మువ్వన్నెల్లో మురిసిన కొండారెడ్డి బురుజు!

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌, హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా కర్నూలులోని కొండారెడ్డి బురుజు వారం రోజులుగా త్రివర్ణ వెలుగుల్లో జిగేల్‌మంటోంది. బురుజు ముందు భాగంలో భారీ జాతీయ జెండా కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 12 Aug 2022 06:43 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌, హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా కర్నూలులోని కొండారెడ్డి బురుజు వారం రోజులుగా త్రివర్ణ వెలుగుల్లో జిగేల్‌మంటోంది. బురుజు ముందు భాగంలో భారీ జాతీయ జెండా కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం కృష్ణానగర్‌లోని సర్వేపల్లి విద్యానిలయం పాఠశాల విద్యార్థులు భారీ జాతీయ పతాకంతో నగరంలో ప్రదర్శన నిర్వహించారు. కృష్ణానగర్‌ నుంచి కొండారెడ్డి బురుజు వరకు ర్యాలీ తీశారు. 500మీటర్ల జెండాతో కొండారెడ్డి బురుజును చుట్టేశారు!

- ఈనాడు, కర్నూలు


తిరంగా.. విశాఖ మురవంగా!

విశాఖ నగరంలోని బీచ్‌రోడ్డులో హెచ్‌.పి.సి.ఎల్‌., సి.ఐ.ఎస్‌.ఎఫ్‌. ఆధ్వర్యంలో గురువారం 1240 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

  - న్యూస్‌టుడే, పెదవాల్తేరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని