ఆమె కోసం ఆరోగ్య మహిళ
అంతర్జాతీయ మహిళా దినోత్సవ కానుకగా మార్చి 8న ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు వెల్లడించారు.
8న వంద ప్రభుత్వాస్పత్రుల్లో ప్రారంభిస్తాం
ఏప్రిల్ నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ
ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు
ఈనాడు, సంగారెడ్డి: అంతర్జాతీయ మహిళా దినోత్సవ కానుకగా మార్చి 8న ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు వెల్లడించారు. తొలిదశగా వంద ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ సేవలు అందుబాటులోకి తెస్తామని, ప్రతి మంగళవారం వైద్యులు, సిబ్బంది మొత్తం మహిళలే ఉంటారని వివరించారు. మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన వడ్డీలేని రుణాల్లో రూ.750 కోట్లు అదేరోజు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. సంతానలేమితో బాధపడేవారి కోసం రూ.16.5 కోట్లతో గాంధీ, పేట్లబుర్జు, వరంగల్లలో ఇన్ఫెర్టిలిటీ కేంద్రాలను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఏడాదిలో దాదాపు 4లక్షల మంది గర్భిణులకు ప్రయోజనం దక్కేలా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను ఏప్రిల్ నుంచి పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. దశలవారీగా అన్ని గ్రామాల్లోనూ మహిళా సంఘాల భవనాలను నిర్మిస్తామని ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి సెర్ప్ ఉద్యోగులకు వేతన పెంపు వర్తిస్తుందన్నారు. వీఏవో (గ్రామైక్య సంఘాల సహాయకులు)లకూ త్వరలోనే శుభవార్త వినిపిస్తామన్నారు. సంగారెడ్డి జిల్లాలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులతో మాట్లాడుతూ.... ర్యాగింగ్ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని, దాని జోలికి వెళ్లొద్దని సూచించారు.
వాళ్లను ప్రజలే రద్దు చేస్తారు
సంగారెడ్డి కలెక్టరేట్లో 59 జీవో కింద లబ్ధిదారులకు పట్టాలిచ్చే క్రమంలో హరీశ్రావు మాట్లాడుతూ... ధరణిపై అవగాహన లేని కాంగ్రెస్సోళ్లు దాన్ని రద్దు చేస్తామంటున్నారని, అలా మాట్లాడేవాళ్లనే ప్రజలు రద్దు చేస్తారన్నారు. కార్యక్రమాల్లో వైద్యవిద్య సంచాలకుడు రమేశ్ రెడ్డి, సంగారెడ్డి జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ, తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, చేనేత అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు చింతా ప్రభాకర్, అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
‘మల్లారెడ్డి అభిమాని’తో ముచ్చట!
సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనాన్ని మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. బీఏ తొలి సంవత్సరం విద్యార్థి సంగమేశ్వర్ను వేదిక వద్దకు రావాలని కోరారు. ‘మల్లారెడ్డి ఫ్యాన్.. మల్లారెడ్డి ఫ్యాన్’ అంటూ విద్యార్థులంతా అరవడంతో ‘మంత్రి మల్లారెడ్డిలా మాట్లాడు’ అంటూ మైక్ అందించారు. అతను ‘పాలమ్మిన... పూలమ్మిన’ అంటూ మల్లారెడ్డిని అనుకరించే ప్రయత్నం చేశారు. మల్లన్న సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతున్నట్లుండు.. మాలాంటోళ్లకే హిట్స్ లేవంటూ హరీశ్ చమత్కరించారు. మల్లారెడ్డి చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పైకొచ్చారని, కష్టపడి పనిచేస్తే ఎవరైనా ఉన్నతంగా జీవించొచ్చని స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరు రోజులుగా నక్కి.. ఎరకు చిక్కి
శంషాబాద్ విమానాశ్రయ రన్వే మైదానంలోకి గత నెల 27న చొరబడి అందరినీ కంగారుకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. -
వామనరావు దంపతుల హత్య కేసు.. సీబీఐకి అప్పగించేందుకు సిద్ధం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని హైవేలో 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాదులు గట్టు వామనరావు దంపతుల హత్యకేసు దర్యాప్తును సీబీఐ లేదా సీఐడీకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
కోర్టులో నేరుగా హాజరుపరచాలని కవిత దరఖాస్తు
ప్రస్తుతం దిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు ముందు విచారణ జరిగే సమయంలో తనను నేరుగా హాజరుపరచాలంటూ భారాస ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు దాఖలుచేశారు. -
సులభతర వాణిజ్య విధానంలో మరిన్ని సంస్కరణలు
సులభతర వాణిజ్య విధానం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-ఈఓడీబీ)లో అత్యుత్తమ సేవలు కొనసాగించాలని, ఇందుకోసం మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఆదేశించారు. -
నిబంధనలు ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై చర్యలు
తెలంగాణలో నిబంధనలను ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై విద్యాశాఖ కొరడా ఝుళిపించింది. ఇంటర్ విద్యామండలి ఆదేశాలను విస్మరించి వేసవి సెలవుల్లో కళాశాలలను నిర్వహించడం, ప్రవేశాలు కల్పించినందుకుగాను ఒక్కో కళాశాలపై రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వం కోరితే.. పదోన్నతులకు టెట్ మినహాయింపునిస్తాం
తెలంగాణలో 2010 కన్నా ముందు నియమితులై 1 నుంచి 5 తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే వెంటనే ఉత్తర్వులిస్తామని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఛైర్మన్ యోగేశ్ సింగ్ తెలిపారు. -
టెట్ పరీక్షల షెడ్యూలు విడుదల
ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024 షెడ్యూలును విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. -
6న ఈసెట్
టీఎస్ ఈసెట్-2024 ప్రవేశ పరీక్ష మే 6వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. -
ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు
ఎండల తీవ్రత దృష్ట్యా జాతీయ ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు. -
ఆర్టీసీ రిజర్వేషన్ ఛార్జీలపై మినహాయింపు
దూరప్రాంత బస్ సర్వీసుల్లో రిజర్వేషన్ ఛార్జీలపై టీఎస్ఆర్టీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. -
40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ.32 వేలు, గరిష్ఠంగా రూ.2,95,460 ఉండాలని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర గెజిటెడ్ అధికారుల (టీజీవోల) సంఘం కోరింది. -
రోహిత్ వేముల ఆత్మహత్య కేసు పునర్విచారణ
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో ముఖ్య పరిమాణం చోటుచేసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు ముగిసిన దశలో కీలక మలుపు తిరిగింది. -
హెచ్సీయూ వీసీ, నేతలపై నమోదైన కేసులో ఆధారాల్లేవు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. -
రాష్ట్రంలో బోర్లు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చండి
రాష్ట్రంలో ఏయే కేటగిరీల కింద ఎన్ని బోర్లు ఉన్నాయో లెక్కలు తేల్చాలని భూగర్భ జలవనరుల మదింపుపై ఏర్పాటైన రాష్ట్ర స్థాయి కమిటీ వివిధ ప్రభుత్వ శాఖలకు సూచించింది. -
తాగునీళ్లు ఇచ్చేందుకు కర్ణాటక సానుకూలత!
తెలంగాణకు కర్ణాటక ప్రాజెక్టుల నుంచి కొంత నీటిని ఇచ్చేందుకు ఆ రాష్ట్రం సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. -
అజీర్తి సమస్యకు మామిడి పండే ఔషధం!
పోషకాలకు, రుచికి పెట్టింది పేరైన మామిడి పండు.. అజీర్తి నివారణకు సహజ ఔషధంగా పనిచేస్తుందని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) ఆచార్యులు తమ పరిశోధనలో గుర్తించారు. -
అదనపు ఆదాయానికి ఆర్టీసీ అధికారుల ఒత్తిడి
బస్సులతో అదనపు ఆదాయం తేవాలంటూ ఆర్టీసీ యాజమాన్యం కార్మికులపై ఒత్తిడి పెంచుతోందని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఎస్డబ్ల్యూయూ) మండిపడింది. -
సెంచరీ దాటిన బీన్స్ ధర
బీన్స్ ధర సెంచరీ దాటింది. శుక్రవారం హైదరాబాద్లోని రైతుబజార్లలో కిలో బీన్స్ ధర రూ.105గా నిర్ణయించారు. -
రూ.12 కోట్ల ఎగవేత.. రైస్ మిల్లు సీజ్
కస్టమ్ మిల్లింగ్ రైస్ను అప్పగించకుండా నాలుగేళ్లుగా జాప్యం చేస్తున్న రైస్ మిల్లును అధికారులు సీజ్ చేశారు. -
భారాస ఫిర్యాదుపై చట్టప్రకారం చర్యలు తీసుకోండి
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తమ నేతలపై పలువురు చేస్తున్న అసత్య ఆరోపణల నియంత్రణకు గూగుల్, యూట్యూబ్ చర్యలు తీసుకోవడం లేదంటూ భారాస చేసిన ఫిర్యాదును చట్టప్రకారం పరిష్కరించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
రాష్ట్రంలో బాలింతల మరణాలను నివారించాలి
అత్యాధునిక వైద్య వసతులను ఉపయోగించుకుని రాష్ట్రంలో బాలింతల మరణాలను పూర్తిగా నివారించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!