Roads Repair: రోడ్లపై గుంతలను ఇక ‘చాప’చుట్టేయొచ్చు!
అమెరికా రోడ్ప్యాచ్.. రహదారుల మరమ్మతుల్లో ఇదో నూతన ఆవిష్కారం.
రహదారుల మరమ్మతుల్లో విప్లవం అమెరికా రోడ్ప్యాచ్..
ఈనాడు, హైదరాబాద్: అమెరికా రోడ్ప్యాచ్.. రహదారుల మరమ్మతుల్లో ఇదో నూతన ఆవిష్కారం. అమెరికాతో పాటు ఐరోపా దేశాల్లో ఉపయోగిస్తున్న ఈ సాంకేతికతను మన దేశంలోనూ వినియోగించేందుకు సాధ్యాసాధ్యాలపై హైదరాబాద్లోని ‘నేషనల్్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)’ పరిశీలిస్తోంది. రోడ్ల మరమ్మతుల్లో ఇదో విప్లవంగా ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో మరింత ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పాతకాలపు ఇళ్లపై వేసిన పెంకుల మధ్య ఖాళీల నుంచి వర్షపునీరు కారకుండా తారుతో తయారుచేసిన ఓ విధమైన పట్టాను కప్పేవారు. అదేతీరులో ఈ విధానంలో ఓ షీటును రోడ్డు దెబ్బతిన్న ప్రాంతంపై కప్పితేచాలు.. ఆ రహదారి సాధారణస్థితికి చేరుకుంటుందని నిపుణులు తెలిపారు.
ఎలా పనిచేస్తుంది?
* చాప చుట్టినట్లుగా ఉండే ఈ ప్రత్యేకషీటును ఎంత కావాలంటే అంత పరిమాణంలో కత్తిరించుకోవచ్చు. దీనిపై తారు ఆవిరి కాకుండా ఉండేందుకు ఒక పేపర్ ఉంటుంది. దాన్నితీసి మరమ్మతులు చేసేచోట షీట్ను అతికిస్తారు. అనంతరం దిమ్మిసతో కొడితే సరిపోతుంది. తారు, సిమెంటు రోడ్ల మరమ్మతులకు ఉపయోగపడే రీతుల్లో సెయింట్ గోబైన్ సంస్థ దీన్ని రూపొందించింది.
* శాండ్విచ్ మాదిరిగా ఇది పొరలు పొరలుగా ఉంటుంది. ఆ పొరల్లో తారు, సింథటిక్, ఫైబర్ మిళితమై ఉంటాయి. ఈ మూడింటితో ఉన్న ఆ పదార్థం నీటి తాకిడిని కూడా తట్టుకుంటుంది. అదే సిమెంటు రోడ్డుపై పడిన గుంతలను పూడ్చేందుకు రూపొందించిన పొరల్లో సిమెంటు, సింథటిక్, ఫైబర్ మిళితమై ఉంటాయి. సుమారు 69 చ.అడుగుల షీటును ఒక్కోరోల్గా ఆ కంపెనీ తయారు చేసింది.
* సాధారణంగా గుంతలు పడినచోట సంప్రదాయ పద్ధతుల్లో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. తర్వాత కంకర, తారు కలిపిన మిశ్రమాన్ని ఆ ప్రాంతంలో నింపి, చదును చేయాలి. అవసరం మేరకు రోలర్ను నడపాల్సి ఉంటుంది. ఇంతచేసినా కొద్దికాలానికి ఆ ప్రాంతం మళ్లీ గుంతలమయంగా మారుతుంటుంది. అమెరికా రోడ్ప్యాచ్ను ఒకదఫా వినియోగిస్తే కనీసం 4-5 ఏళ్లపాటు మన్నికగా ఉంటుందని అంచనా.
ఎక్కడెక్కడ ఉపకరిస్తుంది?
రహదారిపై గుంతలను పూడ్చేందుకు, మ్యాన్హోల్స్ వంటివి ఉన్న ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణ సమయంలోను, వంతెనలపై అస్తవ్యస్తంగా ఉన్న అతుకులను పూడ్చేందుకు ఈ షీటును ఉపయోగించవచ్చు. విద్యుత్, కేబుల్, నీటిపైపుల కోసం రోడ్లను తవ్విన తరవాత పూడ్చేటప్పుడు రహదారిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది.
* ఇద్దరు మనుషులు షీటును తీసుకువచ్చి ఎంతకావాలో అంత ముక్కను కత్తిరించి ఆ ప్రాంతంలో అతికిస్తే చాలు. 3-4 నిముషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. దీనికి ట్రాఫిక్ను మళ్లించాల్సిన అవసరం లేదు. భారీ యంత్రాలను ఉపయోగించాల్సిన పని అంతకన్నాలేదు. నేలమీద చాప పరిచినట్లు ఆ షీటు పరిస్తే చాలు.
మరమ్మతుల్లో ఇది విప్లవమే..
అమెరికన్ రోడ్ప్యాచ్.. రోడ్డు మరమ్మతుల్లో ఇదో విప్లవమే. అమెరికా, ఐరోపా దేశాల కన్నా మనదేశ రహదారులకు ఎంతో ఉపయుక్తం. మన రోడ్లపై ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా వర్షపునీరు ఎక్కువ సమయం నిలిచి రోడ్లు త్వరితగతిన దెబ్బతింటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ షీటు ఎక్కడ కావాలంటే అక్కడ.. ఎప్పుడు కావాలంటే అప్పుడు.. వినియోగించుకోవచ్చు. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఖర్చు తక్కువగానే ఉంటుందనే అధ్యయనాలు చెబుతున్నాయి. మన వాతావరణ పరిస్థితుల్లో ప్రయోగాత్మకంగా వినియోగించి దాని మన్నిక, వ్యయం తదితరాలను అంచనా వేయాలి.
కె.బిక్షపతి, డైరెక్టర్ జనరల్, న్యాక్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
యూటీఎస్ యాప్ పరిధి పెంపు
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు. -
ఏఈ పోస్టుల జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీజీపీ రవిగుప్తాకు పరిహారం చెల్లించండి
పనిచేయని రిక్లైనర్ సీటును కేటాయించి తీవ్ర అసౌకర్యం కలిగించడం, బిజినెస్(జెడ్) క్లాస్ టికెట్లో ఎకానమీ క్లాస్ సేవలందించిన నేపథ్యంలో డీజీపీ దంపతులకు రూ.2,07,500 పరిహారం చెల్లించాలని సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 ఆదేశించింది. -
విద్యుత్ సరఫరాపై చర్చకు సిద్ధం
విద్యుత్ రంగంపై మాజీ సీఎం కేసీఆర్ అవాస్తవ ప్రకటనలు చేస్తూ లోక్సభ ఎన్నికల ముందు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. -
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు.