భగీరథ నీరు.. డయేరియా పరారు
వాగులు, చెలిమెల నీరు తాగి అనేక రకాల వ్యాధులతో సతమతమైన గిరిజన ప్రాంతాలు భగీరథ నీటి సరఫరాతో క్రమేపీ స్వస్థత పొందుతున్నాయి.
టైఫాయిడ్ కేసుల తగ్గుదల
ఏజెన్సీ ప్రాంతంలో మెరుగుపడుతున్నఆరోగ్య పరిస్థితులు
అందుబాటులో వైద్యమూ అక్కరకొస్తున్న వైనం
ఈనాడు డిజిటల్, ఆసిఫాబాద్: వాగులు, చెలిమెల నీరు తాగి అనేక రకాల వ్యాధులతో సతమతమైన గిరిజన ప్రాంతాలు భగీరథ నీటి సరఫరాతో క్రమేపీ స్వస్థత పొందుతున్నాయి. మెరుగైన వైద్య పరిస్థితులూ ఇందుకు దోహదం చేస్తున్నాయి. కలుషిత నీటితో ప్రధానంగా డయేరియా విజృంభిస్తుంది. టైఫాయిడ్, కామెర్లు వంటివి పీడించుకు తింటాయి. దేశంలో వెనుకబడిన 125 జిల్లాలను నీతి ఆయోగ్ గుర్తించగా, అందులో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెండో స్థానంలో ఉంది. జిల్లాలో 1,142 గ్రామాలు ఉండగా కలుషిత నీటితో ప్రాణాలు సైతం పోయిన సందర్భాలు ఉన్నాయి. కిప్రోస్టోరిడియం, ఈకోలి బ్యాక్టీరియాలు, షెగెల్లా క్రిములు వాగులు, చెలిమెల్లో మిళితమై ఉండడం, ఈ నీటినే ఇక్కడి ప్రజలు తాగడంతో టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధుల బారిన పడేవారు. కొన్ని చోట్ల చాలా లోతుకు బోర్లు వేసి కఠినమైన జలాలను తీసుకునేవారు. దీంతో కిడ్నీలు చెడిపోయిన ఘటనలు లింగాపూర్, సిర్పూర్(యు) మండలాల్లో ఉన్నాయి. భౌగోళికంగా 220-280 మీటర్ల ఎత్తు కొండలతో ఉండే జిల్లాలో అన్ని గ్రామాలకు అతికష్టం మీద అధికారులు భగీరథ నీటిని అందిస్తున్నారు. 2018 నుంచి ప్రత్యేక జీఏ పైప్లైన్లు వేసి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. దీనివల్ల కలుషిత నీటి వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు క్రమంగా తగ్గుముఖం పట్టాయని వైద్యులు గుర్తించారు. వైద్య సేవల విస్తరణ, పారిశుద్ధ్య పరిస్థితులపై పెరుగుతున్న అవగాహనతో ఆదివాసీల ఆరోగ్యాలు మెరుగుపడుతున్నాయి. మలేరియా, డెంగూ వంటివీ దారికొస్తున్నాయి. ఈ జిల్లాలో 2016లో మలేరియా కేసులు 713 నమోదవగా ఆ తర్వాత కొద్దిగా హెచ్చుతగ్గులున్నా 2021 నాటికి 77కి చేరాయి. ఈ సంవత్సరంలోనూ అటూఇటుగా అదే పరిస్థితులున్నాయి. ఆసుపత్రి ప్రసవాలు, కేసీఆర్ కిట్ వంటివాటితో మాతాశిశు మరణాల్లోనూ తగ్గుదల కనిపిస్తోంది. 2018లో ఈ జిల్లాలో 15 మంది గర్భిణులు ప్రాణాలు కోల్పోయినట్లు నమోదైంది. 2021లో 6, 2022లో ఇప్పటిదాకా 3గా రికార్డయ్యాయి. శిశు మరణాలు 2018లో 28 కాగా ఈ సంవత్సరం ఇప్పటికి 21గా ఉంది.
మహిళలకు తప్పిన నడక బాధ
భగరీథ నీటి సరఫరా కారణంగా మహిళలకు కిలోమీటర్ల దూరం నడిచే బాధ తప్పింది. ప్రతి ఇంటికి 100 లీటర్ల తాగునీరు సరఫరా కావడంతో ఇంతకు ముందులా టబ్బుల్లో, బకెట్లలో నీటి నిల్వ తగ్గిపోవడంతో దోమలకు ఆవాసం కరవై మలేరియా వ్యాప్తి క్రమంగా దూరమవుతోంది. ‘‘2013 నుంచి 2019 వరకు ఉట్నూర్ అదనపు వైద్యాధికారిగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో విధులు నిర్వహించా. మిషన్ భగీరథ నీరు సరఫరా ప్రారంభమయ్యాక, అంతకు పూర్వం నివేదికలు పరిశీలించాం. డయేరియా, టైఫాయిడ్ కేసుల్లో తేడా బాగా వస్తోంది. కలుషిత నీటితో వాటిల్లే వ్యాధులు తగ్గుముఖం పడుతున్నాయన్నది సుస్పష్టంగా తెలుస్తోంది’’ అని వివరించారు ప్రస్తుత డీఎంహెచ్వో ప్రభాకర్ రెడ్డి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం