టీఆర్‌ఎస్వీ నాయకుల అరెస్టు

అగ్నిపథ్‌ ఆందోళనకారులను బేషరతుగా విడుదల చేయాలని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. భాజపా సభ ముట్టడికి ఆదివారం ఆర్ట్స్‌ కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరిన టీఆర్‌ఎస్వీ నాయకులను ఓయూ పోలీసులు

Published : 04 Jul 2022 06:17 IST

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: అగ్నిపథ్‌ ఆందోళనకారులను బేషరతుగా విడుదల చేయాలని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. భాజపా సభ ముట్టడికి ఆదివారం ఆర్ట్స్‌ కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరిన టీఆర్‌ఎస్వీ నాయకులను ఓయూ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం, భాజపాకు వ్యతిరేకంగా విద్యార్థి నేతలు నినాదాలు చేశారు. గెల్లు శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. అగ్నిపథ్‌ రద్దు చేసే వరకూ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

* మోదీ సభ నేపథ్యంలో ఓయూ ఐకాస నాయకులను ఉస్మానియా వర్సిటీ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని