కొందరికి వరం.. మరికొందరికి భారం
హైదరాబాద్ శివారు జవహర్నగర్ ప్రాంతంలో 2010కి ముందు ఓ వ్యక్తి 300 చ.గజాల ప్రభుత్వ స్థలాన్ని మరొకరి నుంచి రూ.2 లక్షలకు కొనుగోలు(నోటరీ ఒప్పందం) చేసి రేకుల ఇల్లు కట్టుకున్నాడు.
భారీగా పెరిగిన భూముల ధరలు.. క్రమబద్ధీకరణకు కష్టాలు
125 గజాల విస్తీర్ణానికి మించి భూమి ఉన్న పేదలకు చుక్కలు
ఈనాడు - హైదరాబాద్
హైదరాబాద్ శివారు జవహర్నగర్ ప్రాంతంలో 2010కి ముందు ఓ వ్యక్తి 300 చ.గజాల ప్రభుత్వ స్థలాన్ని మరొకరి నుంచి రూ.2 లక్షలకు కొనుగోలు(నోటరీ ఒప్పందం) చేసి రేకుల ఇల్లు కట్టుకున్నాడు. ఇటీవల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోగా అధికారులు రూ.13.27 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని నోటీసు పంపారు. ప్రైవేటు ఉద్యోగంతో బతుకుబండి లాగే ఆయన అంత మొత్తం ఎలా చెల్లించాలని తలపట్టుకున్నారు. కలెక్టర్కు అర్జీ పెట్టుకున్నారు. నగర శివారుల్లోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది.
నూట ఇరవై అయిదు చదరపు గజాలలోపు ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు క్రమబద్ధీకరణ వరంగా మారగా.. అంతకు మించి విస్తీర్ణానికి క్రమబద్ధీకరణ మైదాన ప్రాంతాల్లో కొందరికి భారంగా మారుతోంది. కాలక్రమంలో భూముల ధరలు భారీగా పెరగడమే దీనికి కారణమవుతోంది. 2014కు ముందు నగరాలు, పురపాలికలు, మైదాన ప్రాంతాల శివారుల్లో భూముల ధరలు స్వల్పంగా ఉండేవి. రూ.వేలల్లో చెల్లిస్తే నివాసానికి వీలైన భూమి దొరికేది. ఎసైన్డ్ తదితర భూములు కూడా చౌకగా వచ్చేవి. చాలామంది రిజిస్ట్రేషన్ లేకున్నా స్థలాలు కొని ఇళ్లు కట్టుకున్నారు. రానురాను ఈ ప్రాంతాల్లో భూముల ధరలు ఎన్నో రెట్లు పెరిగాయి. ఇప్పుడు ఆ భూములు క్రమబద్ధీకరించుకోవాలంటే రూ.లక్షల్లో రుసుం చెల్లించాల్సి రావడం పేద, మధ్యతరగతి వారిని ఇబ్బందిపెడుతోంది. ఈ నెలాఖరుకు క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను శనివారం ఆదేశించిన సంగతి తెలిసిందే. 125 చ.గజాలకు మించి స్థలాన్ని అధీనంలో ఉంచుకున్నవారు మార్కెట్ ధరను అనుసరించి ప్రభుత్వానికి రుసుం చెల్లించాలి. దీనికి సంబంధించి నాలుగు రకాలుగా చెల్లింపులను నిర్ధరించారు. భూముల ధరలు భారీగా పెరిగినందున ఇప్పుడు క్రమబద్ధీకరించుకోవడానికి పెద్ద మొత్తం సర్దుకోవాల్సి వస్తోంది. హైదరాబాద్ శివారుల్లో కాప్రా, అల్వాల్, జగద్గిరిగుట్టతోపాటు అనేక ప్రాంతాల్లో భూముల ధరల్లో మార్పులు వచ్చాయి. మార్కెట్ ధరను అనుసరించి ప్రభుత్వ అంచనాల మేరకు రుసుం నిర్ణయించి కలెక్టర్లు నోటీసులు జారీ చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. క్రమబద్ధీకరణ పూర్తిచేసుకుంటే ఆ స్థలంపై బ్యాంకు రుణం వచ్చే అవకాశాలు ఉండటం ఊరటనిచ్చే అంశమైనా ఇప్పుడు సొమ్ము సర్దుబాటు కావడం కష్టమని సామాన్యులు వాపోతున్నారు.
* జీవో ఎంఎస్.నం.59 అనుసరించి క్రమబద్ధీకరణకు 3 కిస్తీలలో ప్రభుత్వానికి రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
* 150 చ.గజాలలోపు నివాస స్థలాలకు ప్రభుత్వం గుర్తించిన మురికివాడల్లో మార్కెట్ ధరలో 10, ఇతర ప్రాంతాల్లో 25 శాతం చెల్లించాలి.
* 250 చ.గజాల వరకు స్థలాలకు 25 శాతం
* 500 చ.గజాల వరకు 50 శాతం
* 1000 చ.గజాల వరకు స్థలాలకు 75 శాతం
125 చ.గజాల వరకు
125 చ.గజాల స్థలం వరకు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలు ఆక్రమించి ఉంటే ఉచితంగానే దానిని క్రమబద్ధీకరించనున్నారు. ఇలాంటివి 95వేల వరకు దరఖాస్తులు అందగా పరిశీలన పూర్తయింది. పెద్దఎత్తున దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలిసింది. ఒక్కొక్కరికి రెండు, మూడు ఇళ్లు ఉండటం, కుటుంబంలో ఉద్యోగులు, ఆదాయపన్ను చెల్లించే స్తోమత ఉన్నవారు కూడా దరఖాస్తుదారుల్లో ఉన్నట్లు గుర్తించారు.
ప్రక్రియ ఇలా..
* 2022 ఫిబ్రవరి-మార్చి మధ్య జీవో ఎంఎస్.నం.58, 59ల కింద దరఖాస్తులు స్వీకరించగా దాదాపు 1.61 లక్షలు వచ్చాయి.
* 2014 జూన్ రెండో తేదీకి ముందు నుంచి స్థలం తమ ఆధీనంలో ఉన్నట్లు నల్లా, ఇంటి పన్నుల రసీదులు, విద్యుత్ బిల్లుల ఆధారాలు ఉండాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి