Vice President Election: ఉప రాష్ట్రపతిగా ధన్ఖడ్
దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్ ఘన విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాపై ఆయన 346 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారి, లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్కుమార్
చెల్లుబాటైన ఓట్లలో 74.36% ఆయన ఖాతాలోకి
ఆళ్వాపై 346 ఓట్ల తేడాతో గెలుపు
11న ప్రమాణ స్వీకారం
ఈనాడు - దిల్లీ
దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్ ఘన విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాపై ఆయన 346 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారి, లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్కుమార్ సింగ్ శనివారం రాత్రి ప్రకటించారు. రాజస్థాన్కు చెందిన ధన్ఖడ్కు న్యాయవాదిగా, చట్టసభల సభ్యునిగా, గవర్నర్గా సుదీర్ఘ అనుభవం ఉంది. ఈనెల 11న బాధ్యతలు చేపట్టనున్న ఆయన.. 12వ తేదీన ఒక్కరోజు సభను నడిపించే అవకాశం ఉంది. తర్వాత కొత్త పార్లమెంటు భవనంలో ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల నుంచి పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్లో 725 మంది ఎంపీలు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఉభయసభల్లో అర్హులైన ఓటర్లు ప్రస్తుతం 780 మంది ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 34 మంది పార్టీ నిర్ణయాన్ని అనుసరించి ఓటింగుకు గైర్హాజరయ్యారు. ఆ పార్టీలో ఉంటూ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న శిశిర్ కుమార్ అధికారి, దివ్యేందు అధికారి మాత్రం ఓటింగ్లో పాల్గొన్నారు. వీరిని మినహాయిస్తే నికరంగా 21 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. మొత్తం 55 మంది ఎంపీలు ఓటు వేయలేదు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, వివిధ పార్టీల ఎంపీలు ఓట్లు వేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చక్రాల కుర్చీలో వచ్చి ఓటు వేశారు. కొవిడ్బారిన పడ్డ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వి పీపీఈ కిట్లో వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనారోగ్య కారణాల వల్ల భాజపా ఎంపీలు సన్నీ దేఓల్, సంజయ్ ధోత్రే ఓటు వేయలేదు. పోలైన 725 ఓట్లలో 15 చెల్లలేదు. మిగిలిన 710 ఓట్లలో విజేతకు 356 ఓట్లు కావాల్సి ఉండగా ధన్ఖడ్కు 528, మార్గరెట్ ఆళ్వాకు 182 వచ్చాయి. పోలైన ఓట్లలో 72.82%, చెల్లుబాటైన ఓట్లలో 74.36% ధన్ఖడ్కు దక్కాయి. 2017లో అధికార కూటమి అభ్యర్థి ఎం.వెంకయ్యనాయుడు (516) కంటే ఈసారి ధన్ఖడ్కు అధిక ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాకు గత ఎన్నికల్లో పోటీచేసిన గోపాలకృష్ణగాంధీ (244) కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.
వెంకయ్యనాయుడి స్థానంలోకి..
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వెంకయ్యనాయుడు స్థానంలోకి వస్తున్న కొత్త ఉపరాష్ట్రపతిపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ పదవిలోకి వచ్చేవారు రాజ్యసభ ఛైర్మన్గా పెద్దల సభను నిర్వహించడం కత్తిమీద సాము. వారి పనితీరుకు అదే కొలమానంగా నిలుస్తుంది. వెంకయ్యనాయుడు ఆ బాధ్యతలను అత్యంత ఓర్పు, నేర్పులతో నిర్వహించి.. అధికార, ప్రతిపక్షాలను ఆకట్టుకున్నారు. ధన్ఖడ్ వ్యవహారశైలి ఎలా ఉంటుంది? ప్రతిపక్షాలపట్ల ఎలా స్పందిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.
సాధారణ రైతు నుంచి అంచెలంచెలుగా
ఓబీసీ జాట్ సామాజిక వర్గానికి చెందిన ధన్ఖడ్ సాధారణ రైతు కుటుంబం నుంచి అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. రాజస్థాన్ ఝుంఝునూ జిల్లాకు చెందిన ఈయన గ్రామస్థాయి పాఠశాలలో, తర్వాత సైనిక్ స్కూల్లో చదువుకున్నారు. రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్రంలో డిగ్రీచేశారు. తర్వాత న్యాయశాస్త్రం అభ్యసించి తమ కుటుంబంలో తొలితరం న్యాయవాదిగా నిలిచారు. అత్యంత తక్కువ సమయంలోనే రాజస్థాన్ హైకోర్టులో బలమైన న్యాయవాదిగా నిలదొక్కుకున్నారు. సుప్రీంకోర్టులోనూ న్యాయవాదిగా వాసికెక్కారు. 1989లో తొలిసారి ఝున్ఝునూ నుంచి లోక్సభకు పోటీచేసి గెలుపొందారు. 1990-1991 మధ్య స్వల్పకాలం పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 93-98 మధ్య రాజస్థాన్ (కిషన్గఢ్) శాసనసభ సభ్యుడిగా ఉన్నారు. 1998 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ న్యాయవాద వృత్తిలో కొనసాగారు. 2019లో అనూహ్యంగా కేంద్రం ఆయన్ని పశ్చిమబెంగాల్ గవర్నర్గా నియమించింది.
రెండు సభల అధిపతులూ రాజస్థాన్వారే
ధన్ఖడ్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడంతో పార్లమెంటు ఉభయ సభలకు నేతృత్వం వహించే అధిపతులు రాజస్థాన్వారే అయ్యారు. లోక్సభ స్పీకర్ ఓంబిర్లా రాజస్థాన్లోని కోటాకు చెందినవారు. భైరాన్సింగ్ షెకావత్ తర్వాత రాజస్థాన్కు చెందిన రెండో వ్యక్తి ఉపరాష్ట్రపతి అవుతున్నారు. అందుకే ధన్ఖడ్ స్వస్థలం సహా ఆ రాష్ట్రమంతటా సంబరాలు మొదలయ్యాయి.
ప్రముఖుల శుభాకాంక్షలు
ధన్ఖడ్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన్ని అభినందిస్తూ.. ధన్ఖడ్కు ఉన్న సుదీర్ఘ అనుభవం, అపార అవగాహన మన దేశానికి ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు ధన్కడ్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ ఓ రైతుబిడ్డ ఈ స్థాయికి ఎదగడం దేశానికి గర్వకారణమని మోదీ అన్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, మార్గరెట్ ఆళ్వా, వివిధ పార్టీల అగ్రనేతలు శరద్ పవార్, ఎం.కె.స్టాలిన్ తదితరులు విజేతను అభినందించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటం కొనసాగుతుందని ఆళ్వా చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!