అవుటర్ చుట్టూ మెట్రో
హైదరాబాద్ చుట్టూ, అవుటర్ రింగ్రోడ్డు వెంబడి మెట్రో రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు.
కేంద్రం సహకారం ఉన్నా, లేకున్నా.. విస్తరిస్తాం
వసతుల కల్పనకు ఆర్ అండ్ డీ అవసరం
ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రో శంకుస్థాపన సభలో సీఎం కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్; న్యూస్టుడే-బండ్లగూడ జాగీరు, నార్సింగి: హైదరాబాద్ చుట్టూ, అవుటర్ రింగ్రోడ్డు వెంబడి మెట్రో రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇంకా చాలా ప్రాంతాలకు విస్తరించడంతోపాటు బీహెచ్ఈఎల్ నుంచి ఎక్స్ప్రెస్ మెట్రో లైన్ కలపాల్సి ఉందన్నారు. కేంద్రం సహకారం ఉన్నా లేకున్నా భవిష్యత్తులో ఈ సౌకర్యాలన్నీ కల్పిస్తామని స్పష్టం చేశారు. మెట్రో రైలు రెండో దశకు సీఎం శుక్రవారం శంకుస్థాపన చేశారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించతలపెట్టిన ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రోకు మైండ్స్పేస్ వద్ద శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం అప్పా కూడలిలోని పోలీసు అకాడమీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. ‘విమానాశ్రయంలో ట్రాఫిక్ పెరిగిపోయింది. గత పాలకుల నిర్లక్ష్యంతో విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీ లేదు. రూ.6,250 కోట్లతో 31 కి.మీ. ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రోకి వంద శాతం రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏ, జీఎంఆర్ నిధులతో శంకుస్థాపన చేసుకుని శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉంది. ఇందులో 27.5 కి.మీ. ఆకాశమార్గం, 2.5 కి.మీ. భూగర్భంలో, ఒక కిలోమీటరు భూ మార్గంలో మెట్రో మార్గం వస్తుంది. ఈ పనులు సత్వరం ప్రారంభమవుతాయి. ఇది 100- 120 కి.మీ. వేగంతో ప్రయాణించే మెట్రో. హైదరాబాద్లో ఏ మూలన ఉన్న సులువుగా విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఈ ప్రాజెక్టు కల్పిస్తుంది’ అని సీఎం వివరించారు.
దిల్లీ కంటే పెద్దది
‘చరిత్రలో, వర్తమానంలో సుప్రసిద్ధ నగరం హైదరాబాద్. ఒక సందర్భంలో దేశ రాజధాని దిల్లీ కంటే వైశాల్యం, జనాభాలో చాలా పెద్దది. చెన్నై, దేశంలోని అనేక ఇతర నగరాల కంటే ముందుగానే 1912లోనే విద్యుత్తు వచ్చిన నగరమిది. ఇది నిజమైన కాస్మోపాలిటన్ సిటీ. అన్ని వర్గాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, జాతులను అక్కున చేర్చుకుని అద్భుతమైన విశ్వనగరంగా మారింది. ఏ నగరంలోనూ లేని అద్భుతమైన సమశీతోష్ణ వాతావరణం ఇక్కడ ఉంటుంది. భూకంపాలు రాకుండా సురక్షితంగా ఉండే నగరమిది.’
పట్టుబట్టి పవర్ ఐలాండ్గా మార్చాను
‘సమైక్య రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యంతో హైదరాబాద్లోసమగ్రత లేకుండా చాలా విషయాల్లో ఇబ్బందులు పడ్డాం. కృష్ణా, గోదావరి మంచినీటి పథకాలు ప్రారంభించినా.. అనుమతులు లేక నత్తనడక నడిచాయి. అవన్నీ పూర్తి చేసి నీటి సమస్య లేకుండా చేసుకున్నాం. క్షణం కూడా కరెంట్ పోకుండా ఏర్పాటు చేసుకున్నాం. నేనే పట్టుబట్టి హైదరాబాద్ను పవర్ఐలాండ్గా మార్చాను. న్యూయార్క్, లండన్, ప్యారిస్లో కరెంట్ పోవచ్చు గానీ హైదరాబాద్లో పోదు. ఎస్ఆర్డీపీ, ఫ్లైఓవర్లు, అండర్పాస్లతో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించుకున్నాం. 40 నుంచి 60 అంతస్తుల ఆకాశహర్మ్యాలకు అనుమతులిస్తున్నాం. ఇలాంటి చర్యలతో ఐటీ, పారిశ్రామిక, నిర్మాణరంగాలు అద్భుతంగా పురోగమిస్తున్నాయి.’ ‘బతకడానికి వచ్చేవారు.. బతుకు బాగుందని వచ్చే వారితో ఏటా హైదరాబాద్ జనాభా లక్షల్లో పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగా డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాల్సి ఉంది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఆర్ అండ్ డీని ఏర్పాటు చేసుకుని పురోగమించాలి. పురపాలక మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో చాలా విజయాలు, మరిన్ని మౌలిక వసతులు సాధించాల్సి ఉంది ’ అని కేసీఆర్ అన్నారు. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. మెట్రో నగరాల్లో హైదరాబాద్ ఆదర్శమని, సీఎం కేసీఆర్ దార్శనికతతో పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. శంషాబాద్, కొత్వాల్గూడ, మణికొండ ప్రాంతాల్లో పేద రైతుల భూ సమస్యలను పరిష్కరించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ కోరగా, పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.
చెక్కుల అందజేత
అంతకుముందు ఉదయం 11.24 గంటలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక బస్సులో రహేజా మైండ్ స్పేస్కు చేరుకున్నారు. వేద మంత్రోచ్చారణల మధ్య పండితులు ఆయనను పూర్ణకుంభ స్వాగతంతో శంకుస్థాపన స్థలికి తీసుకెళ్లారు. అక్కడ కేసీఆర్ చండీమాతకు ప్రత్యేక పూజలు చేశారు. 11.30 గంటలకు మెట్రో రెండోదశ నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 11.34 నిమిషాలకు పోలీసు అకాడమీ మైదానంలో సభకు సీఎం పయనమయ్యారు. ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రోలో 10 శాతం భాగస్వాములుగా ఉన్న హెచ్ఎండీఏ తరఫున రూ.625 కోట్ల చెక్కును కమిషనర్ అర్వింద్కుమార్, జీఎంఆర్ తరఫున రూ.625 కోట్ల చెక్కును ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు చల్ల ప్రసన్న, కిశోర్కుమార్ సీఎంకు సభలో అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, మహమూద్ అలీ, ప్రశాంత్రెడ్డి, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికపూడి గాంధీ, వివేకానందగౌడ్, సుధీర్రెడ్డి, మాగంటి గోపీనాథ్, సాయన్న, ఎమ్మెల్సీ వాణీదేవి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, ఎయిర్పోర్ట్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం సభలో ప్లకార్డుల కలకలం
సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో టీఆర్టీ-2017 ఉర్దూ మీడియం కాంట్రాక్టు అభ్యర్థులు.. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించడంతో ఉలిక్కిపడిన పోలీసులు వారి వద్దకు పరుగు తీశారు. డీజీపీ మహేందర్రెడ్డి సైతం వేదికపై నుంచి కిందకు వెళ్లి తగు ఆదేశాలిచ్చారు. అనంతరం ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని బయటకు తరలించారు.
ఎయిర్పోర్ట్ మెట్రో మార్గమిలా..
నాగోల్-రాయదుర్గం కారిడార్-3కు కొనసాగింపుగా ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రోను నిర్మిస్తున్నారు. ఇది మైండ్ స్పేస్ నుంచి బయోడైవర్సిటీ, కాజాగూడ, నానక్రాంగూడ కూడలి, ఓఆర్ఆర్ లోపల వైపు నుంచి నార్సింగి, అప్పా కూడలి, రాజేంద్రనగర్, శంషాబాద్, విమానాశ్రయ కార్గో, విమానాశ్రయంలోకి నేరుగా చేరుకుంటుంది. ఈ మార్గంలో 9 స్టేషన్లు రానున్నాయి. సీఎం రాక సందర్భంగా.. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి మైండ్స్పేస్ వైపు వెళ్లే వాహనాలను సైబర్టవర్స్ వద్ద మళ్లించి, సీవోడీ జంక్షన్ నుంచి ఇనార్బిట్ మాల్వైపు వదిలారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం