పంట ఒక్కటే ఆదాయం పెంచదు
‘‘సన్న, చిన్నకారు రైతులకున్న భూమి విస్తీర్ణం చాలా తక్కువ. వారు పంటతో పాటు పాడి, కోళ్ల పెంపకం, ఇతర వ్యాపకాలు చేపడితేనే ఆదాయం పెరుగుతుంది.
పాడి, కోళ్ల పెంపకం, ఇతర వ్యాపకాలతోనే రైతులకు మేలు
తెలుగు రాష్ట్రాల్లో విత్తనోత్పత్తిని ప్రోత్సహించాలి
‘ఈనాడు’తో నీతిఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేశ్చంద్
ఈనాడు, హైదరాబాద్: ‘‘సన్న, చిన్నకారు రైతులకున్న భూమి విస్తీర్ణం చాలా తక్కువ. వారు పంటతో పాటు పాడి, కోళ్ల పెంపకం, ఇతర వ్యాపకాలు చేపడితేనే ఆదాయం పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో విత్తన పంటలను ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయం పెంచవచ్చు’’ అని నీతిఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేశ్చంద్ చెప్పారు. శనివారం హైదరాబాద్ వచ్చిన ఆయన ‘ఈనాడు’ ఇంటర్వ్యూలో వ్యవసాయంలో ఆదాయం పెరగకపోవడానికి కారణాలు, పెంచే మార్గాలు తదితరాలను వివరించారు.
* రైతుల ఆదాయాన్ని 2022 డిసెంబరు నాటికి రెట్టింపు చేస్తామని కేంద్రం చెప్పింది. ఆ లక్ష్యం నెరవేరిందని భావిస్తున్నారా?
దేశమంతా రైతులందరి ఆదాయం రెట్టింపు కాలేదేమో. కానీ మధ్యప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాల్లో మెరుగైంది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం అని కేంద్రం చెప్పిన కార్యక్రమాన్ని అభివృద్ధి పథకం మాదిరిగా చూడకూడదు. దానిని ఒక లక్ష్యంగా పెట్టుకుని .. సాధించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాలని కేంద్రం చెప్పింది. ఉదాహరణకు మార్కెట్ సంస్కరణలు, ఆన్లైన్లో పంటల విక్రయాలకు జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెట్ ఏర్పాటు, పంటల ఉత్పాదకత పెంచేందుకు కొత్త వంగడాల విడుదల...ఇలా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ రైతుల ఆదాయాన్ని పెంచేవే.
* సన్న, చిన్నకారు రైతుల ఆదాయం ఏ రాష్ట్రంలోనూ పెరగడం లేదు ఎందుకు?
సన్న, చిన్నకారు రైతుల ఆదాయం అసలు పెరగడం లేదంటే అంగీకరించను. అనుకున్న స్థాయిలో పెరగడం లేదంటే అంగీకరిస్తాను. వారి ఆదాయం ఎంత పెరగాలి? అంత పెరగడానికి ఉన్న అవకాశాలు ఎన్ని? అనేది కూడా చూడాలి. మనదేశంలో సన్నకారు రైతులకున్న భూమి విస్తీర్ణం చాలా తక్కువ. దానిలో ఏ పంట సాగుచేసినా ఆదాయం ఎంతొస్తుంది? ఎంత పెరుగుతుందనేది శాస్త్రీయ కోణంలో చూడాలి. పంటల సాగుతో పాటు పాడి, కూరగాయల పెంపకం...ఇలా ఇతర వ్యాపకాలు పెట్టుకుని మిశ్రమ సేద్యం చేస్తే రైతుల ఆదాయం పెరుగుతుంది.
* తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయాభివృద్ధి తీరు ఎలా ఉంది?
దేశంలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతున్న మొదటి అయిదు రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. అగ్రస్థానానికి రావడానికి తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కృషి జరగాలి. పంటల మార్పిడి విధానం పాటించేలా రైతులను ప్రోత్సహించాలి. ఈ రాష్ట్రాల్లో విత్తన పంటల సాగు, విత్తనోత్పత్తి ఎక్కువగా ఉంది. దేశంలో నాణ్యమైన విత్తనాలకు డిమాండు అధికంగా ఉన్నందున విత్తనోత్పత్తిని రైతులకు ఆదాయ వనరుగా మార్చాలి.
* తెలంగాణలో రైతుబంధు పథకం కింద రైతులకు నేరుగా ఆర్థికసాయం చేసే విధానం ఎలా ఉంది?
సన్న, చిన్నకారు రైతులకు సాయం చేయాలి. నాకు తెలంగాణలో ఒక ఐఏఎస్ అధికారి స్నేహితుడు ఉన్నారు. అతనికి కూడా ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున రైతుబంధు ఇస్తున్నారని చెప్పారు. అలాంటి ధనవంతులకు, పంటలు సాగుచేయని వారికి ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఏటా ఎందుకు డబ్బు ఇవ్వాలి? పంటలు సాగుచేసే రైతులకు మాత్రమే కొన్ని నిబంధనలు పెట్టి సొమ్ము ఇస్తే బాగుంటుంది.
* వ్యవసాయ పరిశోధన సంస్థలు, రైతులకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చటానికి ఏం చేయాలి?
పరిశోధన ఫలాలు రైతులకు చేరాలంటే గ్రామస్థాయిలో వ్యవసాయ విస్తరణ బలంగా ఉండాలి. కొత్త పరిజ్ఞానాన్ని రైతులకు చెప్పే వ్యవస్థలుండాలి. కానీ చాలా రాష్ట్రాల్లో వ్యవసాయ విస్తరణ బడ్జెట్ కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నందున ఈ వ్యవస్థ బలహీనంగా ఉంది. ఈ నేపథ్యంలో అంకుర సంస్థలు, డిజిటల్ పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున వినియోగించుకోవాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ముందున్నాయి. వాటిని రైతులకు చేర్చాలి.
* మన సంప్రదాయ నూనెగింజల పంటలు వదిలేసి ఆయిల్పాం సాగును ప్రోత్సహించడం సరైన విధానమేనా?
మనదేశంలో కొన్ని దశాబ్దాలుగా నూనెగింజల ఉత్పాదకత పెరగడం లేదు. 20 ఎకరాల్లో వేరుసెనగ సాగుచేస్తే ఆ పంట నుంచి వచ్చే వంటనూనె పరిమాణంలో పామాయిల్ను ఎకరా విస్తీర్ణంలో ఆయిల్పాం పంట నుంచి ఉత్పత్తి చేయవచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లోనే ఆయిల్పాం సాగు విస్తీర్ణం పెంచాలని కేంద్రానికి నేను గతంలో సూచించాను. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో ఇది పెరుగుతోంది. సంప్రదాయ నూనెలే కావాలనడం కూడా సరికాదు. ప్రజలు వినియోగిస్తున్న వంటనూనెల పరిమాణంలో 30 శాతానికి పైగా పామాయిలే. దానిని విదేశాల నుంచి పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటున్నాం. అందుకు రూ.వేల కోట్లు వెచ్చించే బదులు ఆయిల్పాం పంటను ఇక్కడే పండిస్తే ఆ సొమ్ము మనరైతులకే అందుతుంది.
* మద్దతు ధర నిర్ణయించడానికి ఒక పంట ఖర్చును దేశమంతా సగటున ఎలా లెక్కిస్తారు ? దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు కదా?
నిపుణులైన వారు సభ్యులుగా ఉన్న వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్ మద్దతు ధర నిర్ణయిస్తుంది. ఇందుకోసం దేశమంతా సాగువ్యయం లెక్కలను శాస్త్రీయంగా సేకరించి, క్రోడీకరించి ఒక అంచనాకు వస్తుంది. ఒకదేశంలో ఒక పంటకు వేర్వేరు మద్దతు ధరలు ప్రకటించడం సాధ్యం కాదు. జాతీయ సగటు మాత్రమే తీసుకుని ఒక పంటకు ఒక మద్దతు ధర మాత్రమే నిర్ణయించగలం. రాష్ట్రాల్లో వాతావరణం, భూముల ఆధారంగా ఖర్చు తక్కువగా ఉండే విభిన్న పంటలు పండిస్తే మద్దతు ధర సరిపోతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
యూటీఎస్ యాప్ పరిధి పెంపు
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు. -
ఏఈ పోస్టుల జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీజీపీ రవిగుప్తాకు పరిహారం చెల్లించండి
పనిచేయని రిక్లైనర్ సీటును కేటాయించి తీవ్ర అసౌకర్యం కలిగించడం, బిజినెస్(జెడ్) క్లాస్ టికెట్లో ఎకానమీ క్లాస్ సేవలందించిన నేపథ్యంలో డీజీపీ దంపతులకు రూ.2,07,500 పరిహారం చెల్లించాలని సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 ఆదేశించింది. -
విద్యుత్ సరఫరాపై చర్చకు సిద్ధం
విద్యుత్ రంగంపై మాజీ సీఎం కేసీఆర్ అవాస్తవ ప్రకటనలు చేస్తూ లోక్సభ ఎన్నికల ముందు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. -
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు.