, భూముల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో సాగునీటి లభ్యత పెరగడంతో కాస్త స్తోమత ఉన్న రైతులు వ్యవసాయ భూముల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. బయటి ప్రాంతాల రైతులూ ఇక్కడ సాగుభూముల కొనుగోళ్లు జరుపుతున్నారు. క్రయవిక్రయాల్లో వృద్ధి కొనసాగడానికి ఇవన్నీ దోహదం చేస్తున్నాయి’అని నిపుణులు పేర్కొంటున్నారు.
భూముల విక్రయాల్లో రంగారెడ్డి టాప్... తర్వాత సంగారెడ్డి
గత ఏడాది వ్యవసాయ భూముల అమ్మకాలను విశ్లేషిస్తే అత్యధికం రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. తర్వాత స్థానంలో సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, నల్గొండ, మెదక్ జిల్లాలు ఉన్నాయి. హెచ్ఎండీఏకు అనుబంధంగా ఉన్న భువనగిరి, మహబూబ్నగర్ జిల్లాలతోపాటు నాగర్కర్నూల్, కామారెడ్డి లాంటి కీలక జిల్లాల్లో ఎక్కువగా ఉంటున్నాయి.
హైదరాబాద్కు వంద కిలోమీటర్ల పరిధిలో..
హైదరాబాద్ చుట్టుపక్కల వంద కిలోమీటర్ల పరిధిలో స్థిరపడేందుకు ఔత్సాహికులు ఆసక్తి చూపుతుండటంతో.. స్థిరాస్తి వ్యాపారులు ఆయా ప్రాంతాల్లో భూముల కొనుగోలుకు ఆసక్తిచూపుతున్నారు. కొందరు ప్రస్తుత అవసరాలకోసం కొనుగోళ్లు జరుపుతుండగా, కొందరు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొంటున్నారు. ప్రధానంగా హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిలో షాద్నగర్, జడ్చర్ల వరకూ, ముంబయి జాతీయ రహదారిలో సంగారెడ్డి, సదాశివపేట వరకు, వరంగల్ జాతీయ రహదారిలో భువనగిరి, యాదగిరిగుట్ట వరకు, చేవెళ్ల రోడ్డులో వికారాబాద్ వరకు, రాజీవ్ రహదారిలో సిద్దిపేట వరకు కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అవుటర్ రింగ్రోడ్డుతోపాటు.. రీజినల్ రింగ్ రోడ్డు అందుబాటులోకి రానుండటంతో ఆ పరిసరాల్లోనూ క్రయవిక్రయాలు జోరందుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
నాలుగో రోజూ 46 డిగ్రీలపైనే..
రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. శుక్రవారం 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. -
రిజిస్ట్రార్ కోర్టు ముందు లిస్ట్ కావాల్సిన కేసు ఇక్కడికెలా వచ్చింది?
ప్రస్తుతం తెలంగాణలో విచారణ జరుగుతున్న ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ భారాస నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జులైకి వాయిదా వేసింది. -
దోస్త్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. -
‘టానిక్’కు మినహాయింపుల్లోనే మతలబు!
రాష్ట్రంలో ఎలైట్ వైన్షాప్ ‘టానిక్’ ఏర్పాటు సమయంలో ఇచ్చిన వెసులుబాట్లలోనే మతలబు ఉన్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ధారణకు వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
ఆరు రోజులుగా నక్కి.. ఎరకు చిక్కి
శంషాబాద్ విమానాశ్రయ రన్వే మైదానంలోకి గత నెల 27న చొరబడి అందరినీ కంగారుకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. -
వామనరావు దంపతుల హత్య కేసు.. సీబీఐకి అప్పగించేందుకు సిద్ధం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని హైవేలో 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాదులు గట్టు వామనరావు దంపతుల హత్యకేసు దర్యాప్తును సీబీఐ లేదా సీఐడీకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
కోర్టులో నేరుగా హాజరుపరచాలని కవిత దరఖాస్తు
ప్రస్తుతం దిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు ముందు విచారణ జరిగే సమయంలో తనను నేరుగా హాజరుపరచాలంటూ భారాస ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు దాఖలుచేశారు. -
సులభతర వాణిజ్య విధానంలో మరిన్ని సంస్కరణలు
సులభతర వాణిజ్య విధానం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-ఈఓడీబీ)లో అత్యుత్తమ సేవలు కొనసాగించాలని, ఇందుకోసం మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఆదేశించారు. -
నిబంధనలు ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై చర్యలు
తెలంగాణలో నిబంధనలను ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై విద్యాశాఖ కొరడా ఝుళిపించింది. ఇంటర్ విద్యామండలి ఆదేశాలను విస్మరించి వేసవి సెలవుల్లో కళాశాలలను నిర్వహించడం, ప్రవేశాలు కల్పించినందుకుగాను ఒక్కో కళాశాలపై రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వం కోరితే.. పదోన్నతులకు టెట్ మినహాయింపునిస్తాం
తెలంగాణలో 2010 కన్నా ముందు నియమితులై 1 నుంచి 5 తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే వెంటనే ఉత్తర్వులిస్తామని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఛైర్మన్ యోగేశ్ సింగ్ తెలిపారు. -
టెట్ పరీక్షల షెడ్యూలు విడుదల
ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024 షెడ్యూలును విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. -
6న ఈసెట్
టీఎస్ ఈసెట్-2024 ప్రవేశ పరీక్ష మే 6వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. -
ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు
ఎండల తీవ్రత దృష్ట్యా జాతీయ ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు. -
ఆర్టీసీ రిజర్వేషన్ ఛార్జీలపై మినహాయింపు
దూరప్రాంత బస్ సర్వీసుల్లో రిజర్వేషన్ ఛార్జీలపై టీఎస్ఆర్టీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. -
40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ.32 వేలు, గరిష్ఠంగా రూ.2,95,460 ఉండాలని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర గెజిటెడ్ అధికారుల (టీజీవోల) సంఘం కోరింది. -
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో ముఖ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు ముగిసిన దశలో కీలక మలుపు తిరిగింది. -
హెచ్సీయూ వీసీ, నేతలపై నమోదైన కేసులో ఆధారాల్లేవు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
రష్యా వాంటెడ్ లిస్ట్లో జెలెన్స్కీ..!
-
దంచికొట్టిన డుప్లెసిస్, కోహ్లీ.. గుజరాత్పై బెంగళూరు విజయం
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM